News

AP

ఈ 9 జిల్లాలతో టీడీపీ తొలి జాబితా..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమౌతోన్నారు.   విశాఖపట్నం జిల్లా భీమిలీలో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు. క్యాడర్‌లో ఎన్నికల ఊపును తీసుకొచ్చారు. జోష్‌ను నింపారు. ఎన్నికల కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు…

TELANGANA

రేవంత్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు – బెర్తులు దక్కేదెవరికి..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ, పాలనా పరంగా వేగంగా తన ఆలోచనలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన రేవంత్..ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ గురించి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని అంచనా. ఈ లోగానే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు.   మంత్రివర్గ విస్తరణ : ముఖ్యమంత్రి రేవంత్ తన మంత్రివర్గ విస్తరణకు నిర్ణయించారు. మొత్తం…

TELANGANA

నెలన్నర రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో 12 కోట్ల మంది మహిళల ప్రయాణం..

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి రోజు లక్షలాది మంది మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.   45 రోజుల్లో 12 కోట్లకుపైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని సజ్జనార్ తెలిపారు. సగటున ప్రతి రోజు 27 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తున్నారని వెల్లడించారు. నాంపల్లిలోని…

National

అయోధ్య‌లో ప్రారంభ‌మైన రాగ సేవ కార్య‌క్ర‌మం..45 రోజుల‌పాటు..

అయోధ్య రామమందిరంలో బాల‌క్ రామ్ విగ్ర‌హ ప్ర‌తిష్ట అనంత‌రం భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతూనే ఉంది. ఇక్క‌డి బాల రాముడికి అంకితమిస్తూ భక్తి సంగీత ఉత్సవం ప్రారంభ‌మైంది. అయోధ్య గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఈ సంగీత ఉత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ సంగీత కార్యక్రమం మార్చి 10 వరకు అంటే 45 రోజులపాటు కొనసాగనుంద‌ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులు వెల్ల‌డించారు.   ఈ సంగీత ఉత్స‌వం శాస్త్రీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మంలో దేశంలోని…

TELANGANA

కేసీఆర్ ఈజ్ బ్యాక్…

అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని ఎదుర్కొన్న భారత్ రాష్ట్ర సమితి.. లోక్‌సభ బరిపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాలను ఇక్కడ పునరావృతం కాకుండా చూసుకుంటోంది. అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది. రెండు- మూడు తప్ప అన్ని లోక్‌సభ నియోజకవర్గాలపైనా సమీక్షలు పూర్తి చేసింది.   అటు అధికార కాంగ్రెస్ పార్టీపై దాడికి సమాయాత్తమౌతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటి కోసం పోరుబాట పట్టబోతోంది. ఇప్పటికే రేవంత్ సర్కార్‌కు అల్టిమేటాన్ని…

TELANGANA

రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..

తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ నెలాఖరు నాటికి ఈ-కేవైసీ గడువు ముగియబోతోన్న నేపథ్యంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గడువును మరో నెల రోజుల పాటు పొడిగించింది.   ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఉన్న పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ.. రాష్ట్రవ్యాప్తంగా బోగస్‌ కార్డుల ఏరివేత చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం లబ్దిదారులు తమ రేషన్‌ కార్డులను అప్‌డేట్ చేసుకోవడానికి ఈ-కేవైసీ విధానాన్ని…

AP

కౌంట్ డౌన్, మేము సిద్దం – సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్..!!

ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. సీఎం జగన్ – టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. సీఎం జగన్ ఈ రోజు భీమిలి వేదికగా ఎన్నికలకు సిద్దం అంటూ భారీ సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. ఇటు చంద్రబాబు రా కదలిరా సభల ద్వారా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.పీలేరు లో జరిగిన సభలో ముఖ్యమంత్రి పైన చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసారు. మంత్రులు రోజా..పెద్దిరెడ్డి తీరు పైన ధ్వజమెత్తారు.  …

AP

పవన్ ఎఫెక్ట్, టీడీపీలో సీట్ల రచ్చ – అచ్చెన్న నిలదీత, అల్టిమేటం..!!

టీడీపీ, జనసేన పొత్తులో రచ్చ మొదలైంది. సీట్ల పంచాయితీలు రోడ్డెక్కాయి. టీడీపీ మిత్రధర్మం పాటించకుండా సీట్లు ప్రకటించటం పైన పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ చేసిన ప్రకటనకు ప్రతిగా తాను రెండు సీట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ రెండు సీట్లలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నిలదీసారు. టికెట్ల పైన తేల్చాల్సిందేనని అల్టిమేటం జారీ చేసారు.   పొత్తుల చిక్కులు :…

Uncategorized

తైవాన్ దేశస్థుడికి ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డ్ ప్రకటించిన కేంద్రం..!..

యావత్ దేశం నేడు 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. దీనికోసం దేశ రాజధాని ముస్తాబైంది. అన్ని చారిత్రాత్మక కట్టడాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మువ్వెన్నల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వాహనాల తనిఖీలను నిర్వహిస్తోన్నారు.   గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డును ప్రకటించింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి.. పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకోనున్నారు. వైజయంతిమాల బాలి, బిందేశ్వర్ పాఠక్,…

TELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు..

బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన సతీమణి నీలిమపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తప్పుడు పత్రాలతో భూ ఆక్రమణలకు యత్నించారని పీర్జాదిగూడకు చెందిన రాధిక.. పల్లా దంపతులపై ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్లా దంపతులపై కేసు నమోదు చేరశారు.   జోడిమెట్ల సమీపంలోని చౌదరిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఫ్లాట్ల విషయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్లాట్లు 1984లో…