News

TELANGANA

వరంగల్ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

వరంగల్ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్‌కిషోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, ఇతర అధికారులతో విమానాశ్రయాల ఏర్పాటుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాల నిర్మాణంపై సమీక్ష జరిపారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, సాంకేతిక అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలను వేగవంతం…

National

మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే.. విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఫైర్..!

భారత రాజకీయాల్లో మహిళలకు చారిత్రక సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్’ సవరణను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు “గర్భంలోనే చంపేశాయని” ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్‌సభలో ఈ బిల్లు వీగిపోవడంపై శనివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఇది కేవలం బిల్లు ఓటమి కాదని, భారత మహిళల ఆకాంక్షలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ చారిత్రక తప్పిదంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే పక్షాలదే ప్రధాన పాపమని నేరుగా…

TELANGANA

హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాచారం నుంచి చిలుకానగర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఒక కాటన్ మిల్లు గిడ్డంగిలో ఈ ప్రమాదం జరిగింది. భారీ మంటలు ఎగిసిపడటంతో గోదాములో నిల్వ ఉన్న సరుకు పూర్తిగా దగ్ధమైంది. మంటలు పక్కనే ఉన్న మ్యాట్రెస్ కంపెనీకి కూడా వ్యాపించాయి.   స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా…

TELANGANA

కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్ పై విమర్శల దాడిని ఉద్ధృతం చేశారు. హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో పలు సామాజిక సంఘాల నేతలతో భేటీ అయిన ఆమె, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై రాజీకయంగా అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   “పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎందుకు ప్రజల్లోకి పోలేదు? ఇప్పుడు పాదయాత్రలు చేస్తానంటే ఎవరు నమ్ముతారు?” అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కేటీఆర్ పాదయాత్ర ప్రస్తావనను ఎద్దేవా చేస్తూ,…

TELANGANA

కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీని వేసింది. మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తి చేయాలని కమిటీని ఆదేశించింది.   కల్నల్ పరీక్షిత్ మెహ్రా నీటిపారుదల, టన్నెలింగ్ నిపుణులు. మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమన్వయం…

National

మీకు మహిళల ఉసురు తగులుతుంది.. విపక్షాలపై అమిత్ షా ఫైర్..

మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భవిష్యత్ ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని, వారి ఉసురు మీకు తగులుతుందని హెచ్చరించారు. బిల్లును తిరస్కరించడం మహిళలను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. బిల్లు వీగిపోయిన అనంతరం గెలిచామంటూ నినాదాలు చేయడం అత్యంత హేయమైన చర్య అని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.   లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై…

AP

మహిళా బిల్లును వ్యతిరేకించి ఏం సాధించారు?: జగన్..

మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన పార్టీలు తాము ఏం సాధించాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల మహిళలకు, దక్షిణ భారత రాష్ట్రాలకు ఏకకాలంలో అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.   లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2026కు మూడింట రెండొంతుల మెజారిటీ లభించని నేపథ్యంలో జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్…

AP

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు… విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్..

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే కీలక బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే కాదని, పార్లమెంటులో సమాన ప్రాతినిధ్యం ఆశిస్తున్న లక్షలాది మంది మహిళలకు చేసిన ద్రోహమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని దేశం గుర్తుంచుకుంటుందని హెచ్చరించారు.   వివరాల్లోకి వెళితే, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు…

TELANGANA

తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: పొన్నం ప్రభాకర్..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ తేజస్వి సూర్యపై నిప్పులు చెరిగారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు అత్యంత అజ్ఞానంతో కూడుకున్నవని, అవి ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేలా ఉన్నాయని పొన్నం పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్రాన్ని అవమానించినందుకు ఆయన ఎంపీ సభ్యత్వాన్ని…

AP

ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం..!

రాష్ట్రంలో గురువారం ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. హౌస్ లిస్టింగ్-హౌస్ సెన్సెస్ ప్రక్రియలో భాగంగా, తొలి వ్యక్తిగా తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ ప్రక్రియలో భాగస్వాములై, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.   అమరావతిలోని తన నివాసంలో se.census.gov.in వెబ్ సైట్ ద్వారా చంద్రబాబు వ్యక్తిగత వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ…