News

TELANGANA

తెలుగు రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్టులు, కేటాయింపులు..!

కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇందులో ప్రస్తావించిన అంశాలు, కేటాయింపుల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల సమయం లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలోనే రైల్వే బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు చేసిన కేటాయింపుల పైన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. గతం కంటే అంచనాలు పెరిగినట్లు వెల్లడించారు.   ఎన్నికల ఏడాది కావటంతో నిర్మలా…

AP

ఢిల్లీ కేంద్రంగా నేడు వైయస్ షర్మిలా దీక్ష..!

వైఎస్ షర్మిల ఏ పని చేసినా ఆచి తూచి అడుగేస్తారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఏపీలో ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చి, వచ్చే ఎన్నికల్లో బలంగా బరిలో నిలిచేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో జనం నాడిని పట్టుకోవటానికి ఆమె ప్రయత్నాలు సాగిస్తున్నారు.   ఏపీ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాన్ని…

TELANGANA

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి.. తొలిసారి ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్!!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అసెంబ్లీలో గజ్వేల్ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల తుంటి శస్త్ర చికిత్స జరిగిన ఆయన చేతి కర్ర సహాయంతో తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ అసెంబ్లీ వద్ద కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఆపై కెసిఆర్ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కెసిఆర్ తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత…

TELANGANA

అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక, ఎందుకంటే..?

ప్రజలను ఇబ్బంది పెట్టి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని అన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.   గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల సమీక్ష జరుగుతుండగా ఈ అంశం చర్చకు…

APTELANGANA

ఇస్తున్నవి ఇచ్చేవి–పేదరికంని పాల దోలవు. .

ఇస్తున్నవి ఇచ్చేవి–పేదరికంని పాల దోలవు. ఫోటో రైటప్స్: 1. జనం వినతుల వెల్లువ. 2 ఆవాసం నివాసం కోసం ఎగబడిన జనం. 3 మా కోసం మా ఊరు వచ్చావయ్యా. 4 పేదల కోసం యాత్ర. 5 నా దారి పేదల రహదారి అంటూ జాతీయ రహదారిప అన్నవరం: పేదలు నిరంతరం సమస్యలు ఎదుర్కొంటూ వాటితో పోరాడుతూనే ఉన్నారని ప్రస్తుతం వారి కోసం అంటూ ఇస్తున్నవి ఇచ్చేవి పేదరికం పారదోలడానికి ఏమాత్రం ఉపయోగపడని దళాధిపతి విజయ్ పేర్కొన్నారు.…

National

మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మల సీతారామన్..

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీలను అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుంటారు. అధికారులతో కలిసి అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకుంటారు.   ఆ తర్వాత ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు.…

TELANGANA

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వ్యవహారం ఇప్పుడు కోర్టుకు చేరింది. ఈ అంశం పైన తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. దీని పైన విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దీని పైన రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు ప్రారంభించారు.   హైకోర్టులో విచారణ : ఆర్టీసీ…

TELANGANA

2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తాం: గత సర్కారులా కాదంటూ రేవంత్ రెడ్డి

ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7094 మంది స్టాఫ్ నర్సులకు నియామకపత్రాలు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం తెలిపారు.   త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు కూడా భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్…

AP

వైసీపీ ఐదో జాబితా విడుదల..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఇంఛార్జీలతో ఐదో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేసిన వైసీపీ.. తాజాగా, ఏడుగురితో ఐదో జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.   మరోవైపు, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ…

AP

జగన్ Vs చంద్రబాబు, ఆ మూడు రోజులే కీలకం – గెలుపు నిర్ణయం అక్కడే..!!

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 20 తరువాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతో, ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. వైసీపీ తమ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ హాయంలో చివరి విడత అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. అసెంబ్లీ వేదికగా కీలక పరిణామలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ఆ మూడు రోజులు వచ్చే ఎన్నికల్లో డిసైడిగ్ టైం కానున్నాయి.   అసెంబ్లీ…