హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు: ఈ రాత్రి ఫ్లైఓవర్ల మూసివేత.. కారణం ఇదే!
ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే ‘షబ్-ఎ-మెరాజ్’ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాత్రి (శుక్రవారం) 10 గంటల నుండి నగరంలోని మెజారిటీ ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. రోడ్డు భద్రతను కాపాడటం మరియు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ వెల్లడించారు. ఫ్లైఓవర్లతో పాటు హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని నెక్లెస్ రోడ్డును కూడా మూసివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే, ప్రయాణికులకు…

