News

TELANGANA

హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు..

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కొత్తగా రూట్ మ్యాప్ తాజాగా ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశాల మేరకు ఫేజ్ 2 రూట్ మ్యాప్ను సిద్దం చేసిన మెట్రో అధికారులు, 70 కిలో మీటర్లు కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.   హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా, సిటీలోని నలుమూలాలకు…

AP

తొలగించిన అంగన్ వాడీ ఖాళీల భర్తీకి జగన్ సర్కార్ రెడీ- 25న నోటిఫికేషన్ ? |

ఏపీలో గత రెండు నెలలుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లపై ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీనికీ వారు లొంగకపోవడంతో ఇవాళ్టి నుంచి సమ్మెల ఉన్న అంగన్ వాడీలను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్లు తమ జిల్లాల్లో సమ్మెలో ఉన్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లను తొలగించే ప్రక్రియ చేపట్టారు.   సమ్మెలో ఉన్న అంగన్ వాడీ వర్కర్లు,…

AP

ఏపీ రాజకీయ పార్టీలకు ఈసీ షాక్..

ఏపీలో రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ ఈసీ భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల్లో లబ్ది పొందేందుకు వీలుగా ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ భారీ ఎత్తున ఓట్లను చేర్పించే కార్యక్రమం చేపట్టాయి. ఇందులో నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఆరోపిస్తూ ఈసీకి పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితాను ఇవాళ ప్రకటించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా మొత్తం 5.6 లక్షల ఓట్లను తొలగించినట్లు ప్రకటించారు.   రాష్ట్రంలో తాజా సవరణ…

National

రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠోత్సవం ఆరంభం..

ఇంకొన్ని గంటలు. 500 సంవత్సరాల నాటి భారతీయుల కల సాకారం కాబోతోంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో.. సరయూ నదీ తీరం ఒడ్డున నిర్మితమైన రామమందిరం ప్రారంభం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది.   ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలు, ప్రధాన మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం…

TELANGANA

కేటీఆర్‍ మతిస్థిమితం కోల్పోయారు.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు…

మాజీ మంత్రి కేటీఆర్ పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిరంకుశ విధానాలు ఇంకా ఉన్నాయన్నారు. విద్యుత్ బిల్లులు కట్టొద్దని కేటీఆర్ అనడం ప్రజాస్వామ్యమా అని నిలదీశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారని చెప్పారు.   గ్యారంటీలు వందరోజుల్లో అమలు చేయడం అంటే చట్టబద్దత రావడమేనని పేర్కొన్నారు. కొంచెం ఆలస్యం అయినా కాంగ్రెస్ గ్యారెంటీలు…

TELANGANA

మూసీ నదిపై ఆర్కిటెక్ట్‌లతో సీఎం రేవంత్ సమావేశం…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో వివరణాత్మక చర్చలు జరిపారు. మూసీ నదిపై మాట్లాడారు. మారథాన్ బ్యాక్-టు-బ్యాక్ మీటింగ్ సెషన్‌లు ప్రధానంగా 56-కిలోమీటర్ల పొడవున్న మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి చేయడం, వాణిజ్య అనుసంధానాలు, పెట్టుబడి నమూనాలను అన్వేషించడంపై చర్చలు జరిపారు. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి తెలిపారు. తదుపరి సంప్రదింపుల కోసం…

AP

ఏపీలో.. ఏప్రిల్ మూడో వారంలో ఎన్నికలు: షెడ్యూల్ విడుదల కావడమే ఆలస్యం..!

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు విడతల్లో లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయిదో జాబితాపై కసరత్తు చేస్తోంది.   ఈ నెల 25వ తేదీన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీని తరువాత షెడ్యూల్…

AP

జనసేనలో చేరుతున్నా.. పవన్ కళ్యాణ్‌పై బాలశౌరి ఆసక్తికర వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలోకి మరో సీనియర్ నేత చేరిక ఖాయమైంది. ఇటీవల అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి త్వరలో మంచి ముహూర్తం చూసి జనసేన పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఆదివారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు.   అనంతరం బాలశౌరి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసినట్లు తెలిపారు. పవన్ తో వివిధ అంశాలపై రెండు గంటలపాటు చర్చించినట్లు…

APNationalTELANGANA

తెలుగు రాష్ట్రాలనుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు..

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య సందర్శనకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు మొత్తంగా 60 రైళ్లు నడుస్తాయని.. వీటిలో 15 హైదరాబాద్ నుంచే ఉంటాయని అన్నారు. అయితే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, తదితర ధార్మిక సంస్థల ద్వారా మాత్రమే బుకింగ్ సేవలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్- అయోధ్య ప్రయాణ ఛార్జీ (స్లీపర్) రూ.1500 ఉంటుందని పేర్కొన్నారు.

TELANGANA

హైదరాబాద్ నడిబొడ్డున గల చారిత్రక ఆలయంలో.. గవర్నర్..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులో రానుంది.   రామమందిరం ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ.. సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలనూ పరిశుభ్రంగా ఉంచేలా స్వచ్ఛ అభియాన్‌ను ప్రారంభించారు. కొద్దిరోజుల కిందటే నాసిక్‌లోని ప్రాచీన…