News

TELANGANA

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: వ్యయం తగ్గించే ప్రణాళిక

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల శ్రవంతి ప్రాజెక్టు (Pranahita-Chevella Project)ను సాంకేతికంగా, ఆర్థికంగా పునరుద్ధరించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో, సమర్థవంతంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, దీనికి సంబంధించి ‘సుండిళ్ల లింక్’ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసింది. నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకారం, ఈ సవరించిన ప్రణాళికను…

World

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం ఆశలతో లాభాల బాట పట్టిన భారత స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చనే అంచనాలు దేశీయ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దీనికి తోడు, అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదు కావడంతో, 2025లో వడ్డీ రేట్లను మరో రెండు సార్లు తగ్గించవచ్చనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌కు మరింత బలాన్నిచ్చాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 566.96 పాయింట్లు లాభపడి 84,778.84…

SPORTS

మొదటి పరుగు తీయగానే విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్: అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు!

భారత క్రికెట్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం (దాదాపు 7 నెలలు) తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో రీ-ఎంట్రీ ఇచ్చి, ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు వన్డే మ్యాచ్‌లలో వరుసగా డకౌట్లు అయ్యాడు. ఇది కోహ్లీ వన్డే కెరీర్‌లో వరుసగా రెండు డకౌట్లు అవడం ఇదే తొలిసారి. దీంతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ కాకూడదని అభిమానులు ఆశించారు. అభిమానుల ఆకాంక్షకు తగ్గట్టుగానే కోహ్లీ మూడో వన్డేలో తన పరుగుల…

National

ఎన్‌హెచ్‌ఏఐ కీలక ఆదేశాలు: టోల్‌ప్లాజాల వద్ద నెలవారీ, వార్షిక పాస్ వివరాలు తప్పనిసరి

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న తన టోల్‌ప్లాజాల వద్ద పారదర్శకతను పెంచేందుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టోల్‌ప్లాజాల పరిధిలోని స్థానిక నెలవారీ పాస్‌ మరియు వార్షిక పాస్‌ సౌకర్యాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని స్పష్టంగా ప్రదర్శించాలని ఫీల్డ్ కార్యాలయాలను ఆదేశించింది. ఈ సమాచారాన్ని టోల్‌ప్లాజా ఎంట్రీ, ఎగ్జిట్ మరియు కస్టమర్ సర్వీస్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బోర్డులపై ఇంగ్లీష్, హిందీ, మరియు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలి. 30 రోజుల్లోగా ఈ…

TELANGANA

చాదర్‌ఘాట్‌లో కాల్పుల కలకలం: చైన్ స్నాచర్‌పై డీసీపీ ఫైరింగ్

హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పరిధిలో తాజాగా కాల్పుల ఘటన ప్రజలను షాక్‌కు గురి చేసింది. సీపీ కార్యాలయంలో మీటింగ్‌కు వెళ్లి వస్తుండగా, సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య ఇద్దరు చైన్ స్నాచర్లను గమనించి, తన గన్ మెన్‌తో కలిసి వారిని వెంబడించారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ఒక చైన్ స్నాచర్ కత్తితో డీసీపీపై దాడికి యత్నించగా, డీసీపీ కిందపడిపోయారు. వెంటనే తేరుకున్న డీసీపీ అప్రమత్తమై, చైన్ స్నాచర్‌పై తన గన్‌తో…

CINEMA

‘నాకు రష్మిక లాంటి కూతురు ఉంటే బాగుండు’: ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ ట్రైలర్ లాంచ్‌లో అల్లు అరవింద్ ప్రశంసలు

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని రష్మికపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ముగ్గురు కుమారులు (వెంకటేష్, అల్లు అర్జున్, శిరీష్) ఉన్నారని గుర్తుచేస్తూ, “నాకు రష్మిక లాంటి కూతురు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది” అని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర కథలో మహిళా పాత్రను మోయగలిగే…

AP

కర్నూలు బస్సు ప్రమాద తీవ్రత పెంచడంలో మొబైల్ ఫోన్ల పాత్ర

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందాలు చేసిన ప్రాథమిక విచారణలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోవడానికి, మంటల తీవ్రత ఇంతగా పెరగడానికి బస్సులోని లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందలాది మొబైల్ ఫోన్లు పేలడమే ప్రధాన కారణంగా ఫోరెన్సిక్ బృందాలు అనుమానిస్తున్నాయి. బస్సు ముందుగా బైక్‌ను ఢీకొట్టి లాక్కెళ్లడంతో పెట్రోల్ కారి మంటలు మొదలయ్యాయి. ఈ మంటలు…

AP

కర్నూలు బస్సు ప్రమాదం: 19 మృతదేహాలు వెలికితీత.. స్విచ్చాఫ్ అయిన 19 మంది ఫోన్లు

కర్నూలు జిల్లా, చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు తెల్లవారుజామున 3 గంటల సమయంలో బైక్‌ను ఢీకొట్టడంతో, పెట్రోల్ లీకై మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. తాజాగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు.. ప్రమాదంలో దగ్ధమైన బస్సులోంచి 19 మృతదేహాలను బయటకు తీశాయి. ఈ ప్రమాదంలో…

AP

ఏపీలో ‘హైడ్రా’ తరహా కార్యాచరణ: డిప్యూటీ సీఎం పవన్‌తో రంగనాథ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ ‘హైడ్రా’ (Hydra) కమిషనర్ ఎ.వి. రంగనాథ్ కలిశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీ దాదాపుగా రెండు గంటల పాటు జరిగింది. ఈ సమావేశం మర్యాదపూర్వకమేనని జనసేన వర్గాలు చెబుతున్నప్పటికీ, పలు పరిపాలనా, సామాజిక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో అనధికార నిర్మాణాలు, ప్రభుత్వ భూముల కబ్జాపై ‘హైడ్రా’ వ్యవస్థ కఠిన చర్యలు తీసుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాంటి…

TELANGANA

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు: ఇక రసవత్తర పోరు!

తెలంగాణలోని జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తయిన తర్వాత, చివరికి 58 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండటం ఇదే మొదటిసారి. ఈ ఉపఎన్నికలో నాలుగు లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేయగా, పరిశీలన అనంతరం 58 మందికి తుది ఆమోదం లభించింది. ఈ ఉపఎన్నికలో పోటీ…