News

TELANGANA

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బిగుస్తున్న ఉచ్చు.. !

అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా ఉంది. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం.సందీప్, సీనియర్ మేనేజర్ ఎం.నాగరాజు, లోయర్ బాల్కనీ ఇన్‌చార్జ్ గంధకం విజయ్ చందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన నటుడు అల్లు అర్జున్ ఆ తర్వాత మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చారు.   తాజాగా, ఈ కేసులో…

AP

శబరిమల సన్నిధానంలో భక్తుడి ఆత్మహత్య..!

కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాలధారణ చేస్తోన్నారు. నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు. ఇప్పటివరకు 22 లక్షలమంది వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.   మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు కిందటి నెల 15వ తేదీన తెరచుకున్న విషయం తెలిసిందే. దీనితో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభమైంది. స్వామివారిని…

TELANGANA

ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమని, ఎవరికీ ఇబ్బంది లేకుండా వర్గీకరణ ప్రక్రియను చేపడతామన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ… చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరిని ఖర్గే వెల్లడించారన్నారు.   ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇవ్వడంలో తమ ప్రభుత్వం కీలక పాత్రను పోషించిందన్నారు.…

National

రైతు రుణాలపై ఆర్బీఐ శుభవార్త..

రైతులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైతులకు ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకూ రుణం తీసుకునే అవకాశం ఉండగా, ఇటీవల దాన్ని రూ.2 లక్షల వరకూ పెంచింది.   వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తాజాగా ఆర్బీఐ స్పష్టం…

AP

ఏపీకి భారీ వర్ష సూచన..!

బంగాళాఖాతంలో అల్పపీడనాలు నాన్‌స్టాప్‌గా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ నెల 7న ఒక అల్పపీడనం ఏర్పడగా.. ఈరోజు లేదా రేపు మరో అల్పపీడనం ఏర్పడుతుంది. అయితే ఈ నెల 17న మరో అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వరుస అల్పపీడనాల కారణంగా కొన్ని జిల్లాల్లో నాన్‌స్టాప్‌గా వర్షాలు కురుస్తున్నాయి.   ప్రస్తుతం ఏర్పడే అల్పపీడనం రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. బలపడిన తర్వాత తమిళనాడు వైపు వెళ్లే అవకాశం…

TELANGANA

తెలంగాణలో ఆపిల్ ఎయిర్ పాడ్ల తయారీ..!

ఆపిల్ ఐఫోన్ తయారీదారు ఫాక్స్‌కాన్ హైదరాబాద్ సమీపంలో ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తిని ప్రారంభించనుంది. 2025 నుంచి ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. ఫాక్స్‌కాన్ చైనా వెలుపల ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ లో ఉత్పత్తిని ప్రారంభించనుంది. తెలంగాణలోని తయారీ కేంద్రంలో 2025 మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి అందుబాటులోకి తీసుకురానున్నారు.   ఇప్పటికే ట్రయల్ తయారీని ప్రారంభించిందని పలు నివేదికలు వస్తున్నాయి. ఈ అభివృద్ధి భారతదేశంలో ఐఫోన్‌లను అసెంబ్లింగ్ చేయడంలో కీలకం కానుంది. యాపిల్…

AP

పేర్ని నాని అనూహ్య నిర్ణయం – బియ్యం కేసు ఎఫెక్ట్..!

వైసీపీ ఫైర్ బ్రాండ్ పేర్ని నాని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పైన కూటమి ప్రభుత్వం విచారణ చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు పేర్ని నాని కుటుంబం పైన కేసు నమోదు అయింది. అరెస్ట్ తప్పదనే వాదన వినిపిస్తోంది. దీంతో, అజ్ఞాతంలోకి పేర్ని కుటుంబం వెళ్లింది. ఇదే సమయంలో పేర్ని నాని రాజీ ఫార్ములా తెర మీదకు తీసుకొచ్చారు. కేసు నుంచి బయట పడే ప్రయత్నాలు చేస్తున్నారు.   బియ్యం కేసు…

CINEMA

అండర్ గ్రౌండ్ కి మోహన్ బాబు.. ఐదు బృందాలతో సెర్చ్ ఆపరేషన్..

మంచు కుటుంబ వివాదం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ కుటుంబ వివాదం సమసింది అనుకునే సమయంలోపే ఒక మీడియా ప్రతినిధి మీద మోహన్ బాబు దాడి చేయడం కలకలం రేపింది. ఆ మీడియా ప్రతినిధికి తీవ్ర గాయాలు కావడం, ముఖానికి సర్జరీ చేయాల్సి రావడంతో పోలీసులు అంతకుముందు నమోదు చేసిన సెక్షన్లను మార్చి హత్యాయత్నం కేసు కింద నమోదు చేశారు. దీంతో మోహన్ బాబు హైకోర్టుకు వెళ్లి ఈరోజు వరకు…

CINEMA

ఇంటికి అల్లు అర్జున్‌.. ఫ్యామిలీ భావోద్వేగం.. భార్యాబిడ్డ‌ల‌ను హ‌త్తుకొని బ‌న్నీ ఎమోష‌న‌ల్‌..!

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో చంచ‌ల్‌గూడ జైలు నుంచి విడుద‌లైన అల్లు అర్జున్ మొద‌ట గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి వెళ్లారు. అక్క‌డి నుంచి జూబ్లీహిల్స్ లోని త‌న నివాసానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న బ‌న్నీని చూసి ఆయ‌న ఫ్యామిలీ భావోద్వేగానికి గుర‌య్యారు. మొద‌ట‌ కుమారుడు అల్లు అయాన్ ప‌రిగెత్తుకు వ‌చ్చి తండ్రిని హ‌త్తుకున్నాడు.   ఆ త‌ర్వాత భార్య స్నేహ‌, కూతురు అర్హ‌, త‌ల్లి, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ను ఆప్యాయంగా హ‌త్తుకొని అల్లు అర్జున్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఈ…

National

మహిళల కోసం కేంద్రం కొత్త స్కీమ్, నెలకు ఏడు వేలు..

మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కొత్త పథకాలు తెస్తున్నాయి. లేటెస్ట్‌గా డిసెంబర్ 9న కొత్త స్కీమ్‌ని తీసుకొచ్చింది మోదీ సర్కార్. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంట్లో కూర్చొని మహిళలు డబ్బులు సంపాదించడం అన్నమాట. అందులో సక్సెస్ అయితే జాబ్ హోలర్డ్‌గా మార్చుకుంది. ఈ స్కీమ్ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక సహాయం చేయడమే దీని ముఖ్యఉద్దేశం.   కేంద్రప్రభుత్వం ఎల్ఐసీతో కలిసి మహిళల కోసం కొత్త స్కీమ్‌ని తీసుకొచ్చింది. అందే బీమా సఖీ…