ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఏసీబీ వల.. లంచం తీసుకుంటుండగా ఇద్దరి అరెస్ట్..!
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. తాజాగా, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం కలకలం రేపింది. కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బిల్లుల మంజూరు కోసం వారు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆదిలాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న బట్టల రాజ్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్న కొండ్ర…