News

National

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‪గా జ్ఞానేష్ కుమార్..!

దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో జ్ఞానేష్ కుమార్ ను తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికోసం ఫిబ్రవరి 17న ఒక కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవికి ఎంపిక కమిటీ…

AP

ఏపీలో రోజు రోజుకి పెరుగుతున్న GBS కేసులు..

ఓవైపు బర్డ్‌ఫ్ల్యూ వైరస్..!! మరోవైపు GBS వ్యాధి..! తెలుగు రాష్ట్రాల్లో కొత్త రోగాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రను వణికించిన GBS.. ఇప్పుడు ఏపీలోనూ బయటపడింది. గుంటూరులో ఏడుగురికి ఈ వ్యాధి సోకింది. గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇందులో ఇద్దరు కోలుకొని డిశ్చార్జ్ కాగా, మరో ఐదుగురికి చికిత్స కొనసాగుతోంది. కాగా గురువారం నాడు శ్రీకాకుళంలో ఓ వ్యక్తికి సోకింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కూడా ఈ వ్యాధి లక్షణాలు…

AP

జేసీ ప్రభాకర్ రెడ్డి పై నేత కేసు – కూటమిలో రచ్చ..!

టీడీపీ సీనియర్ నేత జీసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదైంది. సినీ నటీ.. బీజేపీ నేత మాధవీ లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేసారు. తనను కించపరిచేలా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసార ని మాధవీ లత ఫిర్యాదు చేసారు. జేసీ మద్దతు దారుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు లో పేర్కొన్నారు. జేసీ నుంచి ప్రాణ హాని ఉందని చెప్పారు. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న ఈ…

TELANGANA

ప్రయాగ్ రాజ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తులు మృతి..

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు – కారు ఒకదానికొకటి ఢీకున్నాయి. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రయాగ్ రాజ్- మీర్జాపుర్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహాకుంభమేళాకు వెళ్తున్న ట్రావెల్ బస్సును కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి…

TELANGANA

టిడిపికి రెడ్ బుక్..! బిఆర్ఎస్ కు పింక్ బుక్..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నిరంకుశ పాలన సాగిస్తుంది అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని కవిత ఫైరయ్యారు. జనగామలో మాట్లాడిన ఆమె తాము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని ఇంతకింత చెల్లిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో రెడ్ బుక్ లా తెలంగాణలో పింక్ బుక్ మెయింటైన్ చేస్తామన్నారు.   లెక్క చూస్తాం… వదిలిపెట్టం: ఎమ్మెల్సీ కవిత తమ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు…

TELANGANA

కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం..

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 19న పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.   సమావేశ నిర్వహణకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలతో పాటు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు,…

AP

వ‌ల్ల‌భ‌నేని వంశీకి 14 రోజుల రిమాండ్‌.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత‌ వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతోపాటు ఏ7 శివరామకృష్ణ, ఏ8 నిమ్మా లక్ష్మీపతికి కూడా న్యాయ‌స్థానం 14 రోజుల‌ రిమాండ్ విధించడంతో వీరిని విజ‌య‌వాడలోని జిల్లా జైలుకు తరలించారు.   గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో పిటిషనర్ సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి సహా అట్రాసిటీ కేసుల కింద వల్లభనేని వంశీని గురువారం ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చారు.…

AP

జగన్ కు మరో షాక్..! చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆళ్ల నాని..

ఏలూరుకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. గురువారం ఉండవల్లికి వెళ్లిన ఆళ్ల నాని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నానికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.   ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు.…

National

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన..

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలసిిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్రపతి పాలను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్ లో 2023 నుంచి మైతేయి, కుకీ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి.   అయితే, సీఎం ఓ వర్గానికే మొగ్గు చూపుతున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శించారు.…

TELANGANA

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కులగణన పూర్తి కావడంతో ఈ నెల 15వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావించారు. కానీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కులగణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేపడుతున్నట్లు ప్రకటించారు.   ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్…