News

TELANGANA

హైదరాబాద్ శివారులో భారీ భూ కుంభకోణం..! ఎంతంటే..?

800 నుంచి వెయ్యి కోట్ల రూపాయలు విలువచేసే భూముల్ని అత్తగారి సొమ్ములా కొట్టేశారు. హైదరాబాద్ శివారులో మొయినాబాద్‌ పురపాలిక పరిధిలోని ఎన్కేపల్లి సమీపంలో భూ కుంభకోణం వెలుగు చూసింది. సర్వే నంబరు 180లోని సర్కారు భూమికి యాజమాన్య హక్కులు ఇప్పిస్తామంటూ దళారులు మోసగించినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో బయటపడుతోంది. నకిలీ పత్రాలు సృష్టించి వెయ్యి కోట్ల రూపాయల మేర దోచుకున్నట్టు స్పష్టమవుతోంది. మొయినాబాద్ దగ్గర గోశాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో.. ఈ కుంభకోణం బయటపడింది.…

TELANGANA

మాజీ ఇంజనీర్ మురళీధర్‌రావు అరెస్టు..! సోదాల్లో భారీగా ఆస్తులు..

తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు అరెస్టు అయ్యారు. మంగళవారం ఉదయం బంజారాహిల్స్‌లోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. మురళీధర్‌రావుకు సంబంధించి బంధువులతోపాటు హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్‌ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.   కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్‌గా పని చేశారు మురళీధర్‌రావు. ఆయన అరెస్టుతో కొందరి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏసీబీ…

AP

ఏపీలో ఆపరేషన్ గరుడ దూకుడు..! భారీగా కేసులు నమోదు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి వ్యాప్తిని నియంత్రించడంలో.. ప్రభుత్వం చేపట్టిన కృషి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించిందని.. హోమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గతంలో ఏపీ గంజాయి హబ్‌గా పేరు గాంచిందని, ఇతర రాష్ట్రాల్లో గంజాయి పట్టుబడితే అది ఏపీ నుంచే వచ్చినదిగా భావించేవారని ఆమె గుర్తు చేశారు.   ఈ అంశాన్ని సమగ్రంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి ప్రతిపాదనతో.. ‘ఈగల్’ అనే ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. రవికృష్ణను డైరెక్టర్‌గా నియమించి ఈగల్‌ను కార్యాచరణలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం…

Uncategorized

‘గొడ్డలి’ గుర్తు కావాలంటూ ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ..!

దేశ రాజకీయాల్లో వైసీపీ ట్రెండ్ సెట్ చేస్తోందా? ఆ పార్టీ ఎందుకు గుర్తు మార్చాలని డిసైడ్ అయ్యింది? ఫ్యాన్ కంటే ‘గొడ్డలి’ గుర్తు మాంచి స్పందన వస్తుందా? ఫ్యాన్ గుర్తుకు కాలం చెల్లినట్టేనా? రాబోయే కాలమంతా గొడ్డలిదేనని అనుకుంటోందా? గొడ్డలి గుర్తుతో ప్రజలను భయపెట్టడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   వైసీపీ ఫౌండర్ శివకుమార్ పేరిట సోషల్‌మీడియాలో ఓ లేఖ హంగామా చేస్తోంది. దాని సారాంశం ఏంటంటే.. గొడ్డలి గుర్తు కావాలంటూ ఎలక్షన్ కమిషన్‌కు…

AP

వైసీపీ రీకాలింగ్ మేనిఫెస్టో.. ! ఎందుకంటే..?

చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ.. అంటూ ఏపీలో వైసీపీ ఇంటింటి తలుపుతట్టే కార్యక్రమం చేపట్టింది. అయితే ఇందులో పెద్దనేతలెవరూ యాక్టివ్ గా పాల్గొనడం లేదు. ఇంటింటికీ వెళ్లి ప్రజల్ని కలసి కూటమి మేనిఫెస్టో సరిగా అమలు కావడం లేదని చెప్పడం జగన్ ఉద్దేశం. కానీ ఆయన ఉద్దేశాల్ని ఆశల్ని నేతలు పట్టించుకోలేదు. చోటా మోటా నేతలు మాత్రం క్యూఆర్ కోడ్ ఉన్న ప్లకార్డులు పట్టుకెళ్లి జనం దగ్గర నిలబడి ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్…

AP

పేర్ని నాని వివాదాస్పద వాఖ్యలు..! న్యాయస్థానానికి పేర్నినాని.

కోరి కష్టాలు తెచ్చుకోవడమంటే ఇదేనేమో..? తనపై వరుసగా కేసులు నమోదు కావడంతో బెంబేలెత్తుతున్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని. కేసుల నుంచి బయటపడేందుకు చివరకు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇంతకీ అసలేం జరిగింది? నాని ఎందుకు భయపడ్డారు? కేవలం కార్యకర్తలను రెచ్చగొట్టాలని భావించి చిక్కుల్లో పడ్డారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   వైసీపీ అధినేత జగన్ తర్వాత వార్తల్లోకి వస్తున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అధినేత స్టయిల్‌లో మాటలు ఆడుతూ కార్యకర్తలను…

CINEMA

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఉదయం కన్నుమూశారు. వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసి ‘కోట’గా చిరపరిచితులైన ఆయన ఈ తెల్లవారుజామున ఫిలింనగర్‌లోని ఆయన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోట శ్రీనివాసరావు 1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కొడుకు కోట ప్రసాద్ 21 జూన్…

CINEMA

ఆన్ లైన్ మోసానికి గురైన యాంకర్ అనసూయ..!

ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువులను పంపించకుండా తనను మోసం చేశారంటూ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ముందే చెల్లించినా తాను ఆర్డర్ చేసిన దుస్తులను ఇప్పటి వరకూ పంపలేదని మండిపడ్డారు. ఈమేరకు యాంకర్ తాజాగా ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.   అనసూయ ఇన్ స్టా పోస్ట్ ప్రకారం.. దాదాపు నెల రోజుల క్రితం ట్రపుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్ సైట్…

AP

స్పేస్ పాలసీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..!

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి వర్తించే కొత్త అంతరిక్ష విధానాన్ని (స్పేస్ పాలసీ) ప్రకటించింది. ఈ విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర స్పేస్ సిటీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.   ఈ స్పేస్ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడం వంటి లక్ష్యాలను ప్రభుత్వం పెట్టుకుంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలను ఈ ప్రాజెక్టులలో భాగస్వామ్యులుగా చేసుకోవాలని సూచించింది.   స్పేస్ సిటీ…

AP

రప్పా రప్పా వ్యాఖ్యలు..! పేర్ని నానిపై పలు పోలీస్ స్టేషన్‌లలో కేసు నమోదు..

వైసీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని రప్పా రప్పా అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన తీరు మార్చుకోలేదు. ఇటీవల పామర్రులో వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని.. ‘చీకట్లో కనుసైగ చేస్తే రెండో కంటికి తెలియకుండా వేసేయాలి.. తెల్లారగానే వెళ్లి పరామర్శించాలని’ అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.   పేర్ని నాని…