News

AP

పేర్ని నానికి మరో షాక్-రేషన్ దందాపై సిట్ దర్యాప్తు..?

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ డీలర్ గా ఉంటూ దాదాపు 4 వేల టన్నుల బియ్యం మాయం చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పేర్నినాని భార్య జయసుధతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు ఇప్పటికే విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు నిన్న వాళ్ల ఇంటికి వెళ్లి లుక్ అవుట్ నోటీసులు కూడా అంటించి వచ్చారు.   గతంలో రేషన్ డీలర్ గా…

AP

ఎస్సీ వర్గీకరణపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ కోటా వర్గీకరణ డిమాండ్ పై సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఏడాది కీలక తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును అమలు చేసే విషయంలో ప్రభుత్వాలు ఇంకా తడబడుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచిన చంద్రబాబు వంటి నేతలు కూడా తమ రాష్ట్రాల్లో ఇంకా సుప్రీంకోర్టు తీర్పు అమలుకు ఆలోచిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం…

TELANGANA

అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: అసెంబ్లీలో కేటీఆర్ సవాలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ‘రైతు భరోసా’ అంశంపై ఇవాళ (శనివారం) చర్చ కొనసాగుతోంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ సవాలు విసిరారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా రుణమాఫీ సంపూర్ణంగా పూర్తయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాలు విసిరారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తానని ఆయన ప్రకటించారు.   ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇతర పెద్దలకు కేటీఆర్ ఈ ఛాలెంజ్…

AP

ఉచిత బస్సు ప‌థ‌కం… ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..!

ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్‌డీఏ కూట‌మి ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీలలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణ ప‌థ‌కం ఒక‌టి. దాంతో ఈ స్కీమ్ అమ‌లు ఎప్పుడెప్పుడా అని మ‌హిళ‌లు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ప‌థ‌కానికి సంబంధించి రాష్ట్ర‌ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.   ఈ ప‌థ‌కం అమ‌లు తీరుతెన్నుల ప‌రిశీల‌న‌కై ప్ర‌భుత్వం కేబినెట్ స‌బ్ క‌మిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు మంత్రుల‌తో ఈ స‌బ్‌ క‌మిటీని ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉత్త‌ర్వులు…

TELANGANA

అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ఫైర్.. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదన్న సీఎం..

సినీ హీరో అల్లు అర్జున్ పై శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అల్లు అర్జున్ మనిషేనా అని ప్రశ్నించిన రేవంత్… ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని, థియేటర్ బయట పరిస్థితి బాగోలేదని, మీరు ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపోకపోతే పరిస్థితి అదుపుతప్పుతుందని డీసీపీ చెప్పినా… సినిమా చూసి వెళతానని అల్లు అర్జున్ చెప్పారని మండిపడ్డారు.   మీరు వెళ్లకపోతే మిమ్మల్ని…

AP

తెనాలిలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి నాదెండ్ల..

క్రీడలను ప్రోత్సహిస్తూ తెనాలిలో సువిశాలమైన స్టేడియంను నిర్మించనున్నామని ఏపీ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 1.76 ఎకరాల మున్సిపల్ భూమిని సేకరించి రూ. 3 కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. అందులోనే వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్టులతో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.   పట్టణ అభివృద్ధి కోసం మంచి ప్రణాళిక సిద్ధం చేయబోతున్నామని తెలిపారు. ప్రధాన రహదారుల విస్తరణ, మెరుగైన వైద్య…

National

ఇస్రో-యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మధ్య కీలక ఒప్పందం..

వ్యోమగాముల శిక్షణ, పలు పరిశోధనలకు సంబంధిత కార్యక్రమాలపై సహకారం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), యూరోపియన్ స్పేస్ ఏజన్సీ (ఈసా) మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం (ఎంఓయూ) పై ఇస్రో చీఫ్ సోమనాథ్, ఈఎస్ఏ (ఈసా) డైరెక్టర్ జోసెఫ్ అప్చ్ బాచెర్ సంతకాలు చేశారు. రెండు సంస్థలు మానవ అన్వేషణ, పరిశోధనల్లో సహకరిస్తాయని ఇస్రో ప్రకటనలో పేర్కొంది.   వ్యోమగామి శిక్షణ, ప్రయోగాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఈసా సౌకర్యాల…

National

జమిలి బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ..

లోక్ సభలో ఆమోదం పొంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలకు పంపిన నేపథ్యంలో.. కమిటీని ఏర్పాటు చేస్తూ లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ, రాజ్య సభ నుంచి సభ్యుల్ని ఈ కమిటీలో చోటు కల్పించిన లోక్ సభ స్పీకర్.. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు చోటు కల్పించారు. దీంతో.. ఈ కమిటీ జమిలి బిల్లును పరిశీలించి తర్వాత జరగనున్న పార్లమెంట్ సమావేశాల సమయానికి నివేదిక సమర్పించనుంది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన పార్లమెంట్ సంయుక్త…

AP

ఏపీలో ఆరుగురు మంత్రులపై వేటు..

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం గురువారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో నిర్వహించారు. ఇందులో.. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలతో పాటు కూటమి పదవులు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో ఆరుగురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వారిని సున్నితంగా మందలించారు. ఈ విషయాలపై మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థసారథి.. కేబినేట్ నిర్ణయాల్ని వెల్లడించారు.   ఏపీ కేబినేట్ నిర్ణయాలు…

TELANGANA

ఔటర్ లీజుపై ‘సిట్’.. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..

ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఫీజు వసూలును మహారాష్ట్రకు చెందిన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కి 30 ఏండ్ల పాటు లీజుకు ఇచ్చింది గత ప్రభుత్వం. ఈ నిర్ణయంపై అనేక విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నేత హరీశ్‌ రావు విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక నిర్వహణపై అసెంబ్లీలో…