News

AP

ఢిల్లీ పర్యటనకు వెళుతున్న సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఆయన హస్తిన వెళ్తున్నారు.   వివరాల్లోకి వెళితే, ఈ నెల 14వ తేదీన, అంటే వచ్చే సోమవారం సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర ప్రభుత్వంలోని పలువురు ముఖ్యులతో సమావేశం కానున్నారు. ప్రధానంగా కేంద్ర హోం శాఖ, ఆర్థిక శాఖ, జలశక్తి శాఖల మంత్రులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అవుతారు.  …

National

బ్రెజిల్‌లో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం..

బ్రెజిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ రాజధాని బ్రాసిలియాలో ఘన స్వాగతం లభించింది. సోమవారం బ్రాసిలియా చేరుకున్న ఆయనకు ప్రవాస భారతీయులు త్రివర్ణ పతాకాలతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. రియో డి జనీరోలో 17వ బ్రిక్స్ సదస్సును విజయవంతంగా ముగించుకున్న ప్రధాని, అధికారిక పర్యటన నిమిత్తం బ్రాసిలియా విచ్చేశారు.   విమానాశ్రయంలో బ్రెజిల్ రక్షణ మంత్రి జోస్ మ్యూసియో మొంటెరో ఫిల్హో ఆయనకు లాంఛనంగా స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా బ్రెజిల్…

Uncategorized

తెలంగాణలో మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు..! అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు ..

తెలంగాణలో మహిళలపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్‌రెడ్డి. మహిళలు ఏకంగా చట్ట సభల్లో కూర్చొనే అవకాశం వస్తున్నట్లు తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 50 సీట్లు వస్తాయని తెలిపారు. మరో పది కలిపి 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పకనే చెప్పారు.   రాజేంద్రనగర్‌‌లోని వ్యవసాయ యూనివర్సిటీలో సోమవారం వన మహోత్సవం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బొటానికల్ గార్డెన్స్‌లో రుద్రాక్ష మొక్క నాటారు ముఖ్యమంత్రి. అనంతరం ఏర్పాటు…

National

ఖాజాగూడ కబ్జా కేసులో కీలక మలుపు.. ఐదుగురికి హైకోర్టు నోటీసులు..!

ఖాజాగూడలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జారాయుళ్ల చెరనుంచి కాపాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నడుంబిగించారు. ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహించడంతో.. ఎమ్మెల్యేలు హైకోర్టుని ఆశ్రయించారు. కబ్జా స్థలాల్లో జరుగుతున్న నిర్మాణాలను అడ్డుకోవాలని కోరారు. జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్‌ రెడ్డి.. ఈమేరకు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. ఈ పిల్ పై విచారణ…

AP

2027 నాటికి పోలవరం పూర్తవుతుందా..?

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. దశాబ్దాలుగా పోలవరం ఎప్పటికి పూర్తవుతుందనేది ఓ ఆన్సర్ లేని క్వశ్చన్. త్వరలోనే ఆ ప్రశ్నకు గోదావరి అంత సమాధానం దొరకబోతోంది. మరో రెండేళ్లలోనే పోలవరం పూర్తి చేయాలని సంకల్పించింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో పోలవరం పనులు ఎంతవరకొచ్చాయ్? ఏయే పనులు.. ఏ దశలో ఉన్నాయ్? ఓవరాల్‌గా.. పోలవరం ప్రోగ్రెస్ ఏంటి? అనే దాని గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.   వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం…

TELANGANA

నారా లోకేష్‌తో కేటీఆర్ రహస్య భేటీ.. సంచలన విషయాలు బయటపెట్టిన సామ రామ్మోహన్ రెడ్డి..

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మాజీ మంత్రి​ కేటీఆర్ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌తో రహస్య మంతనాలు జరుపుతున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డితో కేటీఆర్‌కు పోలిక ఏంటని ఆయన మండిపడ్డారు. ఈ రోజు గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.…

AP

విశాఖలో 150 పైగా ప్రముఖ కంపెనీల పెట్టుబడులు..! ఇక ఉద్యోగాల జాతర..

ఐటీ పరిశ్రమ అభివృద్ధితో విశాఖ దశ మారిపోయేల కనిస్తుంది. దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ విశాఖ వైపు చూస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ.. స్టార్టప్ కంపెనీలే కాకుండా ప్రపంచ మేటి కంపెనీలను కూడా ఆకర్శిస్తుంది. క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్న వేళ.. విశాఖలో ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేస్తే అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు ఏర్పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖలో ఇప్పటికే ఇన్‌ఫోసిస్, టెక్ మహింద్రా, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి 150 బడా…

National

బ్రిక్స్ వేదికగా పాక్‌పై మోదీ ఘాటు వ్యాఖ్యలు..!

ఉగ్రవాద బాధితులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని ఒకే తక్కెడలో తూయలేమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం విషయంలో కొందరు తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.   ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ…

AP

నాకు ఒక్క రోజు హోంమినిస్టర్ పదవి ఇస్తే రెడ్ బుక్ కాదు… అంతా బ్లడ్ బుక్కే!: రఘురామ..

అమెరికాలో నిర్వహించిన తానా 24వ ద్వైవార్షిక మహాసభల్లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కరోజు గనుక మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేస్తే మీరు ఏ శాఖలు కోరుకుంటారు? అని కార్యక్రమ యాంకర్ మూర్తి ప్రశ్నించారు. అందుకు రఘురామ బదులిస్తూ, రోజులో 8 గంటలు తనను మంత్రిగా చేస్తే 6 గంటలు హోంమంత్రిగా, మిగతా 2 గంటలు వైద్య ఆరోగ్య మంత్రిగా పనిచేస్తానని అన్నారు.…

TELANGANA

తెలంగాణలో యూరియా కొరతపై విచారణ జరపాలి: కేటీఆర్..

తెలంగాణలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.   ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందించారు. “సబ్సిడీపై రూ.266.50కి లభించాల్సిన యూరియా బస్తా ధర, ఇప్పుడు రూ.325కి ఎందుకు పెరిగింది? దీనికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, ప్రజలకు సమాధానం చెప్పాలి” అని…