News

AP

తురకపాలెం సాయిల్ పరీక్షల్లో సంచలన విషయాలు..!

తురకపాలెం సాయిల్ పరీక్షల్లో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. అక్కడ నుంచి సేకరించిన మట్టి నమునానాల్లో యురేనియం నిక్షేపాలు భారీగా ఉన్నట్లు గుర్తించారు. యురేనియం నిల్వలు ఎక్కువగా ఉండటం వల్లే అక్కడ పనిచేసే వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు పరీక్షల్లో తేలినట్లు సమాచారం. తురకపాలెంలో ICAR నేతృత్వంలోని ప్రైవేట్ సంస్థ మట్టి పరీక్షలు చేసింది. ఎక్కువమంది బాధితులు క్వారీ తవ్వకాల్లో పనులకు వెళ్ళి అక్కడ నీటిని ఉపయోగించడంతోనే యురేనియం అవశేషాలు శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.…

TELANGANA

ఎస్ఎల్‌బీసీ ఘటన: 200 రోజులు దాటినా మృతదేహాలు వెలికితీయరా..? కేటీఆర్ ఫైర్..

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగం కూలిన ఘటన జరిగి 200 రోజులు దాటినా ఆరుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ సర్కారు నేరపూరిత నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.   “అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం 200 రోజులు గడిచినా ఆరుగురు బాధితుల మృతదేహాలను కూడా…

TELANGANA

తెలంగాణ విమోచన దినోత్సవంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి దారితీసిన చారిత్రక పోరాట ఘట్టాలను, నాటి ప్రజల త్యాగాలను కళ్లకు కట్టేలా ఈ ఫొటో ప్రదర్శనను తీర్చిదిద్దారు.   ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వమే హైదరాబాద్ విమోచన…

AP

నేడు మెగా డీఎస్సీ ఎంపిక జాబితా విడుద‌ల‌..

మెగా డీఎస్సీ-2025 అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజుతో తెరపడనుంది. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను పాఠశాల విద్యాశాఖ నేడు విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 వేల మంది అభ్యర్థుల పేర్లతో కూడిన ఈ జాబితాలను జిల్లాల కలెక్టర్, డీఈఓ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. దీంతో పాటు అధికారిక వెబ్‌సైట్ cse.apcfss.in లో కూడా అందుబాటులో ఉంచుతామని డీఎస్సీ-2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి నిన్న‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.   మొత్తం 16,347 పోస్టుల…

National

నా బుర్రలో రూ.200 కోట్ల విలువైన ఆలోచనలున్నాయి..ఈ20 ఇంధనంపై వివరణ: గడ్కరీ..

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తన ఆర్థిక స్థితిగతులపై వస్తున్న విమర్శలకు ఆయన గట్టిగా బదులిచ్చారు. “నాకు డబ్బుకు కొదవలేదు. నా మెదడులో రూ.200 కోట్ల విలువైన ఆలోచనలు ఉన్నాయి. నేను మోసం చేయకుండానే సంపాదిస్తున్నాను” అని ఆయన స్పష్టం చేశారు.   నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ, తనకు నెలకు రూ.200 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. “ఎవరినీ మోసం చేయాల్సిన అవసరం…

National

ఓటరు నమోదు ప్రక్రియలో మార్పు..!

ఓటరు జాబితా సవరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా చేపట్టే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా, ఓటరు గుర్తింపు కోసం సమర్పించే ధ్రువపత్రాల జాబితాలో ఆధార్ కార్డును కూడా చేర్చాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు (సీఈవోలకు) స్పష్టమైన సూచనలు జారీ చేసింది.   ఓటరు జాబితా వెరిఫికేషన్ కోసం ప్రస్తుతం పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 11 రకాల డాక్యుమెంట్లను…

TELANGANA

తెలంగాణ కేసీఆర్ వల్లే రాలేదు.. ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత కేవలం కేసీఆర్‌కు మాత్రమే దక్కదని, రాష్ట్రం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో ఆయనది ఒక పాత్ర మాత్రమేనని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. కేసీఆర్ వల్లే రాష్ట్రం వచ్చిందనే వాదనను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌ వద్ద తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.   కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర భయాందోళనల మధ్య బతికారని,…

AP

మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ ఆరోపణ… సీఎం చంద్రబాబు క్లారిటీ..

ఏపీలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు స్పందించారు. తాము మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలోనే ముందుకు వెళుతున్నామని, దీనివల్ల ఎవరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వానివే ఉంటాయని, వైద్య విద్యార్థులకు గానీ, రోగులకు గానీ ఎలాంటి ఇబ్బంది రానివ్వబోమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరు బెదిరించినా భయపడే పరిస్థితి…

TELANGANA

గోదావరి పుష్కరాలు-2027.. ఇప్పటినుంచే తెలంగాణ ప్రభుత్వం ఫోకస్..

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటినుంచే కార్యాచరణను ప్రారంభించింది. ఈ పుష్కరాలను ‘దక్షిణ కుంభమేళా’గా పరిగణించి, భారీ ఏర్పాట్ల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కోరాలని నిర్ణయించింది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.   పుష్కరాలు ప్రారంభం కావడానికి ఇంకా 22 నెలల సమయం ఉన్నప్పటికీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీర్ఘకాలిక…

AP

ఆయేషా మీరా తల్లిదండ్రులకు విజయవాడ సీబీఐ కోర్టు నోటీసులు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విజయవాడ సీబీఐ కోర్టు పంపిన నోటీసులను స్వీకరించేందుకు ఆయేషా తల్లిదండ్రులు నిరాకరించారు. న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న తమను పదేపదే కోర్టుల చుట్టూ తిప్పడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.   వివరాల్లోకి వెళితే, కేసులో నిందితుడిగా ఉన్న పిడతల సత్యంబాబుపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం),…