News

AP

కదిరిలో వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం: 108 జంటలచే సామూహిక హోమం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వాసవి దీక్షా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. లోక కల్యాణార్థం మరియు వర్తక వాణిజ్య రంగాల్లో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టంగా 108 జంటలతో సామూహిక హోమ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా…

AP

పోలీస్ స్టేషన్ ముందే దారుణం: భార్యతో అక్రమ సంబంధం ఉందని వ్యక్తిని నరికి చంపిన భర్త!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తనకల్లు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు ఈశ్వరప్ప అనే వ్యక్తిని హత్య చేసిన హరి అనే వ్యక్తి. తెల్లవారి మూడు గంటల సమయంలో జరిగిన హత్య.ఈశ్వరప్ప పై కొడవలి తో నరికి దారుణంగా హత్య చేసిన హరి ఆయన సోదరుడు చిన్నప్ప. హరి భార్య గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన హరి.ఈ రోజు తెల్లవారి జామున మూడు గంటలకు హరి భార్యతో పాటు ఈశ్వరప్ప…

AP

కది రి వినూత్న ఆవిష్కరణ – షెడ్ లేకుండా సౌర ప్యాన్డిరి (Solar Pandiri) నిర్మాణం

కడిరి పట్టణంలో LS GREENSYNCE – Ahaskara Solar ఆధ్వర్యంలో వినూత్నమైన సౌర ఆవిష్కరణను ప్రారంభించారు. సంప్రదాయంగా ఉపయోగించే షెడ్ రూఫింగ్ అవసరం లేకుండా, నేరుగా సౌర ప్యానెల్స్‌తోనే సోలార్ ప్యాన్డిరి (Solar Pandiri) నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ ప్రత్యేకమైన డిజైన్ ద్వారా భూమి వినియోగం మరింత సమర్థవంతంగా ఉండటంతో పాటు, ఖర్చు తగ్గడం, గాలి ప్రసరణ మెరుగ్గా ఉండటం, దీర్ఘకాలిక మన్నిక వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రైతులు, గృహ యజమానులు, వ్యాపార సంస్థలు…

TELANGANA

పోలీసులకు సెర్చ్ వారెంట్లు ఇచ్చే అధికారం ఎక్కడిది? – తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో పోలీస్ అధికారులు తమంతట తాముగా సెర్చ్ వారెంట్లు జారీ చేయడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీపి (ACP), కమిషనర్ స్థాయి అధికారులు వారెంట్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మోహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా అస్సలు పోలీసులకు సెర్చ్ వారెంట్లు ఇచ్చే అధికారం ఎక్కడిదని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. పిటిషనర్ విజయగోపాల్ వాదనలు వినిపిస్తూ.. కేవలం…

TELANGANA

దేవుడి మీద ఒట్టు.. తెలంగాణకు అన్యాయం జరగనివ్వను: సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు మరియు కృష్ణా జలాల పంపకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ఘాటుగా సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలే తనకు అత్యంత ప్రాధాన్యత అని, తన ప్రాంత హితం కోసమే గతంలో పార్టీని వీడానని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా తాను ఎన్నడూ వ్యవహరించబోనని, ఒకవేళ అన్యాయం జరిగే పరిస్థితి వస్తే పదవి కంటే తెలంగాణే ముఖ్యమని స్పష్టం చేస్తూ “దేవుడి మీద ఒట్టు” వేసి తన కమిట్‌మెంట్‌ను…

AP

యువతి మిస్సింగ్, కేసు నమోదు…

యువతి మిస్సింగ్, కేసు నమోదు… కదిరి టౌన్ అమీన్ నగర్ నందు కాపురం ముందు షేక్ మహబూబ్ జాన్ వయస్సు 40 సంవత్సరాలు, భర్త షేక్ మసూద్ అను ఆమె కూతురు షేక్ అప్స, వయస్సు 19 సంవత్సరాలు, ఈ రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో తాను మెడికల్ షాపుకు మందులు తీసుకురావడానికి వెళ్లిన సమయంలో , తన కూతురు ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయిందని, అయితే తన కూతురు కనిపించకపోవడానికి కారణము నల్లచెరువు మండలం…

AP

కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల గైర్హాజరు: గంటల తరబడి రోగుల నిరీక్షణ

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. శనివారం ఉదయం 11:20 గంటలు దాటినా సంబంధిత విభాగానికి చెందిన డాక్టర్లు ఎవరూ విధులకు హాజరుకాకపోవడం పట్ల రోగులు మరియు వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఓపి (OP) నమోదు చేసుకున్న పేషెంట్లు డాక్టర్ల కోసం గంటల తరబడి ఆసుపత్రి ఆవరణలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చిన…

AP

కుల గణన వివరాలు బహిర్గతం చేయాలి: అగ్రకుల మీడియాపై బీఎస్పీ నేత గోవిందు ధ్వజం

బీహార్ రాష్ట్రంలో జరగని గొడవలు, తెలంగాణ, ఏపీలో మాత్రమే జరుగుతాయా? రాధాకృష్ణ గారు: బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు. ——————————————— 3.1.2026న శ్రీసత్యసాయి జిల్లా, కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు గారి అధ్యక్షతన “క్రాంతి జ్యోతి, చదువుల తల్లి, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే (3.1.1831-10.3.1897) గారి196వ జయంతి” సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూల మాల సమర్పించి ఘనంగా జయంతి వేడుకలను…

CINEMA

శ్రీవారి సేవలో ‘అన్నమయ్య’ వేంకటేశ్వరుడు: తిరుమలలో నటుడు సుమన్ సందడి.. ఫోటోలు వైరల్!

ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. సుమన్‌ను చూడగానే భక్తులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు, దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దర్శనానంతరం సుమన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో వైకుంఠ ఏకాదశి కోసం…

AP

వల్లభనేని వంశీకి హైకోర్టులో భారీ ఊరట: అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు.. హత్యాయత్నం కేసులో ఊపిరి పీల్చుకున్న మాజీ ఎమ్మెల్యే!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. విజయవాడలోని మాచవరం పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వంశీని ప్రస్తుతం అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, తదుపరి విచారణను వెకేషన్ బెంచ్‌కు వాయిదా వేసింది. ఈ వివాదం నూతక్కి సునీల్ అనే…