News

TELANGANA

రాజ్‌భవన్‌లో ఎట్ హోం: సీఎం రేవంత్ సహా ప్రముఖుల హాజరు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు దూరం..

గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా రాజ్‌భవన్‌లో శుక్రవారం రాత్రి ఎట్‌ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అహ్వానం మేరకు సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సహా మంత్రులు, వివిధ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు గవర్నర్ ఆతిథ్యం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది.   కాగా, రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎట్హోం కార్యక్రమం జరగడం…

AP

మంత్రికి జగన్ మార్క్ షాక్ – బుట్టాకు ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఖరారు..!!

సీఎం జగన్ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ ఇంఛార్జ్ ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇంఛార్జ్ లను ప్రకటించిన నియోజకవర్గాల్లోనూ అవసరమైతే మళ్లీ మార్పుల కు సిద్దం అవుతున్నారు. కర్నూలు మంత్రి గుమ్మనూరు జయరాంకు ఎంపీ సీటు కేటాయించారు. ఆయన టీడీపీతో టచ్ లోకి వెళ్లారని సమాచారం. దీంతో, జగన్ వెంటనే షాక్ ఇచ్చారు. ఆయన స్థానంలో ఎంపీ అభ్యర్దిని ఖాయం చేసారు. మాజీ ఎంపీని ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతున్నారు.…

AP

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనకు వచ్చే సీట్లివే ! కమెడియన్ పృధ్వీ లెక్క ఇలా..!

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ప్రతీ సీటును ప్రతీ పార్టీ కీలకంగా భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన అధికార వైసీపీ కూడా ఈసారి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెల్చుకోవాలనే లక్ష్యంతో చాలా చోట్ల ఇన్ ఛార్జ్ లను మార్చేస్తోంది. అటు వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన విపక్ష టీడీపీ-జనసేన సైతం సీట్ల పంపకాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ…

National

భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌ జిల్లాలోకి గురువారం న్యాయ్ యాత్ర ప్రవేశించింది. ముందుగా అనుకున్న రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా బెంగాల్ లోని ఉత్తరాది జిల్లాల నుంచి బీహార్‌లోకి ప్రవేశించేలా రూట్ ఛేంజ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలే ఇందుకు…

TELANGANA

రైతు భరోసా అమలు ముహూర్తం ప్రకటించిన రేవంత్..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. తెలంగాణలో రైతు భరోసా పైన చర్చ జరుగుతున్న వేళ ఈ పథకం ఎప్పుడు అమలు చేసేదీ క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన గ్యారంటీల అమలు పైన క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ పైన రేవంత్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ నేతలు తన పైన చేస్తున్న విమర్శలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.   బీఆర్ఎస్…

TELANGANA

ఆ విషయంలో బట్టలిప్పి నిలబెడతాం: రేవంత్ రెడ్డిపై ఘాటుగా కేటీఆర్!!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అధికారంలోకి వచ్చిన 45 రోజులైనా రేవంత్ రెడ్డి సాధించింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుంచి సాగుతుందన్నారు.   రాష్ట్రంలో రైతు భరోసా ప్రారంభించినట్టు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని కేటీఆర్ ఆరోపించారు. ఇలా అబద్ధాలు చెప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.…

AP

కాంగ్రెస్ లోకి డీఎల్, కడప నేతలు – షర్మిల మంత్రాంగం..!! .

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. నేతల పార్టీల మార్పు వేగంగా జరుగుతోంది. ఏపీలో పట్టు పెంచుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. వైసీపీ సీట్ల ఖరారు వేళ సీటు ఖరారు కాని నేతలు కొందరు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. షర్మిల సైతం గతంలో కాంగ్రెస్ లో పని చేసిన నేతలను తిరిగి యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కడప జిల్లా సీనియర్లను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు.   కాంగ్రెస్ లో చేరికలు : ఏపీలో కాంగ్రెస్…

AP

పాపం.. షర్మిల మాటలు వింటే జాలేస్తోంది; లోకేష్ ట్వీట్ పైనా.. మంత్రి బొత్సా కౌంటర్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను పేలుస్తూ రాజకీయాలను రసవత్తరంగా మార్చారు. వైయస్ కుటుంబంలో చీలిక తెచ్చింది జగన్ అంటూ వైయస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని జగన్ చేసిన వ్యాఖ్యలపైన ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.   రాష్ట్రం అభివృద్ధి లేక దయనీయస్థితిలో…

National

2036 ఒలింపిక్స్ భారత్‌లోనే..!

ఒలింపిక్స్‌ క్రీడలు 2036 సంవత్సరంలో ఇండియాలో జరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2023 డిసెంబరు చివరివారంలో తన గుజరాత్ పర్యటన సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకోగలిగితే.. అవి అహ్మదాబాద్‌లోనే ఉండొచ్చనీ ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకీ ఒక దేశం.. ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలంటే ఏ అర్హతలను కలిగి ఉండాలి? ఆతిథ్య దేశం విషయంలో ఒలింపిక్స్ కమిటీ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది? వంటి అంశాలను…

TELANGANA

తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న నావికాదళం… వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్.

భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్‌ను ఉపయోగిస్తుంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్ట మొదటిది. 1990 నుంచి…