News

TELANGANA

నారా లోకేష్‌తో కేటీఆర్ రహస్య భేటీ.. సంచలన విషయాలు బయటపెట్టిన సామ రామ్మోహన్ రెడ్డి..

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మాజీ మంత్రి​ కేటీఆర్ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌తో రహస్య మంతనాలు జరుపుతున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డితో కేటీఆర్‌కు పోలిక ఏంటని ఆయన మండిపడ్డారు. ఈ రోజు గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.…

AP

విశాఖలో 150 పైగా ప్రముఖ కంపెనీల పెట్టుబడులు..! ఇక ఉద్యోగాల జాతర..

ఐటీ పరిశ్రమ అభివృద్ధితో విశాఖ దశ మారిపోయేల కనిస్తుంది. దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ విశాఖ వైపు చూస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ.. స్టార్టప్ కంపెనీలే కాకుండా ప్రపంచ మేటి కంపెనీలను కూడా ఆకర్శిస్తుంది. క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్న వేళ.. విశాఖలో ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేస్తే అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు ఏర్పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖలో ఇప్పటికే ఇన్‌ఫోసిస్, టెక్ మహింద్రా, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి 150 బడా…

National

బ్రిక్స్ వేదికగా పాక్‌పై మోదీ ఘాటు వ్యాఖ్యలు..!

ఉగ్రవాద బాధితులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని ఒకే తక్కెడలో తూయలేమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం విషయంలో కొందరు తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.   ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ…

AP

నాకు ఒక్క రోజు హోంమినిస్టర్ పదవి ఇస్తే రెడ్ బుక్ కాదు… అంతా బ్లడ్ బుక్కే!: రఘురామ..

అమెరికాలో నిర్వహించిన తానా 24వ ద్వైవార్షిక మహాసభల్లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కరోజు గనుక మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేస్తే మీరు ఏ శాఖలు కోరుకుంటారు? అని కార్యక్రమ యాంకర్ మూర్తి ప్రశ్నించారు. అందుకు రఘురామ బదులిస్తూ, రోజులో 8 గంటలు తనను మంత్రిగా చేస్తే 6 గంటలు హోంమంత్రిగా, మిగతా 2 గంటలు వైద్య ఆరోగ్య మంత్రిగా పనిచేస్తానని అన్నారు.…

TELANGANA

తెలంగాణలో యూరియా కొరతపై విచారణ జరపాలి: కేటీఆర్..

తెలంగాణలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.   ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందించారు. “సబ్సిడీపై రూ.266.50కి లభించాల్సిన యూరియా బస్తా ధర, ఇప్పుడు రూ.325కి ఎందుకు పెరిగింది? దీనికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, ప్రజలకు సమాధానం చెప్పాలి” అని…

National

డెంగ్యూపై పోరులో కీలక ముందడుగు.. త్వరలో అందుబాటులోకి టీకా..!

దేశంలో ఏటా వర్షాకాలంలో లక్షలాది మందిని వణికిస్తున్న డెంగ్యూ మహమ్మారికి అడ్డుకట్ట వేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్లినికల్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ప్రయోగాలు విజయవంతమైతే, ఏడాదిలోగా ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రఖ్యాత ఫార్మా సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ‘టెట్రావ్యాక్స్-డీవీ’ పేరుతో రూపొందించిన ఈ టీకా…

AP

అమరావతికి మరో 20 వేల ఎకరాలు… సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్..

రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాజధాని పరిధిలో అదనంగా 20 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అథారిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని నివాసంలో జరిగిన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశంలో మొత్తం 7 ప్రధాన అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. ఇందులో భాగంగా అమరావతి,…

TELANGANA

ఆసక్తికరం.. తెలంగాణలో ఓటరు జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే పేరు తొలగింపు.. ఎందుకంటే..?

తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. వేములవాడ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన చెన్నమనేని రమేష్ తన ఓటు హక్కును కోల్పోయారు. ఆయన భారత పౌరుడు కాదని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో అధికారులు ఆయన పేరును వేములవాడ ఓటరు జాబితా నుంచి తొలగించారు.   ఈ మేరకు ఎన్నికల అధికారులు చెన్నమనేని రమేష్ నివాసానికి నోటీసులు అంటించారు. ఆయన పౌరసత్వం చెల్లదని, అందువల్ల ఓటరుగా కొనసాగే అర్హత లేదని…

TELANGANA

సీతక్కకు బెదిరింపు లేఖ.. మావోయిస్టుల కొత్త ట్విస్ట్..!

రాష్ట్ర మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ కొన్ని రోజుల క్రితం విడుదలైన మావోయిస్టుల లేఖ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం విదితమే. అయితే, ఈ వ్యవహారంలో తాజాగా కీలక మలుపు చోటుచేసుకుంది. ఆ లేఖను తాము విడుదల చేయలేదని మావోయిస్టు పార్టీయే స్వయంగా ప్రకటించింది.   వారం క్రితం మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. ఇది మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారమైంది. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లోనూ ఆందోళన…

National

హిమాచల్ ప్రదేశ్ లో ‘క్లౌడ్ బరస్ట్’… 69కి పెరిగిన మృతుల సంఖ్య..

దేవభూమిగా పేరొందిన హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా జూన్ 20 నుంచి జూలై 3 మధ్యకాలంలో సుమారు 69 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.   వరదల తీవ్రతకు మండీ జిల్లా అత్యధికంగా ప్రభావితమైంది. ఇక్కడ…