News

TELANGANA

తెలంగాణలో పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్..!

తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక చర్యలు చేపట్టింది. గత ఆరేళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా, కేవలం రిజిస్టర్డ్ పార్టీలుగా మాత్రమే కొనసాగుతున్న 13 పార్టీలకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది.రాష్ట్రంలో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉండి ఆరేళ్లకు పైగా ఏ ఎన్నికల బరిలోనూ నిలవని పార్టీలను జాబితా…

AP

ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్ డిమాండ్..

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులకు, సాధారణ పౌరులకు రక్షణ కరువైందని, ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.   “ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్త‌మోడుతోంది. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు పెడుతూ…

Uncategorized

వాటిలో ఒక్కటి తగ్గినా కాళ్ళు మొక్కి పదవి నుండి తప్పుకుంటాను..-: సీఎం రేవంత్ రెడ్డి..

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఈ గణాంకాలపై చర్చకు ఎవరైనా రావొచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎవరైనా చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాల సంఖ్యలో ఒక్కటి తగ్గినా తాను కాళ్ళు మొక్కి పదవి నుండి తప్పుకుంటానని అన్నారు.   హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన…

AP

రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు ప్రకటించిన మంత్రి అనగాని..

రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని, పేద ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యమని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన రెవెన్యూ శాఖ సమీక్ష అనంతరం అనగాని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలపై ఆర్థిక భారం తగ్గించే పలు సంస్కరణలను ప్రకటించారు. ఇకపై కేవలం రూ.100 నామమాత్రపు రుసుముతో వారసత్వ ధృవీకరణ పత్రం…

National

జీఎస్టీ తగ్గింపు ఆలోచనలో కేంద్రం.. భారీగా తగ్గనున్న ధరలు..

ఆదాయపన్నులో రాయితీలతో వేతన జీవులకు కొంత ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మధ్యతరగతి, పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. నిత్యావసర వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.   ప్రస్తుతం 12 శాతం పన్ను శ్లాబును పూర్తిగా తొలగించడం లేదా ఈ శ్లాబ్ లోని పలు వస్తువులను 5 శాతం శ్లాబులోకి మార్చడం వంటి ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ మార్పుల వల్ల…

TELANGANA

సిగాచి ఫ్యాక్టరీ పేలుడుపై అనుమానాలు..?

హైదరాబాద్ శివారులోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఫ్యాక్టరీలో ఏం జరిగింది? ఘటన వెనుక మానవ తప్పిదమే కారణమా? ఆ కంపెనీ ఓనర్ హైదరాబాద్‌లో ఉన్నారా? కేవలం సెబీకి సమాచారం ఇవ్వడం వెనుక అసలు కథేంటి? ఘటన జరిగి మూడు రోజులైనా ఎందుకు స్పందించలేదు? ప్రమాదంలో ఆపరేషన్స్ వ్యవహారాలు చూస్తున్న వ్యక్తి ఉన్నారా? అందుకే మేనేజ్‌మెంట్ సైలెంట్‌గా ఉందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.   హైదరాబాద్‌లోని సిగాచి పరిశమ్రలో మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ కంపెనీని…

TELANGANA

మేడారం సమ్మక్క సారలమ్మ డేట్స్ ఫిక్స్..!

తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన.. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలను అధికారికంగా ప్రకటించారు. ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే ఈ మహా జాతర.. 2026వ సంవత్సరానికి సంబంధించి.. జనవరి 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరగనున్నట్లు జాతర పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు.   2026 జాతర ప్రధాన తేదీలు: జనవరి 28 – సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలకు ఆహ్వానం  …

AP

సీనియర్లకు చెక్ పెడుతున్న జగన్..!

వైసీపీ యూత్ వింగ్ మీటింగ్ లో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను పాదయాత్ర చేపట్టబోతున్నానని, అప్పుడు అందర్నీ ప్రత్యేకంగా కలుస్తానన్నారు. యూత్ వింగ్ నేతల అంతిమ లక్ష్యం ఎమ్మెల్యే కావడం అని ఉద్బోధించారు. జనంలోకి వెళ్లి, జనంతో మమేకమై స్థానికంగా బలపడాలన్నారు, సోషల్ మీడియాని వాడుకోవాలన్నారు. ఒకరకంగా ఇటీవల కాలంలో జగన్ పెట్టిన అన్ని మీటింగుల్లోకి ఇదే కాస్త ఆసక్తికరంగా ఉంది. మిగతా నేతలతో మొక్కుబడిగా మాట్లాడి ముగించిన జగన్, యువ నేతలతో మాత్రం…

AP

ఏపీ మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకు మరోసారి పాత రోజులు గుర్తొచ్చే అవకాశం వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ మద్యం దుకాణాల లోపలే తాగడానికి ప్రత్యేక గదులు ఉండేవి అవే పర్మిట్ రూమ్స్. అయితే, వాటిని రద్దు చేసిన తర్వాత బహిరంగంగా తాగడం పెరిగి, మద్యం ప్రియులకు అసౌకర్యంగా మారింది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం మళ్లీ పర్మిట్ రూమ్స్‌ను మంజూరు చేయడానికి సిద్ధమవుతోంది.   తాజా సమాచారం ప్రకారం, ఈ పర్మిట్ రూమ్స్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు…

AP

అమెరికాలో సిలికాన్ వ్యాలీకి దీటుగా అమరావతిలో క్వాంటం వ్యాలీ: చంద్రబాబు..

అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి దీటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’ని ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దీనిని 2026 జనవరి 1 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు.   విజయవాడలో సోమవారం నిర్వహించిన ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన…