News

TELANGANA

హైదరాబాద్‌ రిసాలబజార్‌ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా..! డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు..,!

గంజాయికి బానిసగా మారిన కాబోయే డాక్టర్లు పోలీసులకు చిక్కారు. కాలేజీ క్యాంపస్‌‌లు, హాస్టల్స్‌‌ అడ్డాగా చేసుకొని మత్తులో ఉగుతున్న స్టూడెంట్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని రిసాలబజార్‌ కేంద్రంగా సాగుతున్న మత్తు దందాను తెలంగాణ ఈగల్‌ టీం ఛేదించింది. ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు పెడ్లర్లతోపాటు 81 మంది వినియోగదారులపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో నగరంలోని ఓ వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్య విద్యార్థులు ఉన్నారు. కొందరిని పరీక్షించగా…

AP

లిక్కర్ కేసు.. విమానంలో నేతలు-బ్యూటీలు, జల్సాల గుట్టు బయట పెట్టిన ఆనం..

ఏపీలో లిక్కర్ కేసు వ్యవహారంలో వెంకటేష్ నాయుడు చుట్టూ తిరుగుతోంది. ఆయన టీడీపీకి చెందిన నేత అంటూ వైసీపీ నేతలు చెప్పడం మొదలుపెట్టారు. ఆయన వైసీసీ నేత అంటూ కీలక విషయాలు బయటపెట్టింది టీడీపీ. తాజాగా విమానాల్లో నేతల జల్సాల గురించి బయటపెట్టారు ఆ పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి.   ఏపీ లిక్కర్ స్కామ్ గురించి కొత్త కొత్త విషయాలు బయటపెట్టింది టీడీపీ. ఈ కేసులో వైసీపీ నేతలకు ప్రమేయముందని కుండబద్దలు కొట్టేశారు టీడీపీ…

AP

ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం….

ఏపీలో కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టినట్టు స్పష్టమవుతోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) 30వ భాగస్వామ్య సదస్సుకి ఏపీ సిద్ధమవుతోంది. విశాఖలో ఈ సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ సదస్సు విజయవంతం కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం తాజాగా సమావేశమైంది. ‘ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అనే నినాదంతో పరిశ్రమలను ఆకర్షించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. కొత్త పరిశ్రమలు రావడం ద్వారా, మరిన్ని పెట్టుబడులను తేవడం ద్వారా ఏపీలో ఉపాధి, ఆర్థిక…

National

ఉత్తరాఖండ్ భారీ వరదలు..! ఊరు గల్లంతు.. భారీ ప్రాణ నష్టం..!

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరదలు పెను బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరకాశీలోని ధరాలీలో కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద బురదతో ఆ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా, తాజాగా దాదాపు పది మంది సైనికులు వరదనీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.   వరదకు తీవ్రంగా ప్రభావితమైన ధరాలీ గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. హర్షిల్ ఆర్మీ క్యాంపస్‌కు దిగువన ఉన్న సైనికులు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.…

TELANGANA

సినీ కార్మికుల వేతనాలు పెంచాలి: మంత్రి కోమటిరెడ్డి

టాలీవుడ్ సినీ పరిశ్రమలో కార్మికులు, నిర్మాణ సంస్థల మధ్య కొద్దికాలంగా నలుగుతున్న వేతన వివాదంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనే బాధ్యతలను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రకటించారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సినీ కార్మికుల వేతనాల పెంపు ఆవశ్యకతను నొక్కి చెప్పారు. “హైదరాబాద్ వంటి నగరంలో జీవించాలంటే కచ్చితంగా వేతనాలు పెంచాల్సిందే” అని ఆయన…

AP

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది..!: మంత్రి లోకేష్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని, దీనికి నిదర్శనంగా జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయని రాష్ట్ర ఐటీ, విద్య, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళవారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను వెల్లడించారు.   రాష్ట్రంలో 2017లో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నడూ లేనంతగా 2025 జూలై నెలలో రూ.3,803 కోట్లు వసూలైనట్లు లోకేశ్ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే…

TELANGANA

ఈవీఎంలు వద్దు… బ్యాలెట్ విధానం మళ్లీ తీసుకురండి: ఈసీని కోరిన బీఆర్ఎస్ ..

ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) వాడకంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటి స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. మంగళవారం నాడు ఢిల్లీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులతో సమావేశమై పలు కీలక అంశాలపై వినతిపత్రం సమర్పించింది.   ఈవీఎంల విశ్వసనీయతపై గత కొన్నేళ్లుగా అనేక సందేహాలు తలెత్తుతున్నాయని, చాలా రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు…

AP

కూటమి ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది..!: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పేట్రేగిపోయిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మద్యం వ్యాపారం, అక్రమ ఇసుక తవ్వకాలు, అమరావతి భూముల వ్యవహారాల్లో అవినీతి తారస్థాయికి చేరిందని ఆయన మంగళవారం విమర్శించారు.   ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ సెల్ న్యాయవాదుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు ప్రమాదకర స్థాయికి చేరాయని అన్నారు. హైదరాబాద్,…

National

అందుబాటులోకి రానున్న ‘పాన్ 2.0’..

దేశంలోని పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ శుభవార్త చెప్పింది. పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య), టాన్ (పన్ను తగ్గింపు, సేకరణ ఖాతా సంఖ్య) సంబంధిత సేవలను మరింత సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక ‘పాన్ 2.0’ ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రస్తుతం మూడు వేర్వేరు పోర్టళ్లలో అందుబాటులో ఉన్న ఈ సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ప్రముఖ ఐటీ సంస్థ ఎల్టీఐమైండ్‌ట్రీకి అప్పగించినట్లు ఓ ఉన్నతాధికారి సోమవారం వెల్లడించారు.…

AP

కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం: పవన్ కల్యాణ్.

ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి రైతులను వేధిస్తున్న ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన ‘ఆపరేషన్ కుంకీ’ విజయవంతమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం మొగిలి ప్రాంతంలో పంటలను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగుల గుంపును.. శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు విజయవంతంగా అడవిలోకి తరిమికొట్టాయని వెల్లడించారు. ఈ ఆపరేషన్ సఫలం కావడంతో సరిహద్దు ప్రాంతాల రైతులకు భరోసా లభించినట్లయిందని పేర్కొన్నారు.…