News

National

ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి అనుమానాస్పద మృతి..

అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోగి నివాసంలో శుక్రవారం రాత్రి కాల్పులు వినిపించాయి. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, ఆయన తలపై తుపాకితో కాల్చినట్లు కనిపించింది.   దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. తలలో రెండు బుల్లెట్లను అధికారులు గుర్తించారు. ప్రమాదవశాత్తు తుపాకీ పేలినట్లు కుటుంబ…

TELANGANA

వారికి రైతు భరోసా బంద్.. కలెక్టర్లకు తేల్చి చెప్పిన సీఎం రేవంత్..

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.   డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. తెలంగాణలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు…

TELANGANA

కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. ఏసీబీ విచారణకు సంబంధించిన విషయాలపై ఆరా..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో గురువారం కేటీఆర్‌ను ఏడు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏసీబీ విచారణకు సంబంధించిన విషయాలను కేసీఆర్‌కు కేటీఆర్ వివరించారు.   ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలు పదే పదే అడిగారని, విచారణకు పూర్తిగా సహకరించానని కేటీఆర్.. కేసీఆర్‌కు వివరించారు. ఈ భేటీలో మాజీ మంత్రి హరీశ్ రావతోపాటు…

AP

మాకెందుకీ పదవులు, బోర్డు Vs అధికారులు మధ్య రచ్చ..

టీటీడీలో రచ్చ కొనసాగుతోంది. తిరుపతి తొక్కిసలాట ఘటన పైన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చర్యలు.. డిప్యూటీ సీఎం ఆగ్రహంతో పాలక మండలి అత్యవసర భేటీ అయింది. అధికారుల తీరు పైన బోర్డు సభ్యులు విరుచుకుపడ్డారు. తొక్కిసలాటకు కారణం అధికారులే అని ఫైర్ అయ్యారు. ఛైర్మన్, సభ్యులు నేరుగా అధికారుల పైనే గురి పెట్టారు. ఈవో లక్ష్యంగా సభ్యులు విమర్శలు చేసారు. దర్శన టోకెన్ల కోటా గురించి చర్చకు వచ్చింది. దీంతో, తొక్కిసలాట రచ్చ టీటీడీలో…

AP

కొత్త రేషన్ కార్డుల జారీ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై..

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డుల జారీ పైన కసరత్తు పూర్తయింది. తొలుత సంక్రాంతికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల ని భావించారు. కానీ, రెవిన్యూ సదస్సుల కారణంగా అమలు కాలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు సాంకేతికత వినియోగించి జారీ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం దరఖాస్తుల స్వీకరణ.. జారీ పైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.   ప్రభుత్వం కసరత్తు…

National

నా వల్ల కూడా తప్పులు జరిగాయ్.. నేనూ మనిషినే, దేవుడిని కాదు..–: ప్రధాని మోడీ

జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. నిఖిల్ ఈ ఇంటర్వ్యూ ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రపంచంలోని యుద్ధ పరిస్థితులు, రాజకీయాల్లోకి యువత ప్రవేశం, మొదటి, రెండవ టర్మ్ పాలన మధ్య వ్యత్యాసంపై ప్రధాని మోడీ స్పందించారు. ఆ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి సారి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూకి హాజరైనట్లు తెలిపారు.   ఈ సందర్భంగా నిఖిల్ కూడా నేను హిందీ…

AP

తిరుపతి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల సాయం… కాంట్రాక్టు ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు..

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం తెలిసిందే. నేడు తిరుపతి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై నిప్పులు చెరిగారు. ఘటన స్థలిని స్వయంగా పరిశీలించిన ఆయన, ఆసుపత్రిలో క్షతగాత్రులను ఓదార్చారు. ఈ ఘటనలో ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసిన చంద్రబాబు… మరో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేశారు.   ఈ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు… కీలక నిర్ణయాలు ప్రకటించారు. మృతుల…

AP

తిరుమల సాక్షిగా పవన్ సీరియస్ వార్నింగ్.. ఇకపై ఆ విధానం రద్దు..?

తిరుమలలో వీఐపీ సంస్కృతి కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. టీటీడీ పాలక మండలి వీఐపీ ఫోకస్ వదిలి పెట్టి, సామాన్యులపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల జారీ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని స్విమ్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాధితులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ప్రమాదం జరగడానికి కారణాలపై అధికారులతో చర్చించారు.   తిరుమలలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని, వీఐపీ లపై…

TELANGANA

‘భూ భారతి’కి గవర్నర్ ఆమోదం.. రానున్న మార్పులివే..

గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ భారతి బిల్లుకు గవర్నర్ బిష్ణుదేవ్ శర్మ ఆమోద ముద్ర వేశారు. గ‌వ‌ర్న‌ర్ ఆమోదించిన బిల్లు కాపీని గురువారం స‌చివాల‌యంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. వీలైనంత త్వరలో ఈ బిల్లును అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఇందుకోసం అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్ర‌జానీకానికి మెరుగైన‌, స‌మ‌గ్ర‌మైన…

TELANGANA

హైదరాబాద్‌కు ధీటుగా మరో నగరం..? ఆ నగరం అభివృద్ది సీఎం రేవంత్ ఫోకస్..

హైదరాబాద్‌ తరహాలో వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ విధంగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని సూచించారు. మామూనూరు ఎయిర్‌పోర్టు భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఐసీసీసీలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు.   ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు ఎయిర్‌పోర్టును ప్రాధాన్యంగా ఎంచుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయా దేశాల పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఉండాల‌న్నారు. కొచ్చి ఎయిర్‌పోర్టు అన్ని వ‌స‌తుల‌తో ఉంటుంద‌ని..…