విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే మృతుని కుటుంభ సభ్యులను ఆంద్రప్రదేశ్ మాజీ సీఎం వైఏస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ వారి కుటుంభ సభ్యులను పరామర్షిచారు. అనంతరం వారికి అండగా ఉంటామని హమీ ఇచ్చారు.
మే నెల 9వ తేదీన..
కూటమి ప్రభుత్వం పై తీత్రస్థాయిలో మండిపడ్డారు. సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్ర విమర్షలు చేశారు. తమ కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలిపారు. విజయవాడకు చెందిన వ్యక్తి గాదె సాయికృష్ణ అనే యువడిని గత మే నెల 9వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అప్పటినుండి సాయి కృష్ణా ఆచూకీ కపించలేదు.
హెబియస్ కార్పస్ పిటిషన్..
అతని తల్లి గాదె విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కోర్టులో దాఖలు చేశారు. అయితే పోలీసులు విచారణలో భాగంగా సాయికృష్ణను థర్డ్ డిగ్రీ ఉపయోగించి లాకప్లోనే పోలీసులు తీవ్రంగా కొట్టి చంపేశారని కొట్టి ఆపై సాక్ష్యాలు ఎమి దొరకకుండా అర్ధరాత్రి వేళ అతని మృతదేహాన్ని దహనం చేసి మాయం చేశారని బాధితుడి యోక్క కుటుంబం సభ్యలతో పాటుగా ఆంద్ర ప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు పైతం ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

