అమరావతి రెండో దశకు శ్రీకారం…!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రెండో దశ భూ సమీకరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడు గ్రామాల పరిధిలో 16,666 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇస్తూ మంత్రివర్గం తీర్మానించింది. ప్రభుత్వ భూమితో కలిపి మొత్తంగా 20 వేల…

