హైదరాబాద్ శివారులో భారీ భూ కుంభకోణం..! ఎంతంటే..?
800 నుంచి వెయ్యి కోట్ల రూపాయలు విలువచేసే భూముల్ని అత్తగారి సొమ్ములా కొట్టేశారు. హైదరాబాద్ శివారులో మొయినాబాద్ పురపాలిక పరిధిలోని ఎన్కేపల్లి సమీపంలో భూ కుంభకోణం వెలుగు చూసింది. సర్వే నంబరు 180లోని సర్కారు భూమికి యాజమాన్య హక్కులు ఇప్పిస్తామంటూ దళారులు మోసగించినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో బయటపడుతోంది. నకిలీ పత్రాలు సృష్టించి వెయ్యి కోట్ల రూపాయల మేర దోచుకున్నట్టు స్పష్టమవుతోంది. మొయినాబాద్ దగ్గర గోశాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో.. ఈ కుంభకోణం బయటపడింది.…