News

AP

కదిరి బస్టాండ్‌లో ‘లేడీ గ్యాంగ్’ అరెస్ట్: ముగ్గురు మహిళా దొంగల నుంచి ₹6.40 లక్షల సొత్తు స్వాధీనం

కదిరి టౌన్ పోలీసు స్టేషన్… కదిరి APSRTC బస్ స్టాండ్ వద్ద దొంగతనాలు చేసిన ముగ్గురు మహిళా దొంగలు అరెస్టు, వారి వద్ద నుండి సుమారు  సుమారు 5,65,000/- విలువగల బంగారు ఆభరణాలు మరియు 75,000/- నగదు స్వాధీనము… కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని APSRTC బస్ స్టాండ్ వద్ద గత 5 నెలల కాలములో   వరుసగా జరుగుతున్న పర్సు మరియు బంగారు ఆభరణాల దొంగతనాలపై కదిరి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కదిరి DSP,…

AP

విగ్రహాలను ద్వంశం చేసిన కేసులో ముద్దాయి అరెస్టు…

కదిరి టౌన్, కుమ్మరోల్ల పల్లి గ్రామము పురాతన శ్రీరాములు గుడి వద్ద సిమెంట్ తో తయారు చేయబడిన హనుమంతుడు, మరియు గరుత్మంతుడు స్వామి వారి విగ్రహాలను ద్వంశం చేసిన వ్యక్తి అయిన కుంచపు వెంకటేష్, వయస్సు: 34 సంవత్సరాలు, తండ్రి: అంజినేయులు, మూర్తి పల్లి గ్రామము కదిరి అను వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది. విచారణ చేయగా సదరు కుంచపు వెంకటేష్ గతములో సదరు గుడి గోపురము, మరియు రామాలయము ఆర్చ్ లను కట్టుటకు గుడి ధర్మకర్తలు…

National

అస్సాంలో కూలిన యుద్ధ విమానం.. భారీ పేలుడు శబ్దం, స్థానికులు బెంబేలు..

అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లా పరిధిలోని మారుమూల కొండ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం కూలింది. జోర్హాట్ ఎయిర్‌ బేస్ నుండి బయలు దేరిన కొద్దిసేపటికే యుద్ధ విమానం రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. చొకిహోలా పరిధిలోని కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందులోవున్న ఇద్దరు పైలట్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.   గురువారం సాయంత్రం అసొంలోని జోర్హాట్‌లోని వైమానిక బేస్ నుండి బయలు దేరింది సుఖోయ్-30…

TELANGANA

తెలంగాణలో భూసేకరణకు ప్రభుత్వం 5000 కోట్లు విడుదల..

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల నిధులు విడుదల చేయనున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జూన్ 2 వరకు భూసేకరణ పూర్తి చేయాలని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనర్సింహలతో కలిసి సచివాలయంలో నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో ఉన్నత స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు.   సింగూర్…

TELANGANA

మూసీ పేరిట విధ్వంసం..! ప్రభుత్వానికి కేటీఆర్ వార్నింగ్..

కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరిట హైదరాబాద్ లో సృష్టిస్తున్న విధ్వంసాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది ‘మూసీ బ్యూటిఫికేషన్’ కాదని.. అది ‘లూటిఫికేషన్’ అని దుయ్యబట్టారు. నాగోల్ లో ఉన్న ఎస్టీపీని గురువారం పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. తర్వాత నాగోల్ బ్రిడ్జి వద్ద గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన మూసి మోడల్ ని పరిశీలించి అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడారు. రూ.16 వేల కోట్లతో…

AP

మార్ఫింగ్ వైసీపీ పేటెంట్ హక్కు.. పాలు, వెన్న లేకుండా నెయ్యి చేసిన ఘనులు -ధూళిపాళ్ల నరేంద్ర కుమార్..

వైష్ణవి పక్కన సంగం డెయిరీ ఎంబ్లమ్ ఎలా వచ్చిందో వైసీపీతో చేతులు కలిపిన మాజీ ఛైర్మన్ ను అడగాలని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. బందరు బియ్యం దొంగ నీతులు, చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం అని మాజీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి విమర్శలు చేశారు.   మార్ఫింగ్ వైసీపీ పేటెంట్ “వెబ్‌సైట్లు డౌన్ చేయటం, మార్ఫింగ్ చేయటం వైసీపీ పేటెంట్ హక్కులు. 33 రోజులు నన్ను జైల్లో పెట్టి…

AP

ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలు కలకలం.. చంపేందుకు ప్లాన్..!

టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారంటూ బాంబు పేల్చారు. ఆయన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కలకలం రేపాయి. ఇంతకీ కొలికపూడి వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు? ఇదే చర్చ టీడీపీలో జోరుగా నడుస్తోంది.   టీడీపీలో ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలు కలకలం   తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురువారం రాత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా…

NationalTechnology

ఆ వీడియోలు పోస్ట్ చేస్తే 90 రోజుల సస్పెన్షన్.. ‘ఎక్స్’ కొత్త నిబంధన..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) తమ కంటెంట్ క్రియేటర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో సృష్టించిన యుద్ధ సంబంధిత వీడియోలను పోస్ట్ చేసేటప్పుడు, ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అలాంటి క్రియేటర్లను రెవెన్యూ-షేరింగ్ ప్రోగ్రామ్ నుంచి 90 రోజుల పాటు సస్పెండ్ చేయనున్నట్లు ప్రకటించింది.   ఈ కొత్త నిబంధనలను ఎక్స్ ప్రొడక్ట్ హెడ్ నికితా బేర్ వెల్లడించారు. యుద్ధ సమయాల్లో తప్పుడు…

TELANGANA

డిజిటల్ జనగణనకు తెలంగాణ సిద్ధం.. మే 11 నుంచి తొలి దశ..

దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ జనాభా గణన (జనగణన) ప్రక్రియలో భాగంగా తెలంగాణలో తొలి దశ పనులను పకడ్బందీగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు, ఇతర కట్టడాల వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కీలక…

AP

26 రకాల వివరాలతో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు: సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చేలా రూపొందిస్తున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (ఎఫ్ బీఎంఎస్)పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అసెంబ్లీలోని తన చాంబర్‌లో అధికారులతో ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ ఐడీ, ఆధార్, రైస్ కార్డ్, మొబైల్ నెంబర్, విద్యార్హతలు, వృత్తి, చిరునామా, వ్యవసాయ భూమి, ఇతర ఆస్తుల వివరాలు వంటి మొత్తం 26 రకాల అంశాలతో పకడ్బందీగా డేటాబేస్ రూపొందించాలని…