News

AP

కేడర్‌కు పవన్ ఓపెన్ లెటర్..

ఏపీలో వైసీపీ తన ప్లాన్ అమలు చేస్తోందా? కూటమి మధ్య విభేదాలకు వైసీపీ శ్రీకారం చుట్టిందా? జనసేన కేడర్‌ను వైసీపీ రెచ్చగొట్టే ప్రయత్నంలో పడిందా? ఎందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యకర్తలకు ఓపెన్ లెటర్ రాశారు? పార్టీలో పరిణామాలు అటువైపు దారితీస్తున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది కూడా పూర్తి కాలేదు. వైసీపీ తన పనిలో నిమగ్న మైంది. ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా నేరుగా…

National

దేశంలో మరో మహమ్మారి.. వేగంగా పెరుగుతున్న కేసులు..

దేశంలో మరో ప్రాణాంతక మహమ్మారి ప్రబలుతోంది. మహారాష్ట్రలో గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసులు వేగంగా పెరుగుతుండటంతో పూణెలో తొలి మరణం సంభవించింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలను ఆదివారం వెల్లడించింది. పూణే కేంద్రంగా వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి బ్యాక్టీరియా కారణంగా ఈ మరణం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.   జనవరి 9న జీబీఎస్‌ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఓ రోగి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. మృతుడు ఒక చార్టర్డ్ అకౌంటెంట్. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాకు…

CINEMA

మహేష్ బాబు పాస్ పోర్ట్ లాగేసుకున్న జక్కన్న… దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన హీరో,హీరోయిన్.?

రాజమౌళి (Rajamouli).. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించే ప్రతి సినిమా కూడా జాతీయస్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉండగా.. చివరిగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మాత్రం ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో మెప్పు పొందింది. అంతేకాదు ఈ సినిమాలోని “నాటు నాటు” పాటకు ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా లభించింది. అలాంటి రాజమౌళి నుంచి వస్తున్న తదుపరి చిత్రం ‘ఎస్.ఎస్.ఎం.బి.29’. రాజమౌళి ,మహేష్ బాబు(Maheshbabu…

TELANGANA

తెలంగాణలో బెనిఫిట్ షోలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం నడుచుకోవాలని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది.   సినిమా టిక్కెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతులపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది.   ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు తెలిపారు.   వాదనలు విన్న…

APNational

వందో ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం.. నావిక్-2 ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వందో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29న సాయంత్రం 6.23 గంటలకు శ్రీహరికోట సతీశ్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి నావిక్-2 ఉప గ్రహాన్ని ప్రయోగించనుంది. దాదాపు 2,500 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ద్వారా నింగిలోకి పంపనున్నారు.   శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం నిర్మించిన తర్వాత చేపడుతున్న వందో ప్రయోగం ఇది. అంతేకాదు, ఈ ప్రయోగానికి మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. నింగిలోకి…

TELANGANA

మంద కృష్ణ మాదిగ అక్రమ కట్టడాల కూల్చివేత…

వరంగల్ జిల్లాలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు చెందిన అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. హన్మకొండలోని హంటర్ రోడ్డు సర్వే నెంబర్ 125కేలోని ఆయన కట్టడాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సిబ్బంది నిన్న కూల్చివేశారు.   హంటర్ రోడ్డులో గల తమ 400 గజాల భూమిని మంద కృష్ణతో పాటు జ్యోతి, ఇద్దయ్యలు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారని రెండున్నరేళ్ల క్రితం నంబూరి చారుమతి అనే మహిళ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరిపి…

National

ట్రంప్ తో చర్చలకు పుతిన్ రెడీ..

దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్చువల్‌‌గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఆయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు. రష్యా, చైనాలు కూడా వారి అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతు ఇస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.   ఈ తరుణంలో రష్యా నుంచి కీలక ప్రకటన వెలువడింది. డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారంటూ…

AP

విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు కుట్రలు చేశారు: కాకాణి గోవర్ధన్ రెడ్డి..

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… తమ పార్టీలో విజయసాయి రెడ్డి కీలక నేత అని చెప్పారు. జగన్ సీఎం కావాలని ఆయన కలలు కన్నారని… ఇప్పుడు రెండోసారి జగన్ ను సీఎం చేసేందుకు పని చేస్తున్నారని అన్నారు. విజయసాయిపై కొందరు టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేశారని…

AP

ముంబై దాడుల నిందితుడి అప్పగింతకు ఓకే చెప్పిన అమెరికా సుప్రీంకోర్టు..

ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడిని భారత్ కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. తనను భారత్ కు అప్పగించకుండా అడ్డుకోవాలంటూ నిందితుడు తహవుర్ రాణా దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో రాణా దోషిగా తేలిన నేపథ్యంలో నేరస్థుల అప్పగింత నుంచి మినహాయింపు పొందలేడని స్పష్టం చేసింది. తహవుర్ రాణాను అప్పగించాలంటూ భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది.   అయితే, రాణా…

TELANGANA

మహిళా కలెక్టర్‌ను అవమానించారు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కవిత డిమాండ్..

మహిళా కలెక్టర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవమానించారని, ఇందుకు మంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు తక్షణమే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నిన్న కరీంనగర్ జిల్లా పర్యటనలో మహిళా కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మీద మంత్రి చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన కవిత… తీవ్రంగా స్పందించారు.   ఇది కాంగ్రెస్‌ నాయకుల అహంకారానికి పరాకాష్ఠ అని…