News

TELANGANA

ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.   కాసేపట్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…

National

సూరత్‌లో రూ.25 కోట్ల విలువైన వజ్రాల చోరీ..

గుజరాత్‌లోని సూరత్ నగరంలో భారీ వజ్రాల చోరీ కలకలం సృష్టించింది. ప్రముఖ డైమండ్ కంపెనీ డీకే అండ్ సన్స్ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు సుమారు రూ.25 కోట్ల విలువైన వజ్రాలను అపహరించారు. ఈ సంఘటన కపోద్రా ప్రాంతంలోని కంపెనీ ఆఫీస్ కమ్ పాలిషింగ్ యూనిట్‌లో ఆగస్టు 15 నుంచి 17 మధ్య చోటుచేసుకుంది.   పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కంపెనీకి మూడు రోజుల పాటు సెలవులు ఉండటంతో మూసివేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న దుండగులు…

TELANGANA

కులగణనను వక్రీకరిస్తే బీసీలకు న్యాయం జరగదు-సీఎం రేవంత్

కుల గణనను వక్రీకరిస్తే ఇంకో వందేళ్లయినా బీసీలకు న్యాయం జరగదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సర్వే చేయలేదన్నారు. కులగణను పకడ్బంధీగా చేశామని, తప్పులు దొరక్కుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కులగణన చేశామని, గాంధీ కుటుంబం మాట ఇస్తే శిలాశాసనమన్నారు.   సర్వాయి సర్దార్ పాపన్నకు సరైన గౌరవం దక్కాలన్నారు. త్వరలో ఆ రోజు రాబోతుందన్నారు. ఆయన గొప్ప యోధుడని కొనియాడారు. గత ప్రభుత్వం ఖిలాషాపూర్ కోటను…

AP

ప్రిన్సిపల్ ఆడియో బయటకు.. అసలు విషయాలు వెల్లడించిన ఎమ్మెల్యే కూన రవికుమార్..

ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహారం కొత్త మలుపు తిరిగిందా? ఈ వ్యవహారం వెనుక వైసీపీ నేతలున్నారా? వెలుగులోకి వచ్చిన వెంటనే ఎందుకు సదరు ఎమ్మెల్యే నోరు విప్పలేదు? పార్టీ హైకమాండ్ సీరియస్ కావడంతో ప్రిన్సిపల్ ఆడియో బయటపెట్టారు ఎమ్మెల్యే కూన రవికుమార్.   ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కూన రవికుమార్ తొలిసారి రియాక్ట్ అయ్యారు. అసలు జరిగింది ఏంటి? అన్నీ పూసగుచ్చి మరీ వివరించారు. తాను ఏ…

AP

ఏపీకి కేంద్రం అండగా నిలవాలి.. అశ్విన వైష్ణవ్ కు నారా లోకేశ్ విజ్ఞప్తి..

ఆంధ్రప్రదేశ్‌ను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఆవిష్కరణల రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ తయారీ యూనిట్‌ను మంజూరు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్, భవిష్యత్ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఏపీ టెక్నాలజీ ప్రగతికి సంబంధించిన…

National

బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి షురూ..!

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్‌కాన్, భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన సరికొత్త ఐఫోన్ 17 ఉత్పత్తిని బెంగళూరులోని తన ప్లాంట్‌లో ప్రారంభించినట్లు అధికారిక‌ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చెన్నైలోని యూనిట్‌లో ఐఫోన్ల తయారీ జరుగుతుండగా, ఇప్పుడు బెంగళూరులోనూ ఈ ప్రక్రియ మొదలుకావడం ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రణాళికలకు పెద్ద ఊపునిచ్చినట్లయింది.   చైనా వెలుపల ఫాక్స్‌కాన్‌కు ఇది రెండో అతిపెద్ద తయారీ కేంద్రం కావడం గమనార్హం.…

TELANGANA

హైద‌రాబాద్‌లో శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో తీవ్ర విషాదం..! క‌రెంట్ షాక్ తో ఐదుగురు మృతి..

హైద‌రాబాద్‌లో శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు ర‌థానికి విద్యుత్ తీగ‌లు త‌గ‌ల‌డంతో క‌రెంట్ షాక్ కార‌ణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్ధరాత్రి రామంతాపూర్‌లోని గోకులేన‌గ‌ర్‌లో ఈ విషాద ఘ‌ట‌న జ‌రిగింది. శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో భాగంగా నిన్న రాత్రి స్థానికంగా ర‌థాన్ని ఊరేగించారు. అయితే, ర‌థాన్ని లాగుతున్న వాహ‌నం చెడిపోవ‌డంతో దాన్ని ప‌క్క‌కు నిలిపివేసిన యువ‌కులు.. ర‌థాన్ని చేతుల‌తో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్ర‌మంలో ర‌థానికి విద్యుత్ తీగ‌లు త‌గిలాయి. దాంతో ర‌థాన్ని లాగుతున్న…

National

ఎన్డీఏ ఉపరాష్ట్రపతిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్..

ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఎన్డీఏ ఖరారు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయబోతున్నట్టు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ప్రకటించారు. తమిళనాడులో జన్మించిన రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ గా కూడా పని చేసిన విషయం తెలిసిందే.   సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. రెండు సార్లు కోయంబత్తూరు ఎంపీగా పని చేసిన అనుభవం కూడా ఉంది. గతంలో జార్ఖండ్…

AP

ఏపీ ప్రజలకు సీఎం గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్‌లోనే 700 సేవలు..

అమరావతి అంటే కేవలం ఓ రాజధానిగా మాత్రమే కాదు.. గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గానూ మార్చాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజన్‌తోనే అభివృద్ధి వెలుగులు సాధ్యమని.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన చర్యలన్నీ చేపడుతున్నట్లు తెలిపారు. వాట్సాప్ మన మిత్ర ద్వారా.. 700 ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక.. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా మార్చేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.   ఈ వారం.. స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వర్నెస్…

AP

విశాఖను ముంచెత్తిన వాన.. జీవీఎంసీ హై అలర్ట్..

సాగర నగరం విశాఖపట్నాన్ని ఆదివారం భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   విశాఖ నగరంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గాజువాక, పెద్ద గంట్యాడలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా గాజువాకలోని డైరీ కాలనీ, హెచ్‌బీ కాలనీ, రిక్షా కాలనీ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి సుమారు…