ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేశ్ కుమార్.. ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి..
భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గత రాత్రి వేర్వేరుగా రెండు గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లలో సీనియర్ అయిన జ్ఞానేశ్ కుమార్ను సీఈసీగా ఎంపిక చేశారు. జ్ఞానేశ్ కుమార్ స్థానంలో ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. మరో ఈసీగా సుఖ్బీర్ సింగ్ ఉన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి…

