News

TELANGANA

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లతో పాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న విద్యా పథకాలకు కేంద్ర సహకారం కోరుతూ ఆయన రెండు కీలక ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందుంచారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.   గత ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో విచక్షణారహితంగా అధిక వడ్డీలకు చేసిన అప్పులు రాష్ట్ర…

TELANGANA

తెలంగాణ గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు .

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షపై సంచలన తీర్పు వెల్లడించింది హైకోర్టు. అభ్యర్థుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, గ్రూప్-1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేసింది. మెయిన్స్ పేపర్లు రీ వాల్యూయేషన్ చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో మెయిన్స్ పరీక్షను మరోసారి నిర్వహించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది కోర్టు.   తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ మూల్యాంకనం, ర్యాంకింగ్‌ లిస్ట్‌పై మంగళవారం హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా వెల్లడించిన జనరల్‌ ర్యాంకింగ్‌…

AP

ప్రజలకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్..! ఇక నుండి ఇంటి వద్దకే ఆ సేవలు..!

ప్రజలకు శుభవార్త చెప్పనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన చంద్రబాబు సర్కార్, కొత్త ప్లాన్ చేస్తోంది. ఇకపై కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అక్టోబరు 2 నుంచి ఇంటికే వారి కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలను నేరుగా ఇంటికి పంపేందుకు చర్యలు చేపట్టింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.   విద్యార్థులు పాఠశాల మారాలన్నా.. స్కాలర్ షిప్‌లకు…

AP

ప్ర‌భుత్వ ఆఫీసుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటో వ‌ద్దు.. హైకోర్టులో పిల్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను ప్రదర్శించడం వివాదంగా మారింది. ఈ అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. చట్టపరమైన అనుమతులు లేకుండా డిప్యూటీ సీఎం చిత్రాన్ని కార్యాలయాల్లో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తూ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.   వివరాల్లోకి వెళితే.. వై. కొండలరావు అనే విశ్రాంత రైల్వే ఉద్యోగి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫొటోను పెట్టేందుకు…

Uncategorized

నేడు ఉప రాష్ట్రపతి ఎన్నిక..! సర్వత్రా ఉత్కంఠ. !

ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. సాయంత్ర 6 గంటలకు ఓట్లను లెక్కించి, ఫలితాలు వెల్లడించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. అధికార NDA అభ్యుర్థికి సంఖ్యాపరంగా మెరుగైన మెజారిటీ ఉండటంతో.. NDA అభ్యర్థి గెలుపు లాంచప్రాయమేననే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఉప రాష్ట్రపతి ఎన్నికలో రహస్య ఓటింగ్‌ విధానాన్ని అనుసరిస్తారు. మరోవైపు పార్టీలకు అతీతంగా ఎంపీలు ఓటు వినియోగించుకోవాలని విపక్ష…

TELANGANA

కవిత సస్పెన్షన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తన సోదరి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో కవిత సస్పెన్షన్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కవిత సస్పెన్షన్‌పై ఆయన మొదటిసారిగా స్పందించారు.   “కవితపై మా పార్టీ చర్చించి చర్యలు తీసుకుంది. చర్యలు తీసుకున్న తర్వాత ఇక నేను మాట్లాడటానికి ఏమీ లేదు” అని ఆయన స్పష్టం చేశారు. కవితపై వేటు అనేది పార్టీ…

TELANGANA

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం..! ఎందుకంటే..?

గణపతి హోమం బీఆర్ఎస్ పార్టీకి సానుకూల ఫలితాలు ఇస్తున్నా యా? ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిందా? ఎన్డీయే-ఇండియా కూటములు తెలంగాణకు ద్రోహం చేశాయని బీఆర్‌ఎస్ నమ్ముతోందా? తెలంగాణ వ్యక్తి ఆ పదవి నిలబడినా, రాజకీయ కారణాలతో దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిందా? మధ్యాహ్నం ఆ పార్టీ నుంచి ప్రకటన రానుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   బీఆర్ఎస్‌కు మంచి ఛాన్స్ మిస్సయినట్టు కనిపిస్తోంది. తెలంగాణకు చెందిన వ్యక్తి ఉప రాష్ట్రపతి పదవికి…

AP

ఎరువులు అక్రమంగా నిల్వచేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయండి: మంత్రి నాదెండ్ల..

రాష్ట్రంలో ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తూ, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి అక్రమార్కులపై సాధారణ 6ఏ కేసులు కాకుండా, నేరుగా పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్) కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్‌చార్జి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో…

AP

4 కార్పొరేషన్లకు 51 మంది డైరెక్టర్లను నియమించిన ఏపీ సర్కారు..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతల పదవుల పందేరం కొనసాగుతోంది. ఇటీవల 11 కార్పొరేషన్లకు సంబంధించి 120 మంది డైరెక్టర్లను, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించిన ప్రభుత్వం, తాజాగా మరో నాలుగు కార్పొరేషన్లకు 51 మంది డైరెక్టర్లను నియమించింది.   ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు 16 మంది, వెనకబడిన తరగతుల సహకార సంఘానికి ఐదుగురు, కమ్మ కార్పొరేషన్‌కు 15 మంది, రాష్ట్ర నూర్ బాషా దూదేకుల కార్పొరేషన్‌కు 15 మంది డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

AP

తిరుపతి-షిర్డీ రైలుపై సీఎం చంద్రబాబు ప్రతిపాదన..! కేంద్రం ఆమోదం..

తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ వరకు తాత్కాలిక ప్రాతిపదికన నడుస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 07637/07638)కు రైల్వే శాఖ శాశ్వత హోదా కల్పించింది. ఈ మేరకు రైలును క్రమబద్ధీకరించి రెగ్యులర్ రైలుగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు.   ఈ నిర్ణయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 2న రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ పంపారు.  …