News

AP

పోలవరం ప్రాజెక్టు సైట్ నుంచి 36 ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష..

సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సోమవారం ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్‌లోని గ్యాప్ 1, గ్యాప్ 2తో పాటు పవర్ హౌస్ నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, ప్రాజెక్టు ప్రదేశం నుంచే రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ వర్చువల్ సమీక్షలో వివిధ జిల్లాల…

TELANGANA

కాళేశ్వరంపై కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో, గోదావరి జలాలను ఉద్దేశపూర్వకంగానే సముద్రం పాలు చేస్తూ రైతులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఆయన మండిపడ్డారు.   సోమవారం కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం…

AP

ఏపీలో రెండో విడత జాబ్ క్యాలెండర్‌.. 3,168 పోస్టుల భర్తీకి కసరత్తు..

ఏపీలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో రెండో విడత ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయిప్రసాద్, సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు హాజరయ్యారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.   సమీక్షా సమావేశంలో సీఎస్ పలు…

NationalTELANGANA

వచ్చేస్తోంది బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్‌కు 3 కొత్త కారిడార్లు..!

భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ సేవలు 2027 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్‌) కారిడార్‌లో భాగంగా సూరత్-బిలిమోరా మధ్య తొలి సర్వీసును నడపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మార్గం దేశంలోనే మొట్టమొదటి హై-స్పీడ్ రైలు మార్గంగా నిలవనుంది.   508…

Uncategorized

నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..!కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..

ఇంకా మీ రక్తదాహం తీరలేదా? అని కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా సరిపోలేదా? అని నిలదీశారు. ఎక్స్ వేదికగా ఆదివారం పైర్ అయ్యారు. తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి? అని ప్రశ్నించారు.   ఎన్ కౌంటర్ల పేరుతో.. తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు..…

TELANGANA

తెలంగాణలో వరి సాగు సగానికి పడిపోనుందా? ఎల్ నినో పై ప్రభుత్వం షాకింగ్ అంచనా..!

ఎల్ నినో పరిస్థితులతో రైతులకు నష్టం కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వ విద్యాలయం, ఇక్రిశాట్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్, సీఆర్ఐడీఏ శాస్త్రవేత్తలు, ఐఎండీ అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, భూగర్భ జల విభాగం అధికారులతో సోమవారం ఇక్రిశాట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే…

AP

టెక్కీ రాధాగాయత్రి కేసులో కొత్త ట్విస్ట్..!

విశాఖ సిటీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె భర్త శ్రీచరణ్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు న్యాయస్థానం రెండువారాల రిమాండ్‌ విధించడంతో జైలుకి తరలించారు.   విశాఖ టెక్కీ రాధాగాయత్రి కేసు కొత్త మలుపు-విశాఖ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని లెంక రాధా గాయత్రి మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో…

AP

వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, నాగార్జున యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఈ అరెస్ట్ జరగడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   అరెస్ట్‌కు దారితీసిన కారణం ఇదే..   ఇటీవల ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న నాగార్జున యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర…

AP

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటుకు శ్రీకారం..!

ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడిగా, లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందిస్తున్న సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాలం చెల్లిన పాత గేట్ల స్థానంలో కొత్తవి అమర్చే పనులను ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ బృహత్ కార్యక్రమం ద్వారా బ్యారేజీని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రజా ప్రభుత్వం ముందడుగు వేసింది.   బ్యారేజీ గేట్లను నిర్మించి 50 ఏళ్లు దాటడంతో వాటి…

APNationalTELANGANA

వియత్నాంలో ఘోర ప్రమాదం..!15 మంది మృతి..

వియత్నాంలో భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక స్పీడ్‌ బోట్ సముద్రంలో బోల్తా పడి మునిగిపోయింది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో కనీసం 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం.   ఓషన్ పెరల్ ఐలాండ్ కంపెనీకి చెందిన ‘ఏజీ-26751’ అనే పర్యాటక స్పీడ్‌ బోటులో భారత పర్యాటకులు సిబ్బందితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫు క్వాక్…