News

AP

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు నమోదు..!

అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తులూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు.   వైకాపా ప్రభుత్వ హయాంలో ముత్తుకూరు మండల పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటెయినర్ల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారని…

AP

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..! యాంకర్ కొమ్మినేని అరెస్టు..

అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. కొమ్మినేనిని ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై సాక్షి టీవీ చర్చలో మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కొమ్మినేనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో…

AP

పిఠాపురం నియోజకవర్గ యువతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్..!

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ యువతకు శుభవార్త తెలిపారు. పిఠాపురంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.   మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురానికి చెందిన 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లతో నిన్న ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. విద్యుత్ పనులు చేసే సమయంలో ఎలక్ట్రీషియన్లు తప్పనిసరిగా రక్షణ పరికరాలు వాడాలని సూచించారు.  …

AP

జగన్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని పోలీసులతో చేయకూడని పనులన్నీ చేయించారు: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ..

జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో చేయకూడని పనులన్నీ చేయించారని, తప్పుడు కేసులు పెట్టించారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గుంటూరు జనచైతన్య వేదిక హాలులో ‘పోలీసు వ్యవస్థలో సంస్కరణలు’ అనే అంశంపై నిన్న జరిగిన చర్చా గోష్ఠిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.   జగన్‌పై అనేక కేసులు ఉన్నా చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని ఏడేళ్లుగా న్యాయస్థానానికి వెళ్లడం లేదన్నారు. పోలీసు శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తేనే మెరుగైన…

TELANGANA

కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటెల రాజేందర్ ఏం చెప్పారు..? దాదాపు 45 నిమిషాల సేపు 19 ప్రశ్నలు..?

కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటెల రాజేందర్ ఏం చెప్పారు? మాజీ సీఎం కేసీఆర్ ఇరుక్కున్నట్టేనా? మీడియా ముందు ఆయన మాటలు దేనికి సంకేతాలు? కేవలం ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై మాత్రమే ఆయన్ని ప్రశ్నించిందా? దాదాపు 45 నిమిషాల సేపు 19 ప్రశ్నలు సంధించిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు ఎంపీ ఈటెల రాజందర్ హాజరయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బీఆర్కేభవన్‌లో కమిషన్ ముందు హాజరయ్యారు. దాదాపు 45 నిమిషాల…

TELANGANA

బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి కాదు.. దెయ్యాల రాజ్య సమితి.. సీఎం రేవంత్ సంచలన వాఖ్యలు..!

బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి కాదని.. దెయ్యాల రాజ్య సమితి DRS అని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కొరివి దెయ్యాలను తెలంగాన పొలిమేర దాటే వరకు తరిమికొట్టాలని పిలుపుఇచ్చారు. బంగారు తెలంగాణను బొందలగడ్డ తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. తమ పార్టీలో దెయ్యాలు చేరాయని బీఆర్ఎస్ వాళ్లే అంటున్నారని గుర్తు చేశారు. ఇంటి ఆడబిడ్డే దెయ్యాలు ఉన్నాయంటే నోరువిప్పలేక దెయ్యాల నేత ఫాంహౌజ్‌లో నిద్రపోతున్నారని అన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ ఆ పాపాలు చేసినందుకే.. ఫాంహౌజ్‌కు దారి…

AP

ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం జరగాల్సి ఉన్న కోర్టు విచారణ మరోసారి వాయిదా పడింది. బెయిల్ ఇవ్వాల‌ని నిందితులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై విజ‌య‌వాడ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం తదుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వంటి దర్యాప్తు సంస్థలు ఈ ప్రతిష్ఠాత్మక కేసులో తమ విచారణను…

National

సింధూ జలాల కోసం పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి.. భారత్‌కు వరుస లేఖలు..!

సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ పాకిస్థాన్ ఇప్పటివరకు నాలుగు సార్లు భారత్‌కు లేఖలు రాసింది. మే నెల ఆరంభంలో ఒక లేఖ పంపగా, ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం మరో మూడు లేఖలు పంపినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ లేఖలు పాకిస్థాన్ జలవనరుల శాఖ నుంచి భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు అందినట్లు సమాచారం.   సింధూ నదీ జలాలను నిలిపివేస్తే…

AP

ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతాన్ని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. శుక్రవారం నాడు సచివాలయంలో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కూలంకషంగా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన అజెండాగా ఈ భేటీ సాగింది.   ఈ సందర్భంగా, 8 జిల్లాలను కలుపుతూ విశాఖపట్నం కేంద్రంగా…

National

బంగ్లాదేశ్ చొరబాటుదారుల చేతికి చిక్కిన భారత సైనికుడు..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు దుండగులు భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్‌ను అపహరించి, కొన్ని గంటల పాటు బందీగా ఉంచుకున్నారు. బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళంతో చర్చలు జరపడంతో ఆ జవాన్ సురక్షితంగా విడుదలయ్యాడు.   అసలేం జరిగింది? అధికారిక వర్గాల సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా పరిధిలో ఈ ఘటన…