కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీని వేసింది. మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తి చేయాలని కమిటీని ఆదేశించింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా నీటిపారుదల, టన్నెలింగ్ నిపుణులు. మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమన్వయం…

