News

TELANGANA

బాల్క సుమన్‌పై క్రిమినల్ కేసులు నమోదు..

భారత్ రాష్ట్ర సమితి అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు ఆయనపై మండిపడుతున్నారు. నిప్పులు చెరుగుతున్నారు. మాటలదాడికి దిగారు.   తాజాగా- బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, చెన్నూర్ మాజీ శాసన సభ్యుడు బాల్క సుమన్.. రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయారు. ఘాటు విమర్శలు చేశారు. అనేక ఆరోపణలను సంధించారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తూ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద పాలేరుగా అభివర్ణించారు. మంచిర్యాల…

TELANGANA

సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సుమారు గంటపాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.   సోనియాతో భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా సోనియా గాంధీతో సమావేశమైనట్లు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి…

AP

జగన్ ఎన్నికల వరాలు – ప్రధాన ఓట్ బ్యాంక్ పై గురి, ఆపరేషన్ అపోజీషన్..!!..

ఏపీలో సీఎం జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. సిద్దం సభల ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. చంద్రబాబు తో అందరూ ఓడాల్సిందేనని నినదించారు. ప్రతీ సీటు గెలవాల్సిందేనని పిలుపునిచ్చారు. తాము అమలు చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం తమను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో కొత్త వరాల పైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త బడ్జెట్ ప్రతిపాదన వేళ వీటిని ఖరారు చేసే అవకాశం ఉంది.   జగన్ కొత్త వ్యూహాలు ముఖ్యమంత్రి జగన్…

AP

వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా ప్రకటన వాయిదా ! కారణమిదేనా..?

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే ఒకరు ఇవాళ రాజీనామా ప్రకటనకు సిద్దమయ్యారు. ఆయన అనుచరులతో భేటీ అయి ఈ ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. చివరి నిమిషంలో ఏమైందో ఏమో కానీ ప్రెస్ మీట్ పెట్టినా రాజీనామా ప్రకటన తప్ప మిగతా అన్నీ చెప్పారు. దీంతో అసలేం జరిగిందన్న చర్చ ఇప్పుడు అందరిలోనూ జరుగుతోంది.   వైసీపీలో అతి కొద్ది కమ్మ సామాజిక ఎమ్మెల్యేల్లో ఒకరైన…

National

పేటీఎం కథ ముగిసినట్లేనా…?

పేటీఎంపై ఆర్బీఐ పలు ఆంక్షాలు విధించడంతో పేటీఎం షేర్లు కుప్పకూలుతున్నాయి. అయితే పేటీఎం సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే ఆర్బీఐ ఆంక్షాలు విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఎలాంటి డిపాజిట్లు సేకరించ కూడా ఆర్బీఐ నిషేధం విధించింది. అంతేకాదు పేటీఎం నుంచి టోల్ ఛార్జీలు, క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయకుండా ఆదేశించింది. దీంతో పేటీఎం వాడే వారు ఏం చేయాలో అర్థం కాకా అయోమయంలో పడిపోయారు.   ఫిబ్రవరి 29 వరకు పేటీఎం పని చేస్తోంది.…

TELANGANA

బీఆర్ఎస్ ఓటమి కూడా మంచికే – కేటీఆర్..!!

తెలంగాణ అధికార కాంగ్రెస్..బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ రెండు పార్టీలు తమ పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి బీఆర్ఎస్ కు అవకాశం లేకుండా చేయాలనేది కాంగ్రెస్ లక్ష్యం. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవటం ద్వారా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలనేది కేసీఆర్ వ్యూహం. ఈ క్రమంలోనే ఎన్నికలకు సిద్దం అవుతూనే ఒక పార్టీని మరో పార్టీ ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.   కాంగ్రెస్ ప్రభుత్వం…

TELANGANA

రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్ స్కీంలకు ఆమోదం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయింది. ఈ మేరకు వివరాలను సమావేశం అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాకు వెల్లడించారు.   తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌కు టీజీగా…

AP

జనసేనలో చేరిన బాలశౌరి..కూలీనంటూ పవన్ కళ్యాణ్, దమ్మున్న నేతన్న ఎంపీ…

తాను ‘పవర్ స్టార్‌’గా కంటే ప్రజల కోసం పనిచేసే కూలీగా గుర్తిస్తే గవర్వపడతానని అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. బాలశౌరికి జనసేన పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్. ఎంపీటోపాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం, వైసీపీ…

AP

చంద్రబాబుతో ఒకేరోజు రెండుసార్లు పవన్ కళ్యాణ్ భేటీ..సుదీర్ఘ చర్చ..

తెలుగదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలూ సమావేశమయ్యారు. అంతకుముందు ఆదివారం మధ్యాహ్నం చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ దాదాపు 3 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై తుది కసరత్తులో భాగంగా మరోసారి భేటీ అయినట్లు తెలుస్తోంది.   అయితే, ఒకరేజో రెండు సార్లు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీట్ల సర్దుబాటుపై…

National

ఎల్ కే అద్వానికి భారతరత్న..

భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి ఇవాళ కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రకటించింది. వృద్ధాప్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఇంట్లోనే ఉంటున్న ఆయనకు ఇవాళ భారత రత్న పురస్కారం అందిస్తున్నట్లు ప్రధాని మోడీ ఫోన్ చేసి తెలిపారు. అనంతరం ఎక్స్ లో ఈ మేరకు పోస్ట్ కూడా పెట్టారు. దీంతో అద్వానీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు భారత రత్న అవార్డు ప్రకటించడంపై అద్వానీ కూడా…