News

AP

అమరావతిలో ప్రతిష్టాత్మక సీఐఐ గ్లోబల్ సెంటర్..!

నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకమైన 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు నిర్వహణకు వేదిక సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఈ సదస్సుపై విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణతో పాటు వినూత్న ఆలోచనల మార్పిడికి ఈ సదస్సు ఒక వేదిక కానుంది.   సదస్సు వేదిక, ప్రధాన థీమ్   ఈ ఏడాది నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య…

APUncategorized

కాపులను దూరం చేయడమే వైసీపీ స్ట్రాటజీ..! ఎమ్మెల్సీ హరిప్రసాద్ షాకింగ్ కామెంట్స్..

మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ అంతర్గత సమావేశంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ వైసీపీ పార్టీ వ్యూహాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీని, ముఖ్యంగా కాపు సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ ఆడుతున్న రాజకీయ క్రీడను ఆయన ఎండగట్టారు. మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ పదవీ బాధ్యతల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.   పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం వెనుక కుట్ర   జనసేన అధినేత పవన్…

National

స్టాలిన్‌కు షాకిచ్చిన వైకో.. ఆయనకు ఝలక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు..

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. డీఎంకే కూటమి నుంచి వైకో నేతృత్వంలోని ఎండీఎంకే తప్పుకున్న 24 గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎండీఎంకేకు చెందిన 150 మందికి పైగా ముఖ్య నేతలు, జిల్లా కార్యదర్శులు, ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు ఆదివారం డీఎంకే గూటికి చేరారు.   చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ సమక్షంలో వీరంతా…

AP

ఏపీ డిజిటల్ భవిష్యత్తుపై చంద్రబాబు ఫోకస్.. సునీల్ మిట్టల్‌తో కీలక భేటీ..

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపక చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్‌తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన కనెక్టివిటీని అందించడం, డిజిటల్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది.   ఈ భేటీలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సునీల్…

AP

అమరావతి పేరుతో చంద్రబాబు భారీ దోపిడీ.. రూ.47 వేల కోట్ల అప్పు ఎందుకు?- అంబటి రాంబాబు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో మరోసారి రాజకీయ సెగలు రాజుకున్నాయి. పెనుమాక గ్రామంలో భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీపై జరిగిన దాడులు, తదనంతర పరిణామాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రభుత్వంపై, టీడీపీ శ్రేణులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.   అమరావతి.. ఒక అంతులేని కథ!  …

TELANGANA

తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుంది: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్..

తెలంగాణలో త్వరలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కమలం వికసించడం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధీమా వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు మరింత పట్టుదలతో శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.   ఆదివారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన శంషాబాద్‌లో రంగారెడ్డి రూరల్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనితో పాటు మరో తొమ్మిది జిల్లాల కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ…

TELANGANA

ధైర్యముంటే చర్చకు రండి.. విపక్షాలకు రేవంత్ బహిరంగ సవాల్..

తెలంగాణలో తమ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలతో చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం శాసనసభ, శాసనమండలిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ సవాల్ విసిరారు.   తమ ప్రభుత్వ రెండేళ్లన్నర పాలనను, బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పాటు కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల…

TELANGANA

‘నాకు ఏం జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత’.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం తన సెక్యూరిటీని తొలగించిందని బీఆర్ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. భవిష్యత్తులో తనకు ఏదైనా హాని జరిగితే దానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిదే పూర్తి బాధ్యత అని సంచలన వ్యాఖ్యలు చేశారు.   రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రవీణ్‌ ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే అధికార పార్టీ తనను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. విపక్ష నేతగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.…

AP

మార్కెట్లోకి ‘మేడిన్ ఆంధ్ర’ బంగారం..!

ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నిజమైంది. రాష్ట్రంలోనే వెలికితీసిన ‘మేడిన్ ఆంధ్ర’ బంగారం ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గనుల నుంచి జియో మైసూర్ సంస్థ ఉత్పత్తి చేసిన బంగారు బిస్కెట్లను అమ్మకానికి ఉంచారు. ఈ చారిత్రక ఘట్టంతో కర్నూలు జిల్లా పేరు దేశవ్యాప్తంగా మరోసారి మార్మోగుతోంది.   ప్రస్తుతం 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్ల రూపంలో ఈ బంగారాన్ని విక్రయిస్తున్నారు. ఈ బిస్కెట్లపై ఏపీ…

National

రెండేళ్లలో 500 నగరాలకు భారత్ ట్యాక్సీ సేవలు: అమిత్ షా..

రవాణా రంగంలో సహకార స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ‘భారత్ ట్యాక్సీ’ దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించబోతోందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. రాబోయే రెండు సంవత్సరాల్లో దేశంలోని 500కు పైగా నగరాలు, పట్టణాల్లో ఈ సహకార మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నేడు గుజరాత్‌లో భారత్ ట్యాక్సీ సేవలను అధికారికంగా ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా ఈ కీలక ప్రకటన చేశారు.   గుజరాత్‌లోని అన్ని ప్రధాన…