News

TELANGANA

మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కానున్న హైదరాబాద్..

మిస్ వరల్డ్-72 పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో 120 దేశాల నుండి యువతులు పాల్గొననున్నారు.   ‘బ్యూటీ విత్ ఏ పర్సన్’ అనే థీమ్‌తో ఈ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 7వ తేదీ నుండి 31వ తేదీ వరకు తెలంగాణ వేదికగా…

TELANGANA

తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం తథ్యమని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మనం తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్‌కు ఏమీ కాదని స్పష్టం చేశారు.   తెలంగాణ అస్థిత్వ పార్టీ బీఆర్ఎస్ అని ఆయన…

AP

ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం.. త్వరలో రైతు సాధికార సంస్ధతో కీలక ఒప్పందం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల దావోస్ పర్యటనలో పలు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వివరించి ప్రకృతి వ్యవసాయంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో నాడు చంద్రబాబుతో భేటీ అయిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు బుధవారం ఏపీకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఛైర్మన్ క్రేయిగ్ కోగుట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గినా మెగ్‌కార్తీ, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సీఈవో కీత్ అగోడా ముఖ్యమంత్రితో…

AP

వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాకిచ్చిన‌ హైకోర్టు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆయ‌న దాఖ‌లు చేసిన ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ ను న్యాయ‌స్థానం కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో ముంద‌స్తు బెయిల్ కావాల‌ని వంశీ పిటిష‌న్ వేశారు. ఆయ‌న పిటిష‌న్ ను విచారించిన హైకోర్టు దానిని కొట్టివేసింది. కాగా, ద‌ళిత యువ‌కుడు స‌త్య‌వ‌ర్ధ‌న్‌ కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న విజ‌య‌వాడ…

National

త్వరలో అందుబాటులోకి క్యాన్సర్ టీకా: కేంద్రమంత్రి జాదవ్..

మహిళలను ప్రభావితం చేస్తున్న క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు మరో ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ వెల్లడించారు. అయితే, ఈ టీకా వేసుకోవడానికి 9 నుండి 16 ఏళ్ల లోపు వయస్సు ఉన్న బాలికలు మాత్రమే అర్హులని తెలిపారు. ఈ టీకాపై పరిశోధనలు పూర్తి కావొచ్చాయని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.   ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని,…

National

భారత్ లోకి టెస్లా..! ప్రధానితో మస్క్ భేటీ తర్వాత మారిపోయిన సీన్..

అంతర్జాతీయంగా టెస్లా కార్లతో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.. అతిపెద్ద ఆటోమొబైళ్ల వినియోగదారులున్న భారత్ లో అడుగుపెట్టాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది. కానీ.. సంస్థ ప్రణాళికలు, భారత్ లోని చట్టాలకు మధ్య పొంతన కుదరక ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న, అభివృద్ధిలో పరుగులు పెడుతున్న భారత్ వంటి మార్కెట్లోకి ప్రవేశించలేకపోయింది. కానీ.. ఇటీవల మారిపోతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో.. ఎలాన్ మస్క్ టెస్లా కార్లు భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది.…

AP

జగన్‌కు కష్టాలు తప్పవా..?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు మళ్లీ ఇబ్బందులు తప్పవా? ప్రజల్లో సానుభూతి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఏదో విధంగా జైలుకి వెళ్లాలని నిర్ణయించుకున్నారా? కావాలనే పోలీసులను ఆయన బెదిరించారా? బెయిల్‌పై వున్న జగన్ ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? ఎందుకు జగన్ సహనం కోల్పోయారు? దీనిపై కూటమి సర్కార్ ఆలోచన ఎలా ఉంది? కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   నోరు జారుతున్న జగన్   వైసీపీ అధినేత…

TELANGANA

రాష్ట్ర అవసరాలపై మంత్రి సీతక్క ప్రజెంటేషన్.. నిధులు ఇవ్వమని కేంద్రానికి విజ్ఞప్తి..

తెలంగాణ‌లోని తాగునీటి వ్య‌వ‌స్థ స్థిరీక‌ర‌ణ‌ కోసం అవ‌స‌ర‌మైన‌ నిధులు మంజూరు చేయాల‌ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క కేంద్ర ప్ర‌భుత్వాన్ని విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ తాగునీటి అవ‌స‌రాలు తీర్చేందుకు నీతి ఆయోగ్ గ‌తంలో సిఫార్సు చేసిన విధంగా క‌నీసం రూ.16 వేల కోట్ల‌ను మంజూరు చేయాల‌ని కోరారు. ప్ర‌తి ఏటా తాగు నీటి అవ‌స‌రాల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం సుమారు రూ. 5 వేల కోట్ల‌ను వెచ్చిస్తుంద‌ని గుర్తు చేశారు. కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ…

TELANGANA

ఆరు నెలల తర్వాత పార్టీ ఆఫీసుకు కేసీఆర్.. వాటిపై చర్చించే అవకాశం..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. చాన్నాళ్ల తర్వాత పార్టీ ఆఫీసుకు వస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇంతకీ గులాబీ బాస్ ప్లాన్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల వైపు కాకుండా.. కేవలం ఉప ఎన్నికలపై ఫోకస్ చేశారా? అందుకోసమే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారా? అవుననే అంటున్నారు కొందరు నేతలు.   ఎంతమంది హాజరు?   బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్…

AP

జనసేన ఆవిర్భావ వేడుకలపై కీలక నిర్ణయం..

జనసేన ఆవిర్భావ వేడుకలకు సంబంధించి ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను జనసేనాని పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించాలని జనసేన నిర్ణయించింది.   సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో జనసేన కీలకపాత్రను పోషించింది. ఘన విజయం తర్వాత మొదటి ఆవిర్భావ సభ కావడంతో… సభకు భారీ ఏర్పాట్లు…