News

TELANGANA

ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు..! మంత్రి సీతక్క కీలక ప్రకటన..

తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన, భర్తకు దూరమై ఒంటరిగా జీవిస్తున్న మహిళల జీవితాల్లో భరోసా నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారికంగా ప్రకటించారు. సమాజంలో ఎటువంటి ఆసరా లేక ఇబ్బందులు పడుతున్న ఒంటరి మహిళలకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ప్రభుత్వం ఈ…

AP

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కూటమిలోని పార్టీలు ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. నేతలతో అధినేతలు సమావేశాలు, కేడర్‌తో భేటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పరిస్థితులను బట్టి వెనక్కి తగ్గామన్నారు.   ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షురూ-ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రంగం షురూ అవుతోంది. అక్టోబరు లేకుంటే నవంబర్‌లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని కూటమి భావిస్తోంది. ఈలోగా నేతలు, కేడర్‌ని…

AP

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు..!

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు మళ్లీ వెలుగులోకి రావడం ప్రజల్లో కొద్దిగా టెన్షన్ పుట్టిస్తోంది. దానికి తోడు నలుగురు చనిపోయారనే వార్త ఈ ఆందోళనను మరింత పెంచింది. అయితే, దీనిపై వైద్యారోగ్య శాఖ స్పందిస్తూ.. ప్రజలు అస్సలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి సులభంగా అర్థం చేసుకుందాం. వైరస్ ఎక్కడికీ పోలేదు.. ఎందుకు పెరుగుతోందంటే?…

National

భారత రైల్వేలో నవశకం..! పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు..

భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 17న ప్రారంభించనున్నారు. హర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపట్ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ హిత రవాణా దిశగా భారత రైల్వే వేసిన ఈ అడుగు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఈ హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ…

TELANGANA

కాంగ్రెస్ స్కామ్‌ల సర్కార్..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సగం పదవీకాలం పూర్తికాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన మోసకారి ప్రభుత్వంగా మారిందన్నారు. అందుకే సమాజంలోని ప్రతి వర్గం ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విమర్శించారు.   హైదరాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కేటీఆర్ సమీక్షా సమావేశం…

AP

‘జగన్ 2.0 సూపర్ యాప్’ను ఆవిష్కరించిన వైఎస్ జగన్..

వైసీపీ తమ శ్రేణులను బలోపేతం చేసే దిశగా డిజిటల్ బాట పట్టింది. ఇందులో భాగంగా, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను గురువారం ప్రారంభించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.   ఈ యాప్‌ను వైసీపీ కుటుంబం కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది. కార్యకర్తలు ఈ యాప్‌ను…

TELANGANA

గోల్కొండలో ఘనంగా ఆషాఢ బోనాలు..!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతర హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ లంగర్ హౌస్ చౌరస్తా వద్ద శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకతో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజుల పాటు జరిగే బోనాల పండుగకు అంకురార్పణ జరిగింది.   ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యే దానం…

AP

భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడీ.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక అప్ డేట్..

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) కార్యకలాపాలు నెల రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఆగస్టు మధ్య నాటికి విమాన సర్వీసులు మొదలవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.   విమానాశ్రయ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తిగా పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని పర్యటన తేదీ ఖరారైన వెంటనే,…

TELANGANA

కవిత పార్టీ వివాదంపై కేటీఆర్ కౌంటర్..!

దిల్లీలో పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీ ‘టీఆర్ఎస్’ (తెలంగాణ రక్షణ సేన) పేరు వివాదంపై ఆయన స్పందించారు. ‘టీఆర్ఎస్ పేరు పెట్టడంపై కొందరు మా పార్టీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేసి ఉండొచ్చు. మా పార్టీ పేరును వాడుకోవాలని చూస్తే కార్యకర్తలు ఎందుకు ఊరుకుంటారు. బంధం కంటే పార్టీనే ముఖ్యం’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.   మరోవైపు ఫార్మూలా రేస్ కేసుకు గురించి కూడా కేటీఆర్…

TELANGANA

వనపర్తి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన..!

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించాలి. పలుగు, పార పట్టిన చేతులే.. కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. చదువొక్కటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. చదువే సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపుతుంది” అని విద్యార్థులకు ఉద్బోధించారు.   విద్యార్థినులతో ముఖ్యమంత్రి.. వనపర్తి…