వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో రాష్ట్రమంతా తెలుసు.. షర్మిల సంచలన వాఖ్యలు..
వెన్నుపోటు అనే పదానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్…. ఆ పదానికి పేటెంట్ హక్కులు కూడా ఆయనకే దక్కుతాయి” అంటూ ఏపీ కాంగ్రెస్ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో, ఇవాళ వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించడంపై షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు.వైసీపీ నిర్వహించే ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి ఎలాంటి అర్థం లేదని, రక్త సంబంధాన్ని అడ్డుపెట్టుకొని అవసరాలకు, పాదయాత్రలకు వాడుకొని వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఎవరిదో…