News

TELANGANA

తెలంగాణలో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు..

తాను రైతు బిడ్డనని.. వ్యవసాయం తమ సంస్కృతి అని ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోక్ యాక్షన్‌పై జరిగిన సీఈటీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడారు. సమాజానికి ఎంతో సాయం చేస్తున్నరైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. రైతులకు లాభాలు రావాలన్నది తన స్వప్నమని రేవంత్ పేర్కొన్నారు.   భారతదేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని.. రైతుల ఆత్మహత్యలు అతిపెద్ద సమస్యగా…

AP

ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు కేసులో సుప్రీంలో కీలక పరిణామం..!!

ఏపీలో ఎన్నికల వేళ కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసులో సుప్రీంలో విచారణకు కేసు లిస్టు అయింది. తెలంగాణ హైకోర్టు మే 31న ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ సునీత దాఖలు చేసిన పిటీషన్ ఫిబ్రవరి 5న విచారణకు రానుంది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తల ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు…

TELANGANA

వైసీపీ నాలుగో జాబితా విడుదల..

సుదీర్ఘ కసరత్తు అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితాను ప్రకటించింది. తొమ్మిది మంది పేర్లతో కూడిన నాలుగో జాబితాను గురువారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. రీజినల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇంఛార్జీలను ప్రకటించిన విషయం తెలిసిందే.   అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలు వీరే:   జీడీ…

NationalTELANGANA

అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి భారీ లడ్డు..

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న క్రమంలో దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. అన్ని రాష్ట్రాల్లోనూ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతన్నాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన అనుబంధం కొనసాగుతోంది. ఇప్పటికే రామ మందిరానికి తలుపులు, పాదుకలు ఇక్కడ్నుంచే అయోధ్యకు తరలివెళ్లాయి.   తాజాగా, అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి మరో కానుక అందనుంది. ప్రాణప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని అత్యంత భక్తి శ్రద్దలతో తయారు చేసిన భారీ…

AP

జనసేనకు మరో ఎంపీ అభ్యర్ధి…

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే ఓవైపు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీలో చేరికలు పెరుగుతుండగా.. ఇవాళ ఓ కీలక నేత ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన.. జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.   టీడీపీతో పొత్తులో భాగంగా దాదాపు 40…

AP

ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ మహాశిల్పం ఆవిష్కరణ..

విజయవాడలో అంబేద్కర్ మహా శిల్పం ఆవిష్కరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏపీ ప్రజలకు తన సందేశం ఇచ్చారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న, అంబేద్కర్ గారి మహా శిల్పం మన రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం అని కితాబిచ్చారు. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నారు. ఇది సామాజిక న్యాయ మహా శిల్పం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.   ఈ నెల 19న, చారిత్రక, స్వరాజ్య మైదానంలో…

TELANGANA

తెలంగాణలో అదానీ భారీ పెట్టుబడులు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సహా ఆయన బృందం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుపర్యటనలో బిజీబిజీగా కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. దిగ్గజ గ్రూప్ అదానీ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది.దావోస్పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy)తో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gowtham Adani) కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ సంస్థ రాష్ట్రంలో రూ.12,400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది.…

TELANGANA

గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం..

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో వివాదం తేలే వరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గత ప్రభుత్వం(బీఆర్ఎస్ సర్కారు) ప్రతిపాదించిన విషయం తెలిసిందే.   ఆ ఇద్దరికీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్ చేస్తూ వారిద్దరూ(దాసోజు శ్రవణ్,…

National

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో ఈ నెల 22న శ్రీరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. యోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.500 కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీకి బదులు రాముడి బొమ్మను ముద్రించినట్లుగా సోషల్ మీడియాలో ఓ నోట్ వైరల్ అవుతోంది. అయితే, నోట్‌పై ఎర్రకోట స్థానంలో అయోధ్య రామమందిరం, స్వచ్ఛ భారత్ లోగో ముద్రించినట్లు తెలుస్తోంది.

AP

ఏపీలో ఎన్నికల ఎఫెక్ట్.. 21 మంది అధికారుల బదిలీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలైంది. ఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగి ఏర్పాట్లు ప్రారంభించింది. తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జోన్-4 పలువురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. మొత్తం 21 మంది అధికారులను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.   ఈ మేరకు సంబంధిత కలెక్టర్లకు తహసీల్దార్లు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. కర్నూలు జిల్లా.. పత్తికొండ తహసీల్దార్‌గా పద్మజ, కోసగికి పీ మురళి, కౌతాళంకు అలెగ్జాండర్, అనంతపురం…