News

AP

కదిరిలో వైభవంగా తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి ఉత్సవాలు: ఆదియోగి పల్లకి సేవలో పాల్గొన్న ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే కందికుంట

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్వర్యంలో కన్నుల పండుగగా తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ మహాశివ రాత్రి ఉత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ మహాశివ రాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు ఈశా ఫౌండేషన్ సద్గురు టీం వారిచే ఆదియోగి పల్లకి సేవ ఉత్సవం,శివాంగ స్ఫూర్తి,రుద్రాభిషేకం,తిమ్మమ్మ గారి జీవిత చరిత్ర గానం,సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున విచ్చేసిన భక్తులుకు అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్…

AP

తిమ్మమ్మ మర్రిమానులో వైభవంగా ప్రారంభమైన తిమ్మమాంబ, మహాశివరాత్రి ఉత్సవాలు: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ గారు.

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్వర్యంలో తిమ్మమ్మ మర్రిమాను లో ఘనంగా ప్రారంభమయిన తిమ్మమాంబ,మహాశివరాత్రి ఉత్సవాలు సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్.పీ.కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గూటి బైలు) గ్రామంలో ఘనంగా ప్రారంభమయిన తిమ్మమాంబ మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్ గుస్సాడి నృత్యాలతో, హిమాన్షు శాస్త్రీయ భరత నాట్యంతో కళాకారులు అద్భుతంగా అలరించారు. అనంతరం…

AP

తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ…

శ్రీ సత్య సాయి జిల్లా…… తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ… శివరాత్రి మహోత్సవం సందర్భంగా వి.వి.ఐ.పిల రాక, భక్తులకు అనుగుణంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు… డ్రోన్, సిసి కెమెరాలతో పాటు నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా… ఉత్సవాలకు పోలీస్ శాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం…… భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం….. లేపాక్షి, హేమావతి, తిమ్మమ్మ మర్రిమాను, కాటి కోటేశ్వర ఆలయాల వద్ద పోలీసులతో బందోబస్తు…

CINEMA

‘ధురంధర్’ విలన్ పాత్రపై నాగార్జున క్లారిటీ: ఆ వార్తల్లో నిజం లేదన్న కింగ్ నాగ్!

రూమర్లకు చెక్ పెట్టిన నాగార్జున ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను నాగార్జున తిరస్కరించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో నాగ్ విలన్ పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో, డేట్స్ సర్దుబాటు కాక ‘ధురంధర్’ను వదులుకున్నారని అంతా భావించారు. అయితే, ఈ వార్తలపై నాగార్జున స్పందిస్తూ, తనకు అసలు ‘ధురంధర్’ టీమ్ నుండి ఎలాంటి ఆఫర్ రాలేదని స్పష్టం చేశారు. ఆ వార్తలన్నీ కేవలం…

AP

కాంగ్రెస్ గాలిలో మేడలు కట్టింది.. మా అంచనాలు కొంచెం తగ్గాయి: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అంచనాలపై కేటీఆర్ నిజాయితీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, బీఆర్ఎస్ కనీసం 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని తాము అంచనా వేశామని కేటీఆర్ అంగీకరించారు. అయితే, తుది ఫలితాల్లో ఆ సంఖ్య ఆశించిన దానికంటే కొంత మేర తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ అడ్డంకులు, అధికార యంత్రాంగం దుర్వినియోగం వంటి అంశాలు ఫలితాలపై ప్రభావం చూపాయని ఆరోపించారు. అయినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలపై…

TELANGANA

కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్: కాంగ్రెస్ గూటికి వడ్డేపల్లి విజేతలు.. సీఎం రేవంత్ సమక్షంలో చేరిక!

జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ అనూహ్యంగా కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థులు 8 చోట్ల విజయం సాధించారు. కవిత ఈ విజయాన్ని తన రాజకీయ బోణీగా భావించిన కొద్ది గంటలకే, గెలిచిన ఎనిమిది మంది కౌన్సిలర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఒక్క వార్డు మాత్రమే…

AP

ఏపీలో దివ్యాంగులకు అదిరిపోయే వార్త: ‘ఇంద్రధనస్సు’ పథకంతో ఉచిత బస్సు ప్రయాణం!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రకటించారు. ఈ పథకానికి “ఇంద్రధనస్సు” అని పేరు పెట్టారు. గతంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో 50 శాతం రాయితీ మాత్రమే ఉండేది. అయితే, ఈ కొత్త పథకం అమల్లోకి వచ్చిన తర్వాత, వారు మహిళల మాదిరిగానే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ మరియు సిటీ బస్సులలో రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయం ద్వారా…

AP

బడ్జెట్‌లో అన్నీ అబద్ధాలే.. అప్పులెంతో ఎందుకు చెప్పలేదు?: ప్రభుత్వంపై బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం!

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం అంతా అబద్ధాల మయమని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సభలో వాస్తవాలను దాచి అబద్ధాలు చెప్పడం పెద్ద నేరమని ఆయన మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి కొత్తదనం లేదని, గతంలో తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ పుస్తకాన్నే మళ్లీ చదివినట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పుల గురించి పదేపదే మాట్లాడే కూటమి ప్రభుత్వం, ఈ బడ్జెట్‌లో రాష్ట్రంపై ఉన్న అసలు అప్పు ఎంత ఉందో…

CINEMA

మెగా వారసుల పేర్లు వెల్లడి: శివరామ్, అన్వీరా దేవిగా నామకరణం.. ఆధ్యాత్మిక అర్థాలతో చరణ్ దంపతుల ఎంపిక!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కవల పిల్లల పేర్లను వెల్లడిస్తూ మెగా అభిమానులకు తీపి కబురు అందించారు. ఈ నెల 11న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నారుల బారసాల కార్యక్రమం వైభవంగా జరిగింది. అబ్బాయికి ‘శివరామ్ కొణిదెల’ అని, అమ్మాయికి ‘అన్వీరా దేవి కొణిదెల’ అని నామకరణం చేశారు. ఈ పేర్ల వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థాలను, కుటుంబ అనుబంధాన్ని చరణ్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. పేర్ల ఎంపికపై…

TELANGANA

వడ్డేపల్లిలో కవిత మార్క్ పాలిటిక్స్: ‘సింహం’ గుర్తుపై పోటీ చేసి మున్సిపాలిటీ కైవసం!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ సత్తాను చాటారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర పంథాను అనుసరిస్తున్న ఆమె, తొలి అడుగులోనే భారీ విజయాన్ని నమోదు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత మద్దతుదారులు ఘనంగా కైవసం చేసుకున్నారు. కొత్త పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ విజయం కవిత రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాదిగా విశ్లేషకులు భావిస్తున్నారు.…