News

TELANGANA

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ గుడ్‌న్యూస్…

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రాలకు నిమిషం ఆలస్యం నిబంధన తొలగించింది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించాలని నిర్ణయించింది. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు 5 నిమిషాలు గ్రేస్ టైం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.     ఇప్పటి వరకు 9 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను అనుమతించని అధికారులు. తాజా నిర్ణయంతో విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది. అనేక మంది విద్యార్థులు ఒక నిమిషం నిబంధనతో పరీక్షలకు దూరమవుతున్న…

AP

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ విడుదల-మోసం చేసే వాడే మోడీ అన్న షర్మిల..

గతంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దాన్ని అమలు చేసేదీ తామేనంటోంది. ఈ మేరకు ఇవాళ తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల చేసింది. తాము అధికారంలో రాగానే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని తెలిపింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఓ ప్రకటన చేశారు. ఈ సభలో రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా హాజరయ్యారు.  …

AP

వైసీపీ 9వ జాబితాలో సంచలనాలు-అనూహ్యంగా సాయిరెడ్డికి- మంగళగిరిలో మళ్లీ మార్పు..

వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఇవాళ 9వ జాబితాను సీఎం జగన్ విడుదల చేశారు. ఇందులో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఓ ఎంపీ, రెండు అసెంబ్లీ సీట్లకు మాత్రమే ఇన్ ఛార్జ్ లను ప్రకటించారు. ఇందులో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపికతో పాటు మంగళగిరి అసెంబ్లీ స్దానంలో మరోసారి ఇన్ ఛార్జ్ మార్పు ఉండటం సంచలనంగా మారింది. వైసీపీ ఇవాళ ప్రకటించిన ఇన్ ఛార్జ్ ల జాబితాలో కేవలం మూడు…

National

సూర్యఘర్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రూ. 78 వేల సబ్సిడీ..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’కు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంతో కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది.   కేబినెట్ నిర్ణయాలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. రూ. 75,021…

AP

మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్ కక్ష సాధింపే… వైసీపీ సర్కారుపై చంద్రబాబు నిప్పులు..

మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్‌ను అక్రమ అరెస్ట్ ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని మండిపడ్డారు తెలుగుదేశం దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తెలుగుదేశంపార్టీ నాయకులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.   వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులో భాగమే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టు అని విమర్శించారు. శరత్ అక్రమ అరెస్టును…

TELANGANA

మేడారం హుండీల లెక్కింపు.. అంబేద్కర్‌ ఫొటో నోట్ల కలకలం…!

మేడారం హుండీల లెక్కింపు జరుగుతోంది. నాలుగు రోజులపాటు జరిగిన జాతరలో భక్తులు కానుకలు సమర్పించారు. అయితే హుండీల లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు రావడం కలకలం రేపింది. విచిత్రంగా నకిలీ కరెన్సీపై రాజ్యాంగ నిర్మాత బీఆర్‌.అంబేద్కర్‌ ఫొటో ఉండడం గమనార్హం. ఇలా అంబేద్కర్‌ ఫొటో ఉన్న రూ.100 కరెన్సీ నోట్లు ఎక్కువగా కనిపించాయి.   అంబేద్కర్‌ ఫొటో ముద్రణకు డిమాండ్‌.. హుండీల్లో వేసిన ఈ కరెన్సీ నోట్ల వెనుక పలువురు భక్తులు భారత కరెన్సీపై అంబేద్కర్‌ ఫొటో…

TELANGANA

బస్తీ మే సవాల్.. మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా రేవంత్.. తొడగొట్టిన కేటీఆర్.!

‘రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా. ఢిల్లీకి బ్యాగులు మోసేందుకే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదు. జీవో 111 రద్దుకు అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి. ప్రజాభిప్రాయం మేరకే మేం ఎత్తివేశాం. ప్రస్తుతం మా దృష్టి పూరి‍్తగా తెలంగాణపైనే. కాంగ్రెస్‌ నేతలు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒక్క ఎన్నికల్లో గెలిస్తే మగాడా? ఓడితే కాదా? రేవంత్‌ను ఏదో భయం వెంటాడుతోంది. మగాడివైతే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. మహిళలకు…

AP

ఎన్నికల్లో అభ్యర్థుల కోసం షర్మిల ఇంటర్వ్యూ..

ఎన్నికలంటే ఏ రాజకీయ పార్టీ కైనా సవాలే. అన్ని రాజకీయ పార్టీలు కేవలం అధికారాన్ని దక్కించుకోవడం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన విజయం దక్కుతుందనే గ్యారెంటీ లేదు. ప్రజల మెప్పు పొందిన వారికే అధికారం లభిస్తుంది. లేకుంటే ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావలసి వస్తుంది. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని అనుకోదు. ఎందుకంటే అధికారం అనేది చేతిలో ఉంటే ఏదైనా చేయవచ్చు. దేన్నైనా శాసించవచ్చు. ప్రస్తుతం…

AP

టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు.. కీలక పరిణామం.

ఏపీలో పొత్తుల అంశం కీలక మలుపులు తిరుగుతోంది. తెలుగుదేశం,జనసేన ఒక తాటి పైకి వచ్చాయి. కలిసి అభ్యర్థులను ప్రకటించాయి. టిడిపి 94, జనసేన ఐదు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో బిజెపి వస్తుందా? రాదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. బిజెపి అగ్ర నాయకత్వం నుంచి ఎటువంటి స్పందన లేకుండా పోయింది. నెల రోజుల కిందట ఢిల్లీ వెళ్లి వెళ్లిన చంద్రబాబు బిజెపి అగ్రనేతలతో సమావేశం అయ్యారు. పొత్తులపై చర్చలు జరిపారు. బిజెపి చంద్రబాబుకు కీలక…

National

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం..

జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బెంగళూరు-భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఖచ్చితమైన సంఖ్యను అధికారులు ప్రకటించాల్సి ఉంది.   అనసోల్ పరిధి జంతారా ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు, రైల్వే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడినవారిని అంబులెన్స్‌ల్లో హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించాయి. సహాయక…