కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది: స్పీకర్ తీర్పుపై కేటీఆర్ నిప్పులు.. ఉప ఎన్నికల భయంతోనే ఇదంతా!
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం మరియు అత్యున్నత న్యాయస్థానాల పట్ల గౌరవం లేదని ఈ తీర్పుతో మరోసారి స్పష్టమైందని, రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరిగితే సరిపోదని ఆయన ఎద్దేవా చేశారు. తన తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన…

