News

AP

ఎరువులు అక్రమంగా నిల్వచేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయండి: మంత్రి నాదెండ్ల..

రాష్ట్రంలో ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తూ, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి అక్రమార్కులపై సాధారణ 6ఏ కేసులు కాకుండా, నేరుగా పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్) కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్‌చార్జి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో…

AP

4 కార్పొరేషన్లకు 51 మంది డైరెక్టర్లను నియమించిన ఏపీ సర్కారు..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతల పదవుల పందేరం కొనసాగుతోంది. ఇటీవల 11 కార్పొరేషన్లకు సంబంధించి 120 మంది డైరెక్టర్లను, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించిన ప్రభుత్వం, తాజాగా మరో నాలుగు కార్పొరేషన్లకు 51 మంది డైరెక్టర్లను నియమించింది.   ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు 16 మంది, వెనకబడిన తరగతుల సహకార సంఘానికి ఐదుగురు, కమ్మ కార్పొరేషన్‌కు 15 మంది, రాష్ట్ర నూర్ బాషా దూదేకుల కార్పొరేషన్‌కు 15 మంది డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

AP

తిరుపతి-షిర్డీ రైలుపై సీఎం చంద్రబాబు ప్రతిపాదన..! కేంద్రం ఆమోదం..

తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ వరకు తాత్కాలిక ప్రాతిపదికన నడుస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 07637/07638)కు రైల్వే శాఖ శాశ్వత హోదా కల్పించింది. ఈ మేరకు రైలును క్రమబద్ధీకరించి రెగ్యులర్ రైలుగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు.   ఈ నిర్ణయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 2న రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ పంపారు.  …

National

దేశం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం ఓటేయండి: ఎంపీలకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి..

ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి పార్లమెంటు సభ్యులకు కీలక విజ్ఞప్తి చేశారు. దేశంపై ప్రేమ ఉంటే, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనే తపన ఉంటే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇది కేవలం వ్యక్తిగత మద్దతు కోసం కాదని, భారత గణతంత్ర స్ఫూర్తిని నిలబెట్టడం కోసం వేసే ఓటు అని ఆయన స్పష్టం చేశారు.   ఈ మేరకు ఉభయ సభల ఎంపీలకు ఆదివారం…

TELANGANA

స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..! కామారెడ్డిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ప్రణాళిక రచించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో ‘బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభ ద్వారానే స్థానిక ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించాలని భావిస్తోంది.   ఈ కార్యక్రమానికి…

TELANGANA

గురుకులాలను నరక కూపాలుగా మార్చారు.. రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్..

రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల పరిస్థితిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలు నరక కూపాలుగా మారాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్, పాముకాట్లు, విష జ్వరాల బారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.   ఈ సందర్భంగా హరీశ్ రావు స్పందిస్తూ.. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. కల్తీ ఆహారం పెడితే…

AP

తురకపాలెంలో మరో మెలియాయిడోసిస్ కేసు నిర్ధారణ

గుంటూరు జిల్లా తురకపాలేంలో మెలియాయిడోసిస్‌ వ్యాధి కలకలం రేపుతోంది. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరికి ఈ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా కలెక్టర్ ఎస్‌. నాగలక్ష్మి తెలిపారు. 46 ఏళ్ల బాధితుని మోకాలిలోని ద్రవ నమూనాను పరీక్షించగా, మెలియాయిడోసిస్ వ్యాధి అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరింత వైద్యపరీక్షల కోసం ఎడమ మోకాలికి ఎంఆర్‌ఐ స్కానింగ్ చేసినట్లు తెలిపారు. ఇదివరకే ఒక…

AP

ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు ముందే భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ..!

ఆంధ్రప్రదేశ్‌లో పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై దృష్టి సారించినట్లు సమాచారం.   గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. ఆదివారం కూడా ముఖ్య అధికారులతో కలిసి విస్తృతంగా చర్చించారు. మొదటి విడత బదిలీల జాబితా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో అధికారికంగా జాబితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.   ఎవరెవరు…

National

మోదీ-ట్రంప్ బంధం చాలా ప్రత్యేకం: కేంద్ర మంత్రి జైశంకర్..

భారత్-అమెరికా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వ్యక్తిగత సంబంధాలు బలంగా ఉన్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఇరువురు అగ్రనేతల స్నేహబంధంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.   ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ జైశంకర్ ఈ విషయంపై స్పందించారు. “అమెరికాతో మన భాగస్వామ్యానికి ప్రధాని మోదీ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.…

TELANGANA

ఖైరతాబాద్ వినాయకుడికి ఘన వీడ్కోలు.. ముగిసిన నిమజ్జనం..

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఒక ఘనమైన వేడుక. దీనిని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. 71 ఏళ్ల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో “శ్రీ విశ్వశాంతి మహా శక్తి గణపతి” రూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న ఈ విగ్రహం, హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లతో ముందుకు…