ఏపీలో రాజకీయ పార్టీలకు సీఈవో ఊరట..!
ఏపీలో రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ సీఈవో ముకేష్ కుమార్ మీనా భారీ ఊరటనిచ్చారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికై ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సిందేనని గతంలో ఆదేశాలు ఇచ్చిన ఆయన.. ఇవాళ మాత్రం కాస్త వెసులుబాటు ఇచ్చారు. ఇంటింటి ప్రచార అనుమతి విషయంలో తగిన వివరణకై భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని, ఈ అంశంలో తగిన వివరణ అందేలోపు ముందస్తు సమాచారాన్ని సంబంధిత ఆర్వోకు, పోలీస్ స్టేషన్ కు ఇస్తే చాలన్నారు. …

