క్యాబినెట్ సమావేశంలో 21 అంశాలపై చర్చ..!
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. నేటి మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. గతంలో చేపట్టకుండా నిలిపివేసిన పనులను పునఃపరిశీలిస్తామని చెప్పారు. పరిశీలన తర్వాత ఆయా ప్రాజెక్టులు తిరిగి చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ముఖ్యంగా, అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు నేటి మంత్రివర్గం పచ్చజెండా ఊపిందని తెలిపారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి…

