News

TELANGANA

మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ కమిటీ నివేదికలో సంచలన విషయాలు..

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్రప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో 16 నుంచి 21వ పియర్స్‌ వరకు పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ పేర్కొంది. అంతేగాక, 6,7,8 బ్లాకులను ఎల్ అండ్ టీ కాకుండా సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారని, మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని నివేదికలో వెల్లడించింది.   కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి ఐదు సీజన్లు పూర్తయినా కాఫర్ డ్యాం…

TELANGANA

కేసీఆర్‌పై రేవంత్ వ్యంగ్యాస్త్రాలు..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు సీఎం రేవంత్.   కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందన్న రేవంత్ రెడ్డి..…

AP

పవన్ కల్యాణ్ పోటీపై నాగబాబు క్లారిటీ..!

ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. ఢిల్లీ కేంద్రంలో ఏపీలో పొత్తుల రాజకీయం కొనసాగుతోంది. చంద్రబాబు తిరిగి ఎన్డీఏలో చేరేలా అడుగులు వేస్తున్నారు. అటు జగన్ రేపు (శుక్రవారం) ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. టీడీపీ, జనసేన తో బీజేపీ పొత్తు ఖాయమైతే మరోసారి సీట్ల పంపిణీ పైన కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు రోజుల్లోనే బీజేపీ తో పొత్తు వ్యహారం తేలిపోనుంది. ఇటు పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం గురించి నాగబాబు…

AP

ప్రధానితో జగన్ భేటీ..

ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. పొత్తుల లెక్కలు సమీకరణాలు మారుతున్నాయి. ఎన్డీఏలోకి టీడీపీ తిరిగి చేరటం దాదాపు ఖాయమైంది. అమిత్ షా తో చంద్రబాబు తాజా భేటీలో ఈ మేరకు చర్చ జరిగింది. కొన్ని ప్రతిపాదనల పైన తుది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ సమయంలోనే ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ ఆసక్తి కరంగా మారింది. ఇటు ఢిల్లీకి వెళ్లే ముందు పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశం కానున్నారు. మారుతున్న లెక్కలు…

NationalTELANGANA

రైల్వే టికెట్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు..

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్‌, జోన్‌ పరిధిలోని ప్రధాన రైల్వేస్టేషన్‌లలోని టిక్కెట్‌ కౌంటర్లలో డిజిటల్‌ చెల్లింపులు అందుబాటులో తీసుకొచ్చారు. POS, UPI (ఫోన్ పే, Google Pay మొదలైనవి) ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ నగదు రహిత విధానం వల్ల ప్రయాణికుల సమయం ఆదా కావడమే కాకుండా చిల్లర సమస్యలు ఉండవని అధికారుల తెలియజేశారు. త్వరలోనే అన్ని చోట్ల ఈ సౌకర్యాలను తీసుకొస్తామని రైల్వే శాఖ తెలిపింది.

TELANGANA

నీటి పారుదల శాఖలో భారీప్రక్షాళన..

నీటి పారుదల శాఖలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజినీర్లపై చర్యలు చేపట్టింది. రామగుండం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లును తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈఎన్‌సీ జనరల్ మురళీధర్ రావును రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మరికొందరు ఇంజినీర్లపైనా వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.   తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం…

TELANGANA

రేవంత్ Vs కేసీఆర్, సభా సమరం..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించనున్నారు. కాగా.. 10వ తేదీన ప్రభుత్వం శాసనసభలో ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. సమావేశాలు 17వ తేదీ వరకూ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై ప్రభుత్వం..బీఆర్ఎస్ పైన చర్చ జరుగుతోంది.   నేటి నుంచి అసెంబ్లీ: తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయాల వేళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం…

AP

ఎన్నికల బరిలో నాగబాబు – నియోజకవర్గం ఖరారు..!!.

ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. అభ్యర్దుల ఎంపిక పైన ప్రధాన పార్టీలు కసరత్తు వేగవంతం చేసాయి. సీఎం జగన్ అభ్యర్దుల కసరత్తు తది దశకు చేరింది. టీడీపీ జనసేన సీట్ల ఖరారు పైన ఒక అంచనాకు వచ్చినా..ఇప్పుడు బీజేపీతో పొత్తు ఖాయం పైన చర్చలు జరుగుతున్నాయి. ఆ తరువాతనే అధికారికంగా సీట్ల ప్రకటన జరగనుంది. ఈ సమయంలోనే మెగా బ్రదర్ నాగబాబు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయటం దాదాపు ఖాయమైంది.   పొత్తులు-…

AP

అమిత్ షాతో చంద్రబాబు భేటీ..

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాుల చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. అలాగే, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. అయితే, టీడీపీతో బీజేపీ పొత్తుపైనే ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. టీడీపీ ఎంపీలతో ఆయన సమావేశం అయ్యారు.   అనంతరం బుధవారం రాత్రి కేంద్రమంత్రి అమిత్ షా…

National

‘భారత్ రైస్’ అమ్మకాలు నేటి నుంచే..

సామాన్యులకు ఊరట కలిగించే వార్త. దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘భారత్ రైస్’ (Bharat Rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని మంగళవారం (ఫిబ్రవరి 8న) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.   రూ. 29కే కేజీ భారత్ రైస్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. భారత ఆహార…