తెలంగాణలో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల సర్వే..
తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక సర్వే మొదలైంది. శనివారం నుంచి మొదలైన ఈ సర్వే, డిసెంబర్ 31 వరకు జరగనుంది. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించిన జిల్లా కలెక్టర్లు అందుకు సంబంధించి మార్గ దర్శకాలను జారీ చేశారు. రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలన్నది ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ప్రతీ 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ ఉండనున్నారు. పట్టణాల్లో…

