News

National

బడ్జెట్ సమావేశాలు.. ఎంపీలందరిపై సస్పెన్షన్ ఎత్తివేత….

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. ఇంకో నెల రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మార్చి రెండో వారం నాటికి దీన్ని విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్/మేలల్లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది.   ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంకొన్ని గంటల్లో లోక్‌సభ, రాజ్యసభలు సమావేశమౌతాయి. ఇవి- ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు. బుధవారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి…

AP

ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల లేఖ..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కీలకమైన విభజన హామీలపై ఇప్పటికే అన్న వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. పాతికమంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న హామీ ఏమైందని, మిగతా హామీలపై కేంద్రం సైలెంట్ గా ఉంటున్నా ఎందుకు అడగటం లేదని సూటిగా నిలదీస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ప్రధాని మోడీకి షర్మిల లేఖ రాశారు. ఇందులో విభజన హామీల నుంచి వైజాగ్ స్టీల్ వరకూ…

AP

వైసీపీ ఐదో జాబితాలో ఎమ్మెల్యేలు వీరేనా..?

ఏపీలో అధికార వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం సుదీర్ఘంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాల్ని విడుదల చేసిన వైసీపీ.. 58 సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని, 10 మంది ఎంపీల్ని మార్చేసింది. వీరిలో పలువురు ఇప్పటికే పార్టీలు కూడా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన జాబితాల్లో పలు సీట్లలో తిరిగి మార్పులకు కూడా వైసీపీ సిద్ధమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు కొత్తగా ఈ జాబితాలో ఉండబోయే వారిపై చర్చ జరుగుతోంది.  …

National

మరో 7 రోజుల్లో CAA అమలు: కేంద్ర మంత్రి..

కేంద్ర మంత్రి, బీజేపీ నేత శంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. వచ్చే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా CAAని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల కాక్ ద్వీప్‌లో జరిగిన బహిరంగ సభలో ఈ హామీ ఇచ్చారు.

TELANGANA

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అసలు విషయం చెప్పిన కేటీఆర్..

పదేళ్లపాటు కమిట్మెంట్‌తో పనిచేశామని.. అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడిపించామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్ఎస్‌ను ఆదేశించారని కేటీఆర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.   మార్పు అనే పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఆరున్నర లక్షల…

TELANGANA

అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు..ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.   ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని…

AP

జగన్ ఆపరేషన్ “గోదావరి”, పవన్ ఓట్ బ్యాంక్ పై గురి – అదే జరిగితే, ఇక నో ఛాన్స్..!!

ఏపీలో ఎన్నికల వేళ పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలే కీలకం. అక్కడ పట్టు సాధించేందుకు టీడీపీ, జనసేన పూర్తిగా స్థానిక సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే జగన్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలే అస్త్రంగా అభ్యర్దుల ఎంపిక పూర్తి చేస్తన్నారు. ఇదే సమయంలో రెండు జిల్లాల పైన ప్రత్యేక ప్లాన్ అమలుకు సిద్దమయ్యారు.   జగన్ కొత్త…

AP

వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్- హైకోర్టు కీలక నిర్ణయం…

ఏపీలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారాన్ని అధికార వైసీపీ తెరపైకి తెచ్చింది. ఇప్పటికే పార్టీలు ఫిరాయించిన 9 మంది వైసీపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు ఎందుకు వేయకూడదంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇవాళ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి వివరణ ఇచ్చారు. అయితే విచారణకు తక్కువ సమయం ఇచ్చిన స్పీకర్ నిర్ణయంపై వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు.   ఈ మేరకు…

National

మాల్దీవుల పార్లమెంటులో రగడ… కోడిపుంజుల్లా కలబడిన ఎంపీలు..

భారత పొరుగు దేశం, చిన్న చిన్న దీవుల సమూహమైన మాల్దీవ్స్ పార్లమెంటులో ఆదివారం ఎంపీల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు మధ్య మొదలైన వివాదం.. తన్నులు, ముష్టిఘాతాల వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   మాల్దీవ్స్‌లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు ఆదివారం పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. కానీ మాజీ ప్రెసిడెంట్ ఇబ్రహీం మొహమద్ సొలెహ్ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి…

AP

నేడు వైసీపీ అయిదో జాబితా..

పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్‌సభ స్థానానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, నెల్లూరు సిటీ సిట్టింగ్ శాసన సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్టే. ఈ సాయంత్రానికి విడుదల అయ్యే అయిదో జాబితాలో ఆయన పేరు ఉండొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.   నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీసీ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వడం ఖరారు కావడం, తనను…