News

National

భారత్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చిన ట్రంప్ సర్కార్.. జైశంకర్‌తోనే మొదటి సమావేశం..!

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి సమావేశంలో జైశంకర్‌తో భేటీ అయ్యారు. రూబియోతో పాటు యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌తోనూ ఆయన ద్వైపాక్షిక చర్చలు కొనసాగించారు.   ఈ సందర్భంగా భారత…

AP

గ్రూప్-1 మెయిన్స్ తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్సీ..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నేడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. గ్రూప్-1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ కు 4,496 మంది అర్హత పొందినట్టు వివరించారు. ఈసారి మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్ లలో ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.   2023 డిసెంబరులో 89 గ్రూప్-1 ఉద్యోగాల…

AP

గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల జాబితాలో జ‌న‌సేన..

గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల జాబితాలో జ‌న‌సేన చేర‌డం ప‌ట్ల ఆ పార్టీ స్పందించింది. 2024 ఎన్నిక‌ల్లో సాధించిన 100 శాతం స్ట్రైక్‌రేట్‌కు ఇది గుర్తింపు అని పేర్కొంది. గాజు గ్లాస్ గుర్తు పార్టీ శాశ్వ‌త ఎన్నిక‌ల చిహ్నంగా మారింద‌ని వెల్ల‌డించింది.   దశాబ్ద కాల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గారి పోరాటానికి, గడచిన ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయంతో చరిత్ర సృష్టించిన జనసేన పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గాజు గ్లాస్…

TELANGANA

తెలంగాణలో మేఘా భారీ పెట్టుబడులు..

ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సు సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందంతో ప్రముఖ సంస్థలు చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మేఘా ఇంజనీరింగ్ (ఎంఇఐఎల్) కంపెనీతో తెలంగాణ సర్కార్ మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.   మొత్తం రూ.15 వేల కోట్లతో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఉత్పత్తి ప్రాజెక్టు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు, అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి…

TELANGANA

ఇవి గ్రామసభలా… ఖాకీల క్యాంప్ లా?: కేటీఆర్..

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు మొదలయిందని ఆయన అన్నారు. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయిందని… అసమర్థ ముఖ్యమంత్రి అసలు స్వరూపం బట్టబయలైందని చెప్పారు. ఇక కాలయాపనతో కాలం సాగదని… అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదని అన్నారు. రేషన్ కార్డులకు సంబంధించి ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.   “ఈ దరఖాస్తుల దందా నడవదు. ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదు.…

National

బెంగళూరులో కొత్త తరహా సైబర్ మోసం.. స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపి రెండున్నర కోట్లు కొట్టేశారు..

కర్ణాటకలోని బెంగళూరులో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపించిన దుండగులు.. దాంట్లో సిమ్ వేయగానే స్కామ్ చేశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లు కాజేశారు. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. కొత్త సిమ్‌ కార్డు కొనుగోలు చేసిన వారి నెంబర్లను లాటరీ తీశామని, మీరు స్మార్ట్ ఫోన్ గెలుచుకున్నారని చెప్పారు. అడ్రస్…

TELANGANA

సింగపూర్ కంపెనీతో కీలక ఒప్పందం.. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ సింగపూర్ పర్యటన మంచి ఫలితాలు వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది క్యాపిటల్యాండ్ కంపెనీ.   తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల వేట కొనసాగుతోంది. పెట్టుబడుల ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. మంచి ఫలితాలు రాబడుతోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి టీమ్, సింగపూర్…

TELANGANA

కటింగులు, కటాఫ్ లు మినహా ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమిటి?: కేటీఆర్..

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. కటింగులు, కటాఫ్ లు మినహా ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగిందేమిటని ప్రశ్నించారు. రుణమాఫీ కటింగ్, రైతు భరోసా కటింగ్, సాగునీళ్లు కటింగ్, కరెంటు కటింగ్, కేసీఆర్ కిట్ కటింగ్, న్యూట్రిషన్ కిట్ కటింగ్, తులం బంగారం కటింగ్, మహాలక్ష్మి రూ. 2,500 కటింగ్, ఫించను రూ. 4,000 వేలు కటింగ్, రూ. 5 లక్షల…

AP

నేటి నుంచి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.. పెట్టుబడులే టార్గెట్..!

రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటనకు వెళ్లారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సుకు సీఎం వెళ్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ సాగే ఈ పర్యటనలో దిగ్గజ పారిశ్రామికవేత్తల వరుస భేటీలతో సీఎం బిజీ బిజీగా గడపనున్నారు. ‘బ్రాండ్‌ ఏపీ’ ప్రమోషన్‌ పేరుతో దావోస్‌లో సీఎం బృందం ఐదు రోజుల పాటు పర్యటించనుంది. సీఎం చంద్రబాబు వెంట ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్‌,…

AP

ఏపీ కూటమిలో సైలెంట్ వార్..? ‘డిప్యూటీ సీఎం’ పదవి రచ్చ..?

ఏపీలో కూటమిలో డిప్యూటీ సీఎం పదవి పై రచ్చ మొదలైంది. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీని పైన పవన్ మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు మాత్రమే ఆ హోదా ఉంటుందని చెప్పి.. ఇప్పుడు లోకేష్ గురించి ప్రతిపాదన చేయటం పైన జనసైనికులు మండి పడుతున్నారు. ఇదే అంశం పైన సోషల్ మీడియా వేదికగా పవన్ – లోకేష్ మద్దతు దారుల…