News

TELANGANA

కవితకు కేసీఆర్ సంకేతాలు..? రంగంలోకి కవిత..?

బీఆర్ఎస్‌లో కలహాలు తారాస్థాయికి చేరాయా? హరీష్‌రావుపై కేసు నమోదు కావడంతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కవితకు రూట్ క్లియర్ అయ్యిందా? లీడర్ షిప్ కోసం ఫ్యామిలీలో జరిగిన చర్చ ఏంటి? కేటీఆర్ తర్వాత కవిత తెరపైకి రావడానికి కారణాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.   బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు ఎవరు తీసుకుంటున్నారు? తొలుత కేటీఆర్‌కే పగ్గాలు అందుకుంటారని నేతలు భావించారు. ఈలోగా కవిత తెరపైకి రావడానికి కారణాలేంటి? అధినేత ఆలోచన…

AP

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. వచ్చే ఏడాదిలో ఫ్రీ బస్సు పథకం..?

ఏపీ కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై సుధీర్ఘంగా సాగింది. తాడేపల్లిలోని సచివాలయంలో మంగళవారం కేబినెట్ సమావేశాన్ని సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు సమాచారం. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యువజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలుపగా, రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం ప్రారంభం కాని గృహాలను రద్దు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.   ముందుగా కేబినెట్ భేటీలో చర్చించవలసిన…

TELANGANA

ఆ నీటిలో మాకు అధిక వాటాను ఇవ్వాలి: కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి..

గోదావరి-కావేరీ నదుల అనుసంధానంతో తెలంగాణ అధిక భూభాగాన్ని కోల్పోతోందని, కాబట్టి తమకు నీటి వాటాలో ఎక్కువ ఇవ్వాలని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. జాతీయ జల అభివృద్ధి సంస్థ 74వ పాలకమండలి సమావేశం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ఈరోజు జరిగింది.   ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇంజినీర్లు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ…

AP

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం… మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం..

రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యాప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేశ్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు సమీక్ష నిర్వహించారు.   ఈ సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ… పదో తరగతి పూర్తిచేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వ…

National

ఫ్లోర్ లీడర్లతో లోక్ సభ స్పీకర్ సమావేశం…. రేపటి నుంచి యథావిధిగా పార్లమెంటు సమావేశాలు..!

పార్లమెంటు కార్యకలాపాల్లో ప్రతిష్టంభన ఏర్పడడం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో… లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేడు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించారు. టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, కాంగ్రెస్ నుంచి గౌరవ్ గోగోయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, సమాజ్ వాదీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్, జేడీయూ నుంచి దిలేశ్వర్ కమాయిత్, ఆర్జేడీ నుంచి అభయ్ కుష్వాహా, తృణమూల్ నుంచి కల్యాణ్ బెనర్జీ, శివసేన…

AP

ఏపీలో కొత్త రేష‌న్ కార్డులు..

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో రేష‌న్‌కార్డులపై వైసీపీ రంగుల‌తో పాటు అప్ప‌టి సీఎం వైఎస్ జ‌గ‌న్ బొమ్మ ముద్రించిన విష‌యం తెలిసిందే. దాంతో ఇప్ప‌టి కూట‌మి ప్ర‌భుత్వం పాత రేష‌న్‌కార్డులలో మార్పుల‌కు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రేష‌న్‌కార్డుల్లో మార్పులు, చేర్పుల‌తో పాటు కొత్త కార్డుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశాన్ని ప్ర‌భుత్వం క‌ల్పించింది.   ఇవాళ్టి నుంచి ఈ నెల 28 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌డం జ‌రుగుతుంది. గ్రామ‌/వార్డు స‌చివాల‌యాల్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అర్హులైన వారికి సంక్రాంతి నుంచి…

AP

సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ కల్యాణ్ భేటీ..! పోర్టులో బియ్యం అక్రమ రవాణా చర్చ..?

ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. ఇరువురి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటన వివరాలను పవన్… చంద్రబాబుకు వివరించారు. కేంద్రమంత్రులతో భేటీ వివరాలను సీఎంతో పంచుకున్నారు.   ప్రధానంగా కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. రేషన్ బియ్యం తరలింపునకు ఎలా అడ్డుకట్ట వేయాలి? ఎలాంటి విధివిధానాలు అమలు చేయాలనేదానిపై…

TELANGANA

సిద్దిపేట్‌కు సీఎం రేవంత్.. కోకాకోలా గ్రీన్ ప్లాంట్ ప్రారంభం..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సిద్ధిపేట్‌కి వెళ్తున్నారు. సిద్దిపేట జిల్లాలో హెచ్‌సీసీబీ ఏర్పాటు చేసిన కోకా కోలా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.   శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ సిద్ధిపేట్ జిల్లాలో భారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్‌ను సిఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు.   దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్…

TELANGANA

మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో జీవన్ రెడ్డి..? రేవంత్ నిర్ణయం ఏంటి..?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హాడవుడి కాంగ్రెస్‌లో మొదలైంది. ఆశావాహుల సంఖ్య కూడ రోజురోజుకి పెరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన‌ మనసులోని మాట బయటకి చెప్పారు. అధిష్టానం అదేశిస్తే పొటికి సై అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికలపైనా ఫోకస్ పెట్టిన నేపధ్యంలో అభ్యర్థుల ఎంపికపై వాడివేడి చర్చ జరుగుతుంది.   ఉత్తర తెలంగాణలో కీలకమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి మొదటివారంలో జరిగే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల తరువాత ఇది ముఖ్యమైన…

TELANGANA

రైతుబంధుపై కుట్ర జరుగుతోంది: హరీశ్ రావు

రైతుబంధు పథకాన్ని శాశ్వతంగా బంద్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. రైతుబంధు కంటే రూ. 500 బోనసే మేలని రైతులు చెబుతున్నారంటూ వ్యవసాయశాఖ మంత్రి చెప్పడం దారుణమని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.   కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుబంధును బంద్ చేస్తారని…