News

National

అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారు: మంత్రి సీతక్క..

తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌పై బురద చల్లుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. రైతుల సమస్యల విషయంలో కేంద్రం బాధ్యతను పక్కనపెట్టి, రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని ఆమె హితవు పలికారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో పర్యటించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.   యూరియా సరఫరా అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు.…

AP

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఆర్‌ఐ, సర్వేయర్..

వనపర్తి జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.   వివరాల్లోకి వెళితే, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) సి. వాసు, మండల సర్వేయర్ నవీన్ రెడ్డి ఓ వ్యక్తి నుంచి రూ.40,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి తన బంధువులకు చెందిన భూమికి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ జారీ చేయాలని…

TELANGANA

కేటీఆర్ ఒక చవట.. మేడిపల్లి సత్యం తీవ్ర వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత చెల్లెలు కవిత మాటలకే జవాబు చెప్పలేని కేటీఆర్ ఒక ‘చవట దద్దమ్మ’ అంటూ ఘాటుగా విమర్శించారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ రాష్ట్రానికి పట్టిన శని అని, ఆయన నోటి నుంచి అపశకునం మాటలు తప్ప మంచి రాదని అన్నారు.   ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కేటీఆర్ చూస్తున్నారని మేడిపల్లి సత్యం…

CINEMA

ఓటీటీలోకి ‘మహావతార్ నరసింహ’ సినిమా..! ఎప్పుడంటే..?

‘మహావతార్ నరసింహ’ చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా తెలుగుతో పాటు పలు భాషల్లో ‘నెట్ ఫ్లిక్స్’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 12:30 గంటలకు సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటన వెలువడింది.   శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని దాదాపు రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మించారు. విడుదలైన…

AP

ప్రతిపక్ష హోదా అడుగుతున్న పార్టీ సంస్కరణలను స్వాగతించలేని దుస్థితిలో ఉంది: సీఎం చంద్రబాబు..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో తరం జీఎస్టీ (జీఎస్టీ 2.0) సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంస్కరణలను స్వాగతిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో, దేశంలోనే జీఎస్టీ 2.0ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తాయని, పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువస్తాయని ముఖ్యమంత్రి…

AP

ఇండోసోల్ కంపెనీ కోసం బలవంతంగా భూములు లాక్కోవడం లేదు: మంత్రి అనగాని..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కరేడు వద్ద ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటు కోసం రైతుల నుంచి భూములను బలవంతంగా సేకరిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 20 లక్షల పరిహారాన్ని ప్రకటించడంతో, రైతులు పూర్తి స్వచ్ఛందంగానే తమ భూములను పరిశ్రమకు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు.   శాసనమండలిలో వైసీపీ సభ్యుడు తూమాటి మాధవరావు అడిగిన ప్రశ్నకు మంత్రి…

AP

హాయ్‌ల్యాండ్‌లో ఏం జరిగింది? ఏపీపీఎస్సీని నిలదీసిన హైకోర్టు..

గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో అసలు హాయ్‌ల్యాండ్‌లో ఏం జరిగిందో బయటపెట్టకుండా నిజాలు దాస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ మూల్యాంకనం చేయనప్పుడు, 65 రోజుల పాటు ఏం చేశారని కమిషన్‌ను సూటిగా ప్రశ్నించింది. వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ఏపీపీఎస్సీ ఆడుకుంటోందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.   గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని గతంలో సింగిల్ జడ్జి…

TELANGANA

జీఎస్టీ కమిటీని నియమించిన తెలంగాణ బీజేపీ..

బీజేపీ రాష్ట్ర స్థాయిలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ పై తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణలు, సవరణలను ప్రజలకు మరింత స్పష్టంగా తెలియజేసేందుకు.. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రధానంగా ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాపార వర్గాలకు సమాచారం అందించడం, కేంద్ర విధానాలను సమర్థవంతంగా ప్రోత్సహించడం లక్ష్యంగా ముందుకు సాగనుంది. కమిటీలో ప్రముఖులు బీజేపీ రాష్ట్ర కమిటీలో ప్రాముఖ్యత కలిగిన నేతలను చేర్చింది. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి,…

TELANGANA

విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం..

తెలంగాణలో SPDCL, NPDCL‌తోపాటు మరో డిస్కం ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో.. ప్రాథమిక ప్రణాళికను ఇంధన శాఖ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు. వ్యవసాయం, మేజర్-మైనర్ లిప్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్‌ఎంసీ నీటి సరాఫరాలను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.   ప్రతిపాదనల నేపథ్యంలో ప్రణాళిక సిద్ధం…

National

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు మసూద్ అజహర్ కుటుంబం ముక్కలైంది: జైషే మహమ్మద్ వీడియో వైరల్..

పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు భారత్ చేతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయాన్ని ఆ సంస్థ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో జరిపిన వైమానిక దాడిలో తమ అధినేత మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు మరణించినట్లు ధృవీకరించింది. ఈ మేరకు జైష్ అగ్ర కమాండర్లలో ఒకరైన మసూద్ ఇలియాస్ కశ్మీరీ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.  …