News

AP

రెవెన్యూ క్లినిక్‌తో రైతులకు ఊరట: 24 గంటల్లోనే పరిష్కారమైన ఏళ్లనాటి 22A భూ సమస్య

రాష్ట్రంలో భూ సమస్యలతో రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి, రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెవెన్యూ క్లినికల్ నిర్వహిస్తుంది అందులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం లో కదిరి రూరల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి కొంతమంది చెందిన రైతుల భూ సమస్యల్ని రెవెన్యూ క్లినిక్ ద్వారా ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం గాని సెక్షన్ 22A భూ సమస్య ను కేవలం 24 గంటల్లో కదిరి శాసనసభ్యులు…

CINEMA

ప్రభాస్ సింప్లిసిటీకి ఫిదా: ‘హీరో గారు.. మీరు చాలా మంచివారు’ అంటూ మారుతి కుమార్తె ఎమోషనల్ పోస్ట్!

వరుస భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం ‘ది రాజా సాబ్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రభాస్ వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్ర దర్శకుడు మారుతి కుమార్తె హియా దాసరి వేదికపై ఉన్న ప్రభాస్‌ను పలకరించడం, ఆయన ఎంతో ఆత్మీయంగా ఆమెతో…

TELANGANA

అసెంబ్లీలో అరుదైన దృశ్యం: కేసీఆర్‌ను పలకరించి, కరచాలనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల తొలిరోజు సభలో అత్యంత ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. సభ ప్రారంభం కాగానే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ తన స్థానంలో వచ్చి కూర్చున్నారు. గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కరచాలనం (Shake hand) చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం సభలో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,…

TELANGANA

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థినుల మృతి!

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు కాలిఫోర్నియాలో జరిగిన ఒక భయంకరమైన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన కడియాల భావన, మేఘనలుగా గుర్తించారు. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఈ యువతులు మరణించడంతో వారి కుటుంబాల్లో మరియు గార్ల గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. భావి భారతం కోసం కలలు కంటూ విదేశాలకు వెళ్ళిన తమ పిల్లలు ఇలా శవాలై తిరిగి వస్తున్నారన్న వార్త…

AP

ముస్లిం సమైక్యవేదిక శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గం ప్రధాన కార్యదర్శి గా S. రషీద్

  ముస్లిం సమైక్యవేదిక శ్రీ సత్యసాయి కదిరి నియోజవర్గం ప్రధాన కార్యదర్శి గా నాకు అవకాశం కల్పించిన ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ గారికి ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నజీర్ భాషా గారికి మరీ ముఖ్యంగా మా రాష్ట్ర నాయకులు షామీర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే కదిరి నియోజవర్గ అధ్యక్షుడు నసీరుద్దీన్ ముస్లిం హక్కులను కాపాడుకుంటూ ఇతర వర్గాల వారికి అండగా నిలుస్తూ నాకు ఇచ్చిన ఈ పదవి గౌరవం…

AP

కదిరి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సంబరాలు: రేపు ఉత్తర ద్వారం గుండా శ్రీవారి దర్శనం

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 30.12.25 వ తేదీ మంగళవారం ఉదయం 3.30 నిమిషాల నుంచి శ్రీ వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తారు. శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి విచ్చేయుచున్న భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా గుడి తిరువీధులలో…

AP

కదిరిలో ఆధ్యాత్మిక శోభ: రెండు రోజుల పాటు ‘ఇస్తిమా’ ప్రార్థనలు.. భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో రెండు రోజుల ఇస్తిమా(సామూహిక ప్రార్థనలు), భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులు. ఇస్లాం పాటించే వారంతా విశ్వాసంతో అల్లాహ్ ను ప్రార్దించాలని, విశ్వాసమే ఇస్లాంకు గీటురాయి అని ముస్లిం మతపెద్దలు పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని నూతన బైపాస్ రోడ్డు పక్కన శనివారం మధ్యాహ్నం నుంచి ఇస్తెమా ప్రారంభమైంది. పలువురు ముస్లిం మత పెద్దలు బయాన్ (ప్రసంగాలు) చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ అల్లాహ్ పై విశ్వాసం కలిగి…

AP

వేమన స్వామి సన్నిధిలో కదిరి ఈవో వెండి శ్రీనివాస్, పవన్ కుమార్ రెడ్డిలకు ఘన సత్కారం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేమన స్వామి ఆలయాన్ని కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో వెండి శ్రీనివాస్ మరియు టీడీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు, స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నేత నంద వేమరెడ్డి ఆధ్వర్యంలో ఈవో వెండి శ్రీనివాస్ మరియు పవన్ కుమార్…

AP

కదిరి వైసీపీ సమన్వయకర్త మాక్బూల్‌ను కలిసిన బెంగళూరు ఐటీ వింగ్ సభ్యులు

కదిరి వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మాక్బుల్ అన్న గారిని మర్యాద పూర్వకంగా కలిసిన IT wing సభ్యులు ఈరోజు బెంగుళూరు ఐటీ వింగ్ విజయ రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో కదిరి సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారిని కలిసి పార్టీ బలోపేతానికి చేయవలసిన తగు సూచనలు సలహాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం లో ముకుంద రెడ్డి, మురళి రామ్, వెంకటరెడ్డి, కేశవ, వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు

AP

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలి: ఎల్సీ (LC) తీసుకోకుండా స్తంభం ఎక్కించడంతో యువ కూలీ మృతి

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి:- విద్యుత్ కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం పట్నం గ్రామంలో చోటుచేసుకుంది రాచు వారిపల్లి తాండాకి చెందిన యువకుడు సాయికుమార్ నాయక్ విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద దినసరి కూలీగా పని చేస్తున్నాడు… పట్నం గ్రామంలో ఎల్ సి తీసుకోకుండానే సాయికుమార్ నాయక్ ను స్తంభం ఎక్కించడం వల్ల ప్రమాదం జరిగి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు విద్యుత్ శాఖ…