News

TELANGANA

కరెంట్ బిల్లులు కట్టవద్దు, సోనియాకు పంపండి – కేటీఆర్..!!

మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా లండన్ లో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి కారణమయ్యాయి. వీటి పైన కేటీఆర్ స్పందించారు. 100 మీటర్ల లోపల పార్టీని బొందపెట్టే సంగతి తర్వాత చూద్దామని.. వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలపై దృష్టిపెట్టాలంటూ సూచించారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలు జనవరి కరెంట్ బిల్లులు చెల్లించవద్దంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.   దావోస్ పర్యటన ముగించుకొని లండన్ వెళ్లిన సీఎం రేవంత్ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు…

APCINEMA

త్వరలో ప్రజా సేవలోకి ప్రభాస్ – ఎన్నికల్లో పోటీ, కృష్ణంరాజు సతీమణి క్లారిటీ..!!..

కృష్ణంరాజు కుటుంబానికి ఎంపీ సీటు ఆఫర్ వచ్చింది. మూడు పార్టీల నుంచి కృష్ణంరాజు సతీమణిని ఎన్నికల బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో రాజకీయ ఎంట్రీ గురించి కృష్ణంరాజు సతీమణి శ్యామల క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ భవిష్యత్ కార్యక్రమాల గురించి తేల్చి చెప్పారు. గోదావరి జిల్లాల ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేసారు. ప్రభాస్ సైతం ప్రజాసేవలోకి వస్తున్నారని శ్యామల కీలక వ్యాఖ్యలు చేసారు.   రెబల్ స్టార్ స్వర్గీయ కృష్ణంరాజు జయంతి కావటంతో కుటుంబ…

AP

జగన్ ట్రాప్ లో చంద్రబాబు – ఎన్నికల వేళ సెల్ఫ్ గోల్..!! .

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ తన పార్టీ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసారు. టీడీపీ, జనసేన అభ్యర్దుల ఎంపిక పైన చర్చలు కొనసాగిస్తున్నాయి. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే సీఎం జగన్ కొత్త అస్త్రాలను ప్రత్యర్ధి పార్టీలను ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.   జగన్…

National

మంత్రముగ్ధం రాములోరి రూపం..అయోధ్యలో ప్రాణం పోసుకోనున్న విగ్రహం ఇదే

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో మూడు రోజులు మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆరంభమౌతుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులో రానుంది.   ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వేలాదిమంది ప్రముఖులు హాజరు కానున్నారు. వివిధ దేశాల నుంచి వందమంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు,…

TELANGANA

అయోధ్య రామయ్యకు సిరిసిల్ల నేతన్నలు నేసిన బంగారు చీర!!

దేశమంతా ఎప్పుడెప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ మహోత్సవం జరుగుతుందా? ఎప్పుడు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని కళ్ళారా చూస్తామా? అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మహోత్సవానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి రామయ్యకు కానుకలు తరలి వెళుతున్నాయి.   500కు పైగా ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాముడు తాను నడయాడిన పుణ్యభూమిలో కాలు పెడుతున్న సమయంలో రామయ్య పైన భక్తితో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి…

TELANGANA

లోక్ సభ ఎన్నికల్లో పోటీకి భయపడుతున్న బీఆర్ఎస్ సీనియర్లు.. .

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైన బీఆర్ఎస్ ఇప్పుడు త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల పైన ప్రధానంగా దృష్టి సారించింది. లోక్సభ ఎన్నికలలో సత్తా చాటాలని నిర్ణయించిన క్రమంలో నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు. అయితే లోక్సభ నియోజకవర్గాల సమీక్ష తో పాటు, నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.   చాలా జిల్లాలలో లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడానికి…

AP

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పై సుప్రీంలో తాజా అప్డేట్..!!..

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి. స్కిల్ కేసులో 53 రోజులు రిమాండ్ ఎదుర్కొన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీని పైన విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు.   సుప్రీంలో విచారణ చంద్రబాబుకు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో హైకోర్టు బెయిల్‌…

AP

వైసీపీ ఐదో జాబితా విడుదలకు కసరత్తు..

ఏపీలో వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఐదో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాల్ని విడుదల చేసిన వైసీపీ.. ఇప్పుడు ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల్ని పిలిపించి చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు.   ఇప్పటికే వైసీపీ ప్రకటించిన నాలుగు జాబితాల్లో…

National

అయోధ్య బాల రాముడు.. విగ్రహం ఫొటోలు విడుదల…

అయోధ్యలో ఈ నెల 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆలయంలో పూజలు, యాగాలు, క్రతువులు కొనసాగుతున్నాయి. బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు సమయం దగ్గరపడుతుండటంతో ఆ మహా ఘట్టానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పరిశీలిస్తోంది.   ఈ క్రమంలోనే మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరుకుంది. పూజలు, మంత్రాల మధ్య రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి…

TELANGANA

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు శరవేగంగా ఏర్పాట్లు!!

తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2024 ఫిబ్రవరిలో 21నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. ఈ క్రమంలో మేడారంలో అభివృద్ధి పనులపై తెలంగాణా సర్కార్ ఫోకస్ పెట్టింది. మేడారం అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ మేడారం వెళ్లి మేడారం జాతర పనులను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.   ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది,…