News

National

బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి షురూ..!

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్‌కాన్, భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన సరికొత్త ఐఫోన్ 17 ఉత్పత్తిని బెంగళూరులోని తన ప్లాంట్‌లో ప్రారంభించినట్లు అధికారిక‌ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చెన్నైలోని యూనిట్‌లో ఐఫోన్ల తయారీ జరుగుతుండగా, ఇప్పుడు బెంగళూరులోనూ ఈ ప్రక్రియ మొదలుకావడం ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రణాళికలకు పెద్ద ఊపునిచ్చినట్లయింది.   చైనా వెలుపల ఫాక్స్‌కాన్‌కు ఇది రెండో అతిపెద్ద తయారీ కేంద్రం కావడం గమనార్హం.…

TELANGANA

హైద‌రాబాద్‌లో శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో తీవ్ర విషాదం..! క‌రెంట్ షాక్ తో ఐదుగురు మృతి..

హైద‌రాబాద్‌లో శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు ర‌థానికి విద్యుత్ తీగ‌లు త‌గ‌ల‌డంతో క‌రెంట్ షాక్ కార‌ణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్ధరాత్రి రామంతాపూర్‌లోని గోకులేన‌గ‌ర్‌లో ఈ విషాద ఘ‌ట‌న జ‌రిగింది. శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో భాగంగా నిన్న రాత్రి స్థానికంగా ర‌థాన్ని ఊరేగించారు. అయితే, ర‌థాన్ని లాగుతున్న వాహ‌నం చెడిపోవ‌డంతో దాన్ని ప‌క్క‌కు నిలిపివేసిన యువ‌కులు.. ర‌థాన్ని చేతుల‌తో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్ర‌మంలో ర‌థానికి విద్యుత్ తీగ‌లు త‌గిలాయి. దాంతో ర‌థాన్ని లాగుతున్న…

National

ఎన్డీఏ ఉపరాష్ట్రపతిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్..

ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఎన్డీఏ ఖరారు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయబోతున్నట్టు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ప్రకటించారు. తమిళనాడులో జన్మించిన రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ గా కూడా పని చేసిన విషయం తెలిసిందే.   సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. రెండు సార్లు కోయంబత్తూరు ఎంపీగా పని చేసిన అనుభవం కూడా ఉంది. గతంలో జార్ఖండ్…

AP

ఏపీ ప్రజలకు సీఎం గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్‌లోనే 700 సేవలు..

అమరావతి అంటే కేవలం ఓ రాజధానిగా మాత్రమే కాదు.. గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గానూ మార్చాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజన్‌తోనే అభివృద్ధి వెలుగులు సాధ్యమని.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన చర్యలన్నీ చేపడుతున్నట్లు తెలిపారు. వాట్సాప్ మన మిత్ర ద్వారా.. 700 ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక.. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా మార్చేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.   ఈ వారం.. స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వర్నెస్…

AP

విశాఖను ముంచెత్తిన వాన.. జీవీఎంసీ హై అలర్ట్..

సాగర నగరం విశాఖపట్నాన్ని ఆదివారం భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   విశాఖ నగరంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గాజువాక, పెద్ద గంట్యాడలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా గాజువాకలోని డైరీ కాలనీ, హెచ్‌బీ కాలనీ, రిక్షా కాలనీ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి సుమారు…

CINEMA

శ్రీదేవి, రాఘవేంద్రరావు వల్లే ఆ సినిమా హిట్టయింది: నాగార్జున..

తన సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిన ‘ఆఖరి పోరాటం’ సినిమాపై అగ్ర నటుడు అక్కినేని నాగార్జున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ భారీ విజయం సాధించిన చిత్రంలో తానొక బొమ్మలా మాత్రమే ఉన్నానని, అసలు విజయం దర్శకుడు రాఘవేంద్రరావు, నటి శ్రీదేవిలకే దక్కుతుందని చెప్పారు. నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో పాల్గొన్న నాగార్జున, తన కెరీర్ ఆరంభంలోని అనేక సంగతులను గుర్తుచేసుకున్నారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘కమర్షియల్…

TELANGANA

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం..

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కుంగిన ఏడో బ్లాక్‌ను పునరుద్ధరించేందుకు.. అవసరమైన చర్యలను ప్రారంభించింది. దీనికి కావల్సిన మరమ్మతులు చేయడానికి డిజైన్ల రూపకల్పన బాధ్యతలను ప్రభుత్వం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్‌కు అప్పగించారు. అయితే ఈ సంస్థ రామగుండం సీఈ నుంచి సమాచారాన్ని తెలుసుకుని ఒక నివేదికను పంపించింది. దీంతో ఈఎన్సీ అంజద్ హూస్సేన్ తదుపరి చర్యలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని పనుల…

AP

తెలంగాణ ఆర్టీసీలో కొలువుల జాతర..!

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ)లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కండక్టర్ పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 3 వేల ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి విడతలో భాగంగా 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.   ఈ మేరకు నియామకాలకు అనుమతి కోరుతూ టీఎస్ఆర్టీసీ…

National

ఒడిశాలో బయటపడ్డ బంగారు ఖనిజ నిక్షేపాలు..

ఒడిశాలో భారీ స్థాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు బయటపడినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల నిక్షేపాలను గుర్తించినట్లు తెలిపింది. సుందర్ గఢ్, నవరంగ్ పూర్, కియోంజర్, దేవగఢ్ జిల్లాల్లో ఇప్పటికే బంగారు నిక్షేపాల వెలికితీత పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ క్రమంలో మైనింగ్ కార్పొరేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ పరిశోధనలు చేపట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర…

AP

అనంతపురంలో ఉద్రిక్తత… ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బ్యానర్లు చించేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్..

అనంతపురం నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లం…కొ… అంటూ జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయాన్ని ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఆడియో క్లిప్‌లో ఎమ్మెల్యే ఎన్టీఆర్‌ను దూషించారని ఆరోపిస్తూ, అభిమానులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.   నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహిరంగంగా…