News

AP

ఏపీఎస్‌ఆర్టీసీలో సమ్మెకు తెర..!

ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 2,700 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో దూర ప్రాంత సర్వీసులు కాకుండా… స్త్రీశక్తి పథకం అమలవుతున్న పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు 2,419 ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిందని, దీనివల్ల డిజిల్‌ ఎక్కువగా వినియోగించాల్సి వస్తోందని, టైర్ల అరుగుదల ఎక్కువగా ఉందని, బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల యజమానులు…

AP

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సంచలనం..!

భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో పెద్ద దుమారమే రేపింది.. అయితే, తిరుమల లడ్డూ-నెయ్యి కల్తీ కేసులో మరో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. మొదటిసారి నెయ్యి కల్తీ చేసిన సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించినందుకు టీటీడీ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి లంచం స్వీకరించినట్లు సిట్ విచారణలో స్వయంగా అంగీకరించారట.. ఇక, ఈ కేసులో A34 కేసు నిందితుడుగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి, ముందస్తు బెయిల్ పొందేందుకు నెల్లూరు ఏసీబీ కోర్టులో…

CINEMA

సెన్సార్ బోర్డుకు కాలం చెల్లింది: రామ్ గోపాల్ వర్మ..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డుపై, దాని పనితీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సెన్సార్ బోర్డు అనేది కాలం చెల్లిన వ్యవస్థ అని, దాని ఉనికి ఒక పెద్ద జోక్ అని ఆయన అభిప్రాయపడ్డారు. నటుడు విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ సినిమా సెన్సార్ వివాదం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.   “ఈ రోజుల్లో సెన్సార్ బోర్డుకు ఇంకా ప్రాముఖ్యత ఉందని భావించడం అవివేకం. దాని అవసరం ఎప్పుడో…

TELANGANA

రైతులకు సంక్రాంతికి మరో తీపికబురు చెప్పిన రేవంత్ సర్కార్..

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి ముందు రైతులకు మరోమారు శుభవార్త చెప్పింది. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అఫిడవిట్ దాఖలు చేసే నిబంధనను తొలగించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే భూ సమస్యల పరిష్కారం మరింత త్వరితగతిన జరుగుతుందని దీని కారణంగా వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.   సాదా బైనామా సమస్యల పరిష్కారానికి జీవో మరో రెండు…

TELANGANA

కరీంనగర్ కు కేంద్రం గుడ్ న్యూస్..! ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

కరీంనగర్ జిల్లాకు కేంద్రమంత్రి బండి సంజయ్ తీపికబురు చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం, కరీంనగర్ జిల్లాలో ‘ఆయుష్’ ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 50 పడకల సామర్థ్యంతో కరీంనగర్ జిల్లాలో ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేస్తూ కేంద్రం పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది.   ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఈ ఆసుపత్రి ఏర్పాటుకు మొత్తం రూ.15 కోట్ల…

AP

కదిరి బాలికల కళాశాలలో నూతన భవనాలు, ల్యాబ్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం నిర్మించిన నూతన పాఠశాల భవనం, అత్యాధునిక సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ గదులు మరియు అదనపు తరగతి గదులను కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఈ సౌకర్యాలను విద్యార్థినులకు అంకితం చేసిన ఆయన, విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో…

AP

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో రహదారి భద్రత మాసోత్సవాలు- 2026 ఘనంగా నిర్వహించారు. ఈరోజు రహదారి భద్రత మాసోత్సవాలు – 2026 భాగంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో రహదారి భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించడమైనది. ఈ మాసోత్సవాలు లో భాగంగా రవాణా శాఖ అధికారులు RTO జే. శ్రీనివాసులు గారు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డిఎస్ఎమ్ వరప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు.ఆర్టివో జే .శ్రీనివాసులు గారు మాట్లాడుతూ విద్యార్థులు కు…

AP

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు: ‘బాల్య వివాహం నేరం – చట్టం పట్ల అవగాహన అవసరం’

ప్రభుత్వ పాలిటెక్నిక్ కదిరి లో బాల్య వివాహాలను అరికట్టకడం పైన అవగాహన సదస్సు స్ధానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో ఈ రోజు బాల్య వివాహలను అరికట్టడం పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో సమత సొసైటీ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అధ్వర్యంలో లో భాగంగా కోఆర్డినేటర్ పి.శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలు వాటి నివారణ మార్గాలు గురించి విద్యార్థులుకు తెలియచేశారు. అమ్మాయిలు 18సం…

AP

కదిరి సంచలనం: పోలీస్ స్టేషన్ ముందే హత్య చేసిన నిందితులకు నడిరోడ్డుపై ‘బేడీలు’.. రిమాండ్‌కు తరలింపు

శ్రీ సత్యసాయి జిల్లా… కదిరి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట హత్య కేసుపై పోలీసుల సీరియస్ యాక్షన్ హత్య కేసులో ప్రధాన నిందితులు హరి, చిన్నప్ప , గంగులప్ప, శంకర్ లను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు నిన్న నిందితులను అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించిన పోలీసులు ఇవాళ కదిరి ఆర్ అండ్ బి బంగ్లా నుంచి సబ్ జైలు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లిన కదిరి పోలీసులు అంతకు ముందు నిందితుల వద్ద…

CINEMA

ది రాజాసాబ్: ప్రభాస్ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ, చిత్ర యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేపు (జనవరి 8) సాయంత్రం నుంచి పడనున్న ప్రీమియర్ షోలతో పాటు, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది. మారుతి దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హారర్ ఫాంటసీ కామెడీ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీమియర్…