News

CINEMA

వేతన పెంపుపై చర్చలు ఫలించకపోతే షూటింగ్ లు బంద్: కార్మిక సంఘాలు..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న వేతనాల పెంపు వివాదంపై చర్చలు కొనసాగుతున్నాయి. నిర్మాతల మండలికి, కార్మిక సంఘాలపై ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో తాజాగా ఈ రోజు మరోసారి సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. వేతన పెంపు విషయంలో నిర్మాతలు చేసిన మూడేళ్ల ప్రతిపాదనకు అంగీకరించబోమని స్పష్టంచేశారు. వేతనాలను 30 శాతం పెంచాలన్న డిమాండ్ పై ఈ రోజు జరగనున్న చర్చలు ఫలవంతం కావాలని…

TELANGANA

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు..

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బాలరాజుకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గువ్వలతో పాటు ఆయన అనుచరులు, నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా బీజేపీ సభ్యత్వం స్వీకరించారు.   కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి గువ్వల బాలరాజు ఏ పార్టీలో…

TELANGANA

రిటైర్మెంట్ పై మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..!

తన రాజకీయ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక్క ప్రకటనతో తెరదించారు. రాజకీయాల నుంచి తాను తప్పుకోవడం లేదని, చివరి వరకు క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. “జపాన్‌లో ప్రజలకు ఏ విధంగా అయితే రిటైర్మెంట్ ఉండదో, నాకు కూడా రాజకీయాల్లో రిటైర్మెంట్ లేదు” అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.   తనకు ఇప్పుడు 73 ఏళ్లని, ఇంక రాజకీయమే వద్దనుకుంటున్నానని మల్లారెడ్డి నిన్న వ్యాఖ్యానించాడం చర్చనీయాంశంగా…

National

అమెరికాను ఇరకాటంలో పెట్టిన పుతిన్..!

అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన శైలితో ప్రత్యర్థులకు చుక్కలు చూపే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తాజాగా అమెరికాను ఇరుకునపెట్టేలా సంచలన ఎత్తుగడ వేశారు. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ డిప్యూటీ డైరెక్టర్‌నే లక్ష్యంగా చేసుకుని ఆయన ఆడిన మైండ్‌గేమ్‌తో వాషింగ్టన్ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రత్యేక దూతగా క్రెమ్లిన్‌కు వచ్చిన స్టీవ్ విట్కాఫ్‌తో సమావేశమైన పుతిన్, ఓ అనూహ్య బహుమతిని ఆయన చేతికి అందించి కలకలం రేపారు.   అమెరికా…

AP

వీటిని ఎన్నికలు అనడానికే సిగ్గుగా ఉంది: జడ్పీటీసీ ఉప ఎన్నికలపై జగన్ స్పందన..

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విరుద్ధంగా, అరాచకంగా వ్యవహరిస్తున్నారని, కుట్రలు, దాడులు, అబద్ధాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ఎన్నికలను హైజాక్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ గూండాలు, కొందరు అధికారులు, పోలీసులు కలిసి ఈ కుట్రను అమలు చేస్తున్నారని విమర్శించారు.   చంద్రబాబు కుట్రపూరిత ప్రణాళికలను అమలు చేస్తున్నారని మండపడ్డారు. “ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే…

TELANGANA

పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం..! వీడియో వైరల్..

పులివెందులలో జరగనున్న జడ్పీటీసీ ఉపఎన్నికల వేడి మామూలుగా లేదు. జరగుతున్నది జడ్పీటీసీ ఉప ఎన్నికే అయినా, అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నంత తీవ్ర వాతావరణణం నెలకొంది. ప్రచార పర్వంలో టీడీపీ శ్రేణులు వినూత్నంగా ముందుకుపోతున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఖైదీల వేషాలు ధరించి, డప్పులు వాయిస్తూ వీధుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.   ఈ నెల 12వ తేదీన జరగనున్న జడ్పీటీసీ స్థానానికి సంబంధించిన ఉపఎన్నికల పోలింగ్ కోసం ఈ ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా, “బాబాయిని చంపిన అబ్బాయి…

TELANGANA

చిన్న పట్టణాలకూ ఐటీ… కేసీఆర్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న కేటీఆర్..!

చిన్న పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించే విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన కృషిని కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.   ఆదివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ, “కేసీఆర్ ప్రభుత్వ హయాంలో టైర్-2 నగరాలకు ఐటీని తీసుకెళ్లడం మా ప్రాధాన్యతగా ఉండేది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తుందని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో…

TELANGANA

హైదరాబాదులో నీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి..

భాగ్యనగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీనికి తోడు వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి, హైదరాబాద్‌లోని నీటి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.   హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అమీర్‌పేట్‌లోని గంగుబాయి బస్తీ, బుద్ధ నగర్‌తో పాటు పలు లోతట్టు ప్రాంతాలను…

National

అమెరికా శాటిలైట్‌తో ఇస్రో సరికొత్త చరిత్ర..

ఒకప్పుడు చిన్న రాకెట్ కోసం అగ్రరాజ్యం అమెరికా వైపు చూసిన భారత్, ఇప్పుడు అదే అమెరికాకు చెందిన భారీ ఉపగ్రహాన్ని తన సొంత గడ్డపై నుంచి నింగిలోకి పంపే స్థాయికి ఎదిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) త్వరలో ఈ చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇటీవల నాసా-ఇస్రో సంయుక్త ‘నైసర్’ మిషన్‌ను విజయవంతం చేసిన ఉత్సాహంతో, మరో కీలక ఘట్టానికి నాంది పలుకుతోంది.   చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్…

National

ట్రంప్‌పై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడిన రాజ్‌నాథ్ సింగ్..

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భారత వస్తువులపై 25 శాతం సుంకం విధించిన నేపథ్యంలో, కొన్ని దేశాలు భారత ఆర్థిక పురోగతిని అసూయతో చూస్తూ, దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. “కొందరు ‘బాస్’లు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న వేగాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మనమే అందరికీ బాస్ అయితే, భారత్ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోందని వారు అనుకుంటున్నారు?” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.…