ఏపీ ‘మెగా డీఎస్సీ’ వివాదాలపై తేల్చి చెప్పిన విద్యాశాఖ..!
ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున చేపట్టిన ‘మెగా డీఎస్సీ-2025’ నిర్వహణపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ నియామక ప్రక్రియ అంతా పక్కా ప్లానింగ్తో, అత్యంత పారదర్శకంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. అభ్యర్థుల మెరిట్ను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి తొలి సంతకం.. భారీ నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.…

