News

TELANGANA

హైకోర్టు న్యాయవాదికి హైడ్రా కమిషనర్ వార్నింగ్..

హైదరాబాద్‌లో హైడ్రా దూసుకుపోతోంది. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా అక్రమార్కుల గుండెల్లో భయం పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని.. ఎక్కడ సమస్య ఉంటే అక్కడకు వెళ్లి యాక్షన్ షురూ చేస్తోంది హైడ్రా టీం. అయితే బాధితుల సమస్యలు వినడానికి వెళ్ళిన హైడ్రా కమిషనర్ కు .. హైకోర్టు న్యాయవాదికి మధ్య వివాదం జరగడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.   ఈ ఘటనకు సంబంధించి పవర్తి వివరాల్లోకి వెళ్తే..…

TELANGANA

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారుల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవ కమిషనర్‌ను పౌరసరఫరాల శాఖ సూచించింది. కాగా, కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.   రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త కార్డుల జారీ ప్రారంభించిన సమయంలో.. ఎంపిక చేసిన గ్రామాల్లో సుమారు లక్ష కార్డులను పంపిణీ…

National

కీచ‌కులుగా మారిన టీచ‌ర్లు.. 13 ఏళ్ల బాలిక‌పై సామూహిక అత్యాచారం..

పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పాల్సిన టీచ‌ర్లే కీచ‌కులుగా మారారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన‌ ముగ్గురు ఉపాధ్యాయులు 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే… త‌మిళ‌నాడు కృష్ణ‌గిరి స‌మీపంలో ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 13 ఏళ్ల బాలిక 8వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది.   అయితే, గ‌త కొన్ని రోజులుగా విద్యార్థిని స్కూల్‌కి రావ‌డం లేదు. ఈ విష‌య‌మై ప్ర‌ధానోపాధ్యాయుడు, తోటి విద్యార్థినులు ఆరా తీయ‌గా దాట‌వేత ధోర‌ణితో స‌మాధానం చెప్పుకొచ్చింది.…

TELANGANA

ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం..

తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయాల ప్రకారం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐటీసీ కాకతీయ హోటల్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈటో మోటార్స్ నుంచి ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. రాష్ట్రంలోని ఈవీ పాలసీ ప్రకారం, రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్‌ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు.…

AP

వైసీపీ హయాంలోని మద్యం అక్రమాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి రూ. 90 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. నగదు లావాదేవీలతో పాటు హోలోగ్రామ్‍‌ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.   ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో…

TELANGANA

ఈ నెల 10న కొడంగల్‌లో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష..

కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ఈ నెల 10వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష జరగనుంది. ఈ రైతు నిరసన దీక్షలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొననున్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఈ దీక్షను నిర్వహించనుంది.   రాహుల్ గాంధీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ బూటకం: కేటీఆర్   బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి…

AP

జగన్ 2.0ని చూస్తారు.. ఎవరినీ వదిలిపెట్టను: జగన్

ఈసారి జగన్ 2.0ని చూస్తారని… కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తొలి విడతలో ప్రజల కోసం పని చేశానని… ఆ క్రమంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వలేకపోయానని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జగన్ 1.0లో కార్యకర్తలకు అంతగా చేసుండకపోవచ్చని… జగన్ 2.0లో వేరుగా ఉంటుందని చెప్పారు. విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ…

AP

త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

ఎన్నికల హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా త్వరలోనే అమల్లోకి తెస్తామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీని అమలు చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పరీక్షలు నిర్వహించి జాయినింగ్ లెటర్స్ ఇస్తామని తెలిపారు.   భీమవరంలో కూటమి నేతలతో గొట్టిపాటి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు.  …

TELANGANA

కుల సర్వే, బీసీలకు సీట్లు, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..

తెలంగాణలో రాజకీయంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో సామాజిక, ఆర్థిక, కుల గణనపై చర్చ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.   కుల సర్వేను మొత్తం నాలుగు భాగాలుగా విభజించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వాటిలో మొదటి మూడు భాగాలను సభలో ప్రవేశపెడుతున్నామని…

National

చోరీ సొమ్ముతో సినీ నటికి రూ. 3 కోట్ల ఇల్లు..

చోరీలు చేస్తూ అప్పనంగా సంపాదించిన సొమ్ముతో తనకు పరిచయమైన ఓ సినీ నటికి రూ. 3 కోట్లతో ఇల్లు నిర్మించి ఇచ్చాడో చోర శిఖామణి. అంతేకాదు, అంత విలాసవంతమైన ఇంటికి మరింత అందాన్ని తెచ్చే పెట్టేందుకు రూ. 22 లక్షలతో ఆక్వేరియం కొని బహుమతిగా ఇచ్చాడు. తాజాగా ఓ కేసులో దొరికిన నిందితుడు విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసులకు మతిపోయినంత పనైంది.   బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన పంచాక్షరి స్వామి…