News

National

అయోధ్య విరాళాల వివాదం.. మోదీ మౌనాన్ని ప్రశ్నించిన ప్రియాంక్ ఖర్గే..

అయోధ్య రామమందిరానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారంటూ కర్ణాటక హోం మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే తప్పుబట్టారు. ఈ అంశంపై ప్రధాని తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో స్పష్టత ఇవ్వాలని శనివారం ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురి అరెస్టులు జరగడం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా చేయడంతో ఈ వివాదం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.  …

TELANGANA

యూరియా యాప్‌లో పెద్ద స్కామ్..? రియల్ ఎస్టేట్ దందా కోసమేనా..? కేతిరెడ్డి సంచలన ఆరోపణలు..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘యూరియా యాప్’ వివాదంలో చిక్కుకుంది. ఈ మొబైల్ అప్లికేషన్ నుండి మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పేర్లు మాయం కావడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వం పెద్ద కుట్రకు తెరలేపిందని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం తీరును ఎండగడుతూ పలు ప్రశ్నలు సంధించారు. రియల్ ఎస్టేట్ దందా కోసమేనా? ప్రభుత్వం ఎంతో…

TELANGANA

తెలంగాణ రైతులకు అలర్ట్..! వరి సాగుకు బ్రేక్..! మారనున్న గ్రామీణ ఆర్థిక చిత్రం..

రాష్ట్రంలో సాంప్రదాయ వ్యవసాయ విధానాల్లో మార్పులు తీసుకువస్తూ, రైతులను లాభసాటి పంటల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగా పంటల మార్పిడిపై ఒక ఉన్నత స్థాయి ‘రాష్ట్రస్థాయి కమిటీ’ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పంటలు మార్చేలా ప్రోత్సహించడానికి ఈ కమిటీని రంగంలోకి దించనుంది. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి రైతులకు విస్తృత అవగాహన కల్పించనున్నారు.…

AP

అమరావతిలో హైటెన్షన్.. వైసీపీ నేతల పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు, కోడిగుడ్లతో దాడి..!

ఏపీ రాజధాని అమరావతిలో వైకాపా నేతలు చేపట్టిన పర్యటన.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజధాని భూముల పరిశీలనకు వచ్చిన మాజీ మంత్రి పేర్నినాని, లేళ్ల అప్పిరెడ్డి, సీఆర్డీఏ పరిరక్షణ బృందాన్ని ఉండవల్లి సెంటర్ లో రైతులు అడ్డుకున్నారు. రాజధానిగా అమరావతిని అంగీకరించాకే పర్యటించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు, రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్లు విసరడంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఓ దశలో…

AP

‘బటన్లు నొక్కితే ఓట్లు పడవు’..! 11 సీట్లకు పరిమితం చేసినా మారరా..? వైసీపీ పై పవన్ కళ్యాణ్ ఫైర్..

విపక్ష వైసీపీపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోమారు తనదైన శైలిలో విమర్శలు చేశారు. అధికారం పోయినా, 11 సీట్లకే పరిమితం అయినా వారిలో మార్పు రాలేదని మండిపడ్డారు. ఇప్పటికి కూడా ఇష్టానికి నోటికొచ్చినట్లు దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 వచ్చినా.. భాష విషయంలో వెనక్కి తగ్గం అన్న రీతిలో వైసీపీ నేతల ప్రవర్తన ఉంటోందని సెటైర్లు వేశారు. మీరు 1 వచ్చినా తగ్గకండి అలాగే ఉండండి అంటూ చురకలు అంటించారు.  …

TELANGANA

ఆంధ్రాలో మనోళ్లకి ఉద్యోగాలిస్తారా? మరి తెలంగాణలో ఎందుకివ్వాలి..? కవిత షాకింగ్ కామెంట్స్..

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేవలం ఇంజనీరింగ్ చేసిన పొరుగు రాష్ట్రాల పిల్లలకు ఉద్యోగాలిస్తామని చెబుతున్నారని కవిత అన్నారు. ఇది చాలా అన్యాయమని ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డలు కూడా ఆంధ్రాకి వెళ్లి ఇంజనీరింగ్ చేస్తే అక్కడ ఉద్యోగాలు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. మన పిల్లల్ని అక్కడ నాన్-లోకల్స్ అంటారని పేర్కొన్నారు. మరి అక్కడి పిల్లలు ఇక్కడకు వచ్చి చదువుకున్నప్పుడు ఉద్యోగాలు ఎందుకివ్వాలని ప్రశ్నించారు.   హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్…

TELANGANA

నీటి సమస్యకు.. శాశ్వత పరిష్కారం కావాలి.. తుంగభద్ర వేదికగా సీఎం రేవంత్ విజ్ఞప్తి

కేంద్ర జలవనరుల మంత్రి సీఆర్ పాటిల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. గద్వాల్, అలంపూర్, పాలమూరు ప్రాంతాల్లో ‘రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌’లో భాగంగా తమకు కేటాయించిన 15 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం తుంగభద్ర కింద కేవలం 5 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామన్న రేవంత్.. మిగిలిన 10 టీఎంసీల నీరు అందడం లేదని చెప్పారు.   కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన…

AP

సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో కీలక విషయాలు..!రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించిన సిట్..

విజయవాడ సాయికృష్ణ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి సిట్ కీలక విషయాలు బయటపెట్టంది. పోలీసు కస్టడీలో దెబ్బల కారణంగానే సాయికృష్ణ మరణించినట్టు తేల్చింది. మృతుడి ఆచూకీ, కస్టడీకి సంబంధించిన వాస్తవాలను బయటకు తెలియకుండా నిందితుడు నాగరాజు మాయం చేశాడని ప్రస్తావించింది.   సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో కీలక విషయాలు   రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఐజీ రవిప్రకాశ్‌ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.…

TELANGANA

ఉద్యోగులకు భారీ భరోసా.. ఉచిత బీమా, పీఆర్సీపైనా సీఎం హామీ..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 14 బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం స్వయంగా ఒప్పందాలపై సంతకాలు చేసి పథకాన్ని ప్రారంభించారు.   ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, ప్రభుత్వం కోసం కష్టపడే ఉద్యోగుల భద్రతను కాపాడటం…

AP

పంచాయతీరాజ్ శాఖ‌లో ప్రమోషన్ల పండగ.. కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్..

ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆ శాఖ అధికారులకు మరో తీపికబురు అందించారు. తాజాగా 42 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (ఎంపీడీవోలు), డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా (డీడీవోలు) పదోన్నతులు కల్పించే ప్రక్రియకు పచ్చజెండా ఊపారు. ఇందుకు సంబంధించిన సీనియారిటీ జాబితాను డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) ఆమోదించింది. దీంతో త్వరలోనే వీరందరూ ఉన్నత హోదాలో బాధ్యతలు చేపట్టనున్నారు.   కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీరాజ్‌,…