News

TELANGANA

క్యాబినెట్ సమావేశంలో 21 అంశాలపై చర్చ..!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. నేటి మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.   గతంలో చేపట్టకుండా నిలిపివేసిన పనులను పునఃపరిశీలిస్తామని చెప్పారు. పరిశీలన తర్వాత ఆయా ప్రాజెక్టులు తిరిగి చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ముఖ్యంగా, అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు నేటి మంత్రివర్గం పచ్చజెండా ఊపిందని తెలిపారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి…

TELANGANA

అవినీతి జరిగిందంట… దానిపై ఏసీబీ కేసంట!: కేటీఆర్ ఫైర్..

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ తనపై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో… బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదో కుంభ కోణం జరిగిందని లీకులు ఇస్తున్నారని, దమ్ముంటే కార్ రేసింగ్ అంశంపై చర్చ పెట్టాలని సవాల్ విసిరారు.   2023 ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ రేసుకు ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారని వివరించారు. కార్ రేసింగ్…

AP

పేర్ని జయసుధ గోడౌన్ లో 3 వేల బస్తాలు కాదు… 4,840 బస్తాలు మాయం: మంత్రి నాదెండ్ల..

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం ఘటనలో పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలు లోతుగా విచారణ జరుపుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాలు, ఆహారం శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు.   మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై…

National

ఒకే దేశం – ఒకే ఎన్నిక.. కేంద్రం వాదనేంటి.? ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి.?

సువిశాల భారతావనిలో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములాంటి వ్యవహారం. నిత్యం ఏదో ఓ మూలన ఎన్నికల సందడి కనిపిస్తూనే ఉంటుంది. అయితే.. పార్లమెంట్, అసెంబ్లీ.. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు సర్వసాధారణం. ఈ విధానాన్ని పూర్తిగా మార్చేయాలని భావిస్తున్న కేంద్రంలోని బీజేపీ.. జమిలి ఎన్నికలకు సై అంటోంది. ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వస్తున్నా, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటోంది. ఏన్డీయే రెండో సారి అధికారంలో ఉన్నప్పటి నుంచి జమిలి చర్చను ప్రజల్లోకి తీసుకురాగా.. సుదీర్ఘ కసరత్తు…

AP

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సీజ్ చేసిన షిప్ బియ్యం లెక్క తేలింది..! ఎంతంటే..?

కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే ఆరోపణలతో సముద్రంలోనే నిలిపివేసిన స్టెల్లా ఫిష్ లో తనిఖీలు పూర్తి చేసిన అధికారులు.. అందులో రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సముద్రంలోకి పరుగులు పెట్టిన జిల్లా యంత్రాంగం.. పవన్ ఎంట్రీతో మరింత అప్రమత్తమైంది. సముద్రంలో లోడింగ్ కోసం వేచియున్న నౌక దగ్గరకు వెళ్లిన అధికారులు.. దానిని పోర్టు నుంచి వెళ్లకుండా అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. దాంతో.. రేషన్ బియ్యం అక్రమ వ్యవహారం నిజమేనని…

TELANGANA

నారాయణ స్కూల్‌లో దారుణం.. 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..

హైదరాబాద్‌లో ఇటీవల విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వివిధ కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నారాయణ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హయత్‌నగర్ నేతాజీ నగర్ బ్రాంచ్‌లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి లోహిత్ రెడ్డిగా గుర్తించారు. విద్యార్థి మృతిపై హాస్టల్ యాజమాన్యం పొంతన లేని సమాధానం చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు…

TELANGANA

కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన..

హైదరాబాద్ నగరంలో అక్రమార్కుల గుండెళ్లో బుల్డోజర్లు పరుగెత్తిస్తున్న హైడ్రా లక్ష్యాలు, అనుసరించనున్న విధివిధానాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పడడానికి ముందు నిర్మించుకున్న నివాస స్థలాల జోలికి వెళ్లబోమంటూ ప్రకటించారు. అదే సమయంలో రానున్న అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇంతకీ.. రంగనాథ్ ఏఏ విషయాల్లో స్పష్టతనిచ్చారు. కొంత మందికి ఊరట కలిగించే వార్త ఏంటి అంటే..   మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి మండలంలోని మూసాపేట, ఖైతలాపూర్…

AP

103 ఎకరాల్లో ఏపీ అసెంబ్లీ నిర్మాణం: మంత్రి నారాయణ..

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ సాయంత్రం 43వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఆర్డీఏ సమావేశం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు.   రాజధాని నిర్మాణాలకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఏపీ అసెంబ్లీని 103 ఎకరాల్లో భారీ స్థాయిలో నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు.. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి, టవర్ పై నుంచి అమరావతి…

TELANGANA

ఈ-రేసింగ్‌లో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతించారు.. అరెస్ట్‌పై మాట్లాడను: మంత్రి పొంగులేటి..

ఈ-కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతించారని, అయితే ఈ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్‌పై తానేమీ మాట్లాడనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతుందన్నారు.   కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… విచారణకు గవర్నర్ అనుమతించిన విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి… ఏసీబీకి తెలియజేస్తారన్నారు. ఈ-కార్ రేసింగ్‌లో చట్ట ప్రకారమే ఏసీబీ దర్యాఫ్తు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.   గవర్నర్…

AP

రేషన్ బియ్యం మాయం కేసు.. పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు..!

రేషన్ బియ్యం మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. వారు దేశం విడిచి పారిపోకుండా పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులు దరఖాస్తు చేసుకున్న బెయిలు పిటిషన్ నిన్న విచారణకు వచ్చినప్పటికీ తిరిగి 19వ తేదీకి వాయిదా పడింది. కాగా, మాయమైన బియ్యం విలువకు సంబంధించి జరిమానాతో కలిపి డబ్బులు కట్టాలన్న అధికారుల నోటీసుకు స్పందించిన నాని కుటుంబం తొలి విడతలో ఈ…