అమరావతికి అధికారిక రాజధాని హోదా: చట్ట సవరణ ప్రక్రియలో కేంద్రం వేగవంతమైన అడుగులు!
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తాత్కాలిక రాజధానిగా ఉన్న అమరావతికి అధికారికంగా, చట్టబద్ధమైన రాజధాని హోదా కల్పించే ప్రక్రియ వేగవంతమైంది. కూటమి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 5(2) ను సవరించడానికి కేంద్రం చకచకా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ సవరణ బిల్లుకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం లభించింది. ఇప్పుడు ఈ బిల్లు కేంద్ర మంత్రివర్గ ఆమోదం కోసం సిద్ధంగా ఉంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన వెంటనే, ఈ బిల్లును…

