News

National

ఎర్రకోట మాది అంటూ దిల్లీ హైకోర్టులో పిటిషన్..

దిల్లీ నడిబొడ్డున ఉన్న ఎర్రకోట తమదే అని.. తమ పూర్వీకుల ఆస్తిని తమకు అప్పగించాలంటూ దిల్లీ హైకోర్టులో(Delhi High Court) ఓ పిటిషన్ దాఖలైంది. ఈ కోటను మొఘల్ చక్రవర్తులు నిర్మించినట్లు చెబుతుంటడా… వారి వారసులకే ఈ సంపద దక్కాలని, అలా భారత ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ ఓ అభ్యర్థన కోర్టు ముందుకు వచ్చింది. ఎర్రకోట తమ పూర్వీకుల ఆస్తి అని.. ఎర్రకోటను తమకు స్వాధీనం చేయాలంటూ పిటిషన్ వేశారు. దీంతో ఇప్పుడు ఈ…

AP

శ్రీవారి లడ్డూ కల్తీపై సీబీఐ సిట్ ఏం తేల్చేంది, సుప్రీంకోర్టుకు ప్రైమరీ రిపోర్టు..

తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందా? సీబీఐ నేతృత్వంలో సిట్‌ దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? ఇంతకీ ఏ డైయిరీలో కల్తీ జరిగింది? సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రాథమిక నివేదికలో ఏయే అంశాలున్నాయి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు శ్రీవారి భక్తులను వెంటాడుతున్నాయి.   తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు స్పీడ్‌గా జరుగుతోంది. సీబీఐ నేతృత్వంలోని సిట్‌ బృందం ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టు బెంచ్‌కు సమర్పించినట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో ద్వారా రిపోర్టును…

TELANGANA

రాష్ట్రంలో ధరణి సేవలకు బ్రేక్.. రిజిస్ట్రేషన్ల నిలిపివేత.. !

తెలంగాణ వ్యాప్తంగా ధరణి ద్వారా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసింది. సేవల్లో అంతరాయం తాత్కాలికమైనదేనని పేర్కొన్న ప్రభుత్వం త్వరలోనే ధరణి సేవలు తిరిగి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అయితే.. ప్రస్తుత అంతరాయానికి కారణాలేంటంటే..   ధరణి పోర్టల్ లో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. దీంతో.. ప్రభుత్వ యంత్రాంగం ధరణి వ్యవస్థపై తీవ్ర…

TELANGANA

అందరూ సమానమే.. బన్నీ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్..

ఐకాన్ సార్ అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయంపై తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో, మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు.   సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో చట్టం పని తాను చేసుకుపోతుందని, ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని సీఎం అన్నారు. మహిళ మృతి కేసులో చట్టపరమైన ప్రక్రియ…

TELANGANA

తెలంగాణలో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల సర్వే..

తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక సర్వే మొదలైంది. శనివారం నుంచి మొదలైన ఈ సర్వే, డిసెంబర్ 31 వరకు జరగనుంది. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించిన జిల్లా కలెక్టర్లు అందుకు సంబంధించి మార్గ దర్శకాలను జారీ చేశారు.   రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలన్నది ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ప్రతీ 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ ఉండనున్నారు. పట్టణాల్లో…

AP

జగన్ కేసులపై సిబిఐ కీలక రిపోర్ట్..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పాటు పలువురు రాజకీయ నేతలు, అధికారులపై దశాబ్దం క్రితం దాఖలైన ఆస్తుల కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని, అలాగే ఈ కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ సంచలనాలు రేపుతోంది. ఈ పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు.. ఇప్పటివరకూ జగన్ ఆస్తుల కేసుల అప్ డేట్ ఇవ్వాలని సీబీఐ, ఈడీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ రెండు సంస్ధలు తమ నివేదికలు సమర్పించాయి.…

AP

ఏపిలో భారీ పెట్టుబడులు.. సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్‌..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుపుతామన్నారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. మంత్రితో వివిధ దేశాలకు చెందిన పునరుత్పాదక విద్యుత్ రంగ పారిశ్రామికవేత్తలు పలువురు శుక్రవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలు, ఇండస్ట్రియల్ పాలసీలపై చర్చించారు.   ఈ సందర్భంగా సియెల్ సోలార్ (SAEL SOLAR) కంపెనీ ప్రతినిధులు.. 600…

TELANGANA

తెలంగాణ తల్లి తలపై కిరీటం ఎందుకు పెట్టలేదో చెప్పిన అందెశ్రీ..

దేవత రూపానికైతే కిరీటం ఉంటుందని, కానీ అమ్మరూపానికి ఉంటుందా? అని ప్రజావాగ్గేయకారుడు అందెశ్రీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాలో బతుకమ్మతో పాటు కిరీటం లేకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కిరీటం లేకపోవడంపై ఎన్టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అందెశ్రీ స్పందించారు. బాసర సరస్వతీమాతను దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.   తెలంగాణ తల్లికి కిరీటం ఉండాలంటే… భూమి మీద పురుడు పోసుకున్న ఏ తల్లికి కిరీటం ఉంటుందో చెప్పాలన్నారు. కిరీటాలు పెట్టుకుంటే…

TELANGANA

తెలంగాణ సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం..

తెలంగాణ సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. డిసెంబరు 12వ తేదీ నుంచి రాష్ట్ర సచివాలయంలో ఈ నిబంధన అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.   స‌చివాల‌యంలో ప‌ని చేసే అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బందికి ఈ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం వర్తిస్తుందని ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్, స‌చివాల‌యం హెడ్ నుంచి వేత‌నాలు పొందే ప్ర‌తి ఉద్యోగికి వర్తిస్తుందని స్పష్టం చేశారు.

AP

అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన చేయడంతో పాటు, అమరావతి రాజధానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి కొలువుదీరిన కూటమి ప్రభుత్వం.. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా పేర్కొంటూ నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా రాజధానిలో అభివృద్ధి పనులు మొదలు పెట్టింది.  …