News

TELANGANA

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సీనియర్ నేత..?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ ను కలవటం పైన కొత్త ప్రచారం మొదలైంది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ ముఖ్య నేత పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు.   బీఆర్ఎస్ నేత, స్టేషన్…

TELANGANA

2.82 లక్షల ప్రజాపాలన దరఖాస్తుల తిరస్కరణ..!

అభయహస్తం పథకాలు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తు స్వీకరించారు. జనవరి 17 నాటికి దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయింది. వచ్చిన 1,09,01,255 దరఖాస్తులలో 2.82 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. వాటిని నకిలీవిగా గుర్తించి తిరస్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు.   దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డ్ నంబర్‌, రేషన్ కార్డ్ నంబర్ ను నమోదు చేయలేదని వివరించారు. అసంపూర్తిగా ఉన్న…

AP

బ్లాక్‌మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తారా – టీడీపీ నేతలపై పోతిన ఆగ్రహం..!!

ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల కోసం టీడీపీ, జనసేన మధ్య పంచాయితీలు మొదలయ్యాయి. టీడీపీ పొత్తు ధర్మం పాటించకుండా రెండు సీట్ల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ తన పార్టీకి రెండు సీట్లు ప్రకటించారు. ఇక, ఇప్పుడు సీట్ల ఖరారు పైన చంద్రబాబు – పవన్ కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో విజయవాడ పశ్చిమం సీటు పైనా టీడీపీ..జనసేన నేతల మధ్య డైలాగ్ వార్ మొదలైంది.   విజయవాడ…

AP

తోడేళ్ల మధ్య జగన్ ఒంటరే-కానీ జన హృదయాల్లో ఉన్నా-ఏలూరు సభలో గర్జన..

ఏలూరులో ఇవాళ నిర్వహించిన వైసీపీ సిద్ధం 2 సభలో సీఎం జగన్ మీరు సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించారు. మరో చారిత్రక విజయం అందుకునేందుకు సిద్ధమా.. ఇంటింటి భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమా… పేదల భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమా..దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి సిద్ధమా.. అని వైసీపీ శ్రేణుల్ని ప్రశ్నించారు. రామాయణం, భారతంలో విలన్లంతా ఎల్లో మీడియా, విపక్షాల రూపంలో ఇక్కడే ఉన్నారంటూ జగన్ గుర్తుచేశారు. ఇంతమంది తోడేళ్ల మధ్య జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని, కానీ కోట్ల మంది…

National

వికసిత్‌ భారత్‌ టార్గెట్‌ 2047..

ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 1న) లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2024–25పై మాట్లాడారు. దేశంలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేశామని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర పెంచుతూ వచ్చామని తెలిపారు. యువత ఉపాధికి పెద్దపీట వేశాన్నారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

AP

వైసీపీ ఆరో జాబితా విడుదల..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అయిదు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 75 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించింది.   ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. కొన్నిచోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను…

AP

హాట్ సీట్ మైలవరం వైసీపీ అభ్యర్థిగా..!!

కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ఖాయం చేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సిట్టింగ్ శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్‌కు ఈ సారి టికెట్ ఇవ్వట్లేదు. ఆయనకు బదులుగా మరో అభ్యర్థిని తెరమీదికి తీసుకొచ్చింది పార్టీ అగ్రనాయకత్వం.   వసంత కృష్ణ ప్రసాద్.. కొంతకాలంగా పార్టీపై వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి- పెడన ఎమ్మెల్యే, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌తో ఆయనకు విభేదాలు ఉన్నాయి. వీటిని…

TELANGANA

4న తెలంగాణ కేబినెట్ భేటీ..

తెలంగాణలో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. ప్రధానంగా బడ్జెట్, గవర్నర్ ప్రసంగంపై చర్చించేందుకు ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఫిబ్రవరి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.   ఫిబ్రవరి 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.…

TELANGANA

త్వరలో రేవంత్ మార్క్ బడ్జెట్.. అన్ని నియోజకవర్గాలకు గుడ్ న్యూస్..!!

ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుండి తెలంగాణా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారని సమాచారం. అయితే ఈసారి తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న బడ్జెట్ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అది రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.   ఈ క్రమంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో…

AP

నాకు టికెట్ ఇవ్వకుంటే వాళ్ళు ఉరేసుకుంటారు..బెదిరిస్తున్న టీడీపీ నేత!!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ల కోసం అన్ని పార్టీలలోనూ ఆశావహుల సమరం కొనసాగుతుంది. ఇప్పటికే వైసీపీలో టిక్కెట్లు దక్కవని భావిస్తున్న వారు టీడీపీ, జనసేన పార్టీలలో చేరుతున్నారు. దీంతో ఏపీలో వలసల పర్వం కొనసాగుతుంది.   ఇదిలా ఉంటే ఇక టీడీపీలోనూ టీడీపీ, జనసేన పొత్తుల నేపధ్యంలో చిచ్చు రగులుకుంది. జనసేన ఆశిస్తున్న స్థానాలలో టీడీపీ నుండి ఆశావహులు టికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో…