News

TELANGANA

ప్రజా పాలనకే పట్టం: ప్రభుత్వంపై నమ్మకంతోనే కాంగ్రెస్ అఖండ విజయం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన అఖండ విజయంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న **’ప్రజా పాలన’**కు పట్టం కట్టారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వపై ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకం మరియు విశ్వాసమే ఈ భారీ విజయానికి ప్రధాన కారణమని పేర్కొంటూ, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ప్రతి ఓటరుకు ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం కేవలం ప్రభుత్వానిది మాత్రమే…

AP

విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధీమా!

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసానికి గురిచేసిందని, ప్రస్తుతం తమ కూటమి ప్రభుత్వం ఆ శిథిలాల నుంచి నవ్యాంధ్రను పునర్నిర్మిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చట్టసభ గౌరవాన్ని తగ్గించి, దానిని ‘బూతుల అడ్డా’గా మార్చారని జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. సభలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సభా గౌరవాన్ని కాపాడటమే తమ ప్రాధాన్యతని, ఇటీవల…

AP

ఘనంగా రఘువీరా రెడ్డి 69వ జన్మదిన వేడుకలు: ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు

గౌ. డా.నీలకంఠాపురం రఘువీరా రెడ్డి గారి 69 వ జన్మదినం సందర్భంగా ఆయన ఇంటి ఇలవేల్పు అయిన శ్రీమథ్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి రఘువీరా గారి పేరు మీద అభిషేకం, అర్చన చేపించడం జరిగింది. అపర భగిరథుడు, మా లాంటి యువతకు ఆదర్శం , మాకు మార్గ నిర్ధేశకులు , క్రమశిక్షణ , కఠోర శ్రమ , అన్నింటికీ మించి మానవత్వానికి , నిజాయితీకి నిలువెత్తు రూపం జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు…

CINEMA

నాని ‘ది ప్యారడైజ్’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు!

నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదల తేదీ మారింది. తొలుత మార్చి 26న విడుదల కావాల్సిన ఈ సినిమాను, ఇప్పుడు ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో నాని ‘జడల్’ అనే అత్యంత శక్తివంతమైన మాస్ పాత్రలో నటిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద పండగల సీజన్‌ను క్యాష్ చేసుకోవాలనే పక్కా వ్యూహంతోనే మేకర్స్ ఈ…

TELANGANA

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్: 15 రోజుల్లో కొత్త హెల్త్ స్కీమ్!

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) అమలుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా సుమారు 1.44 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారిపై ఆధారపడిన 12.84 లక్షల మంది కుటుంబ సభ్యులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందనున్నాయి. ఈ మేరకు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన హెల్త్‌కేర్ ట్రస్ట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే 15 రోజుల్లోనే ఈ…

TELANGANA

కేసీఆర్‌ను జైలుకు పంపేందుకు రూల్స్ ప్రకారం వెళ్తాం.. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గర్జన!

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ సీఎం కేసీఆర్ మరియు బీఆర్ఎస్ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక ఆరోపణలు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయని, చట్టం మరియు నిబంధనల ప్రకారమే కేసీఆర్ పై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. “తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి” అని వ్యాఖ్యానించిన ఆయన, తమది కక్ష సాధింపు రాజకీయాల నైజం కాదని, కానీ తప్పు చేసిన వారు ఎవరైనా…

AP

లడ్డూ వివాదంపై బాబును వదిలేయొద్దు: ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ ధ్వజం!

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ, తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారని విమర్శించారు. కల్తీ నెయ్యి సరఫరాకు, వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని, వాస్తవానికి చంద్రబాబు హయాంలోనే ట్యాంకర్ల సరఫరా జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సింది, క్షమాపణలు కోరాల్సింది చంద్రబాబేనని జగన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీని గుర్తించకుండా…

AP

కదిరిలో కార్మిక గర్జన: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల భారీ ర్యాలీ, మానవహారం!

సత్యసాయి జిల్లా కదిరిలో సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె కేంద్రం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు వ్యతిరేకిస్తూ కదిరిలో ర్యాలీ.. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, సిఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు.. ఏఐటీయూసీ,సిఐటియు కార్మిక, కర్షక సంఘాలు,బ్యాంకు ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బందితో అంబేద్కర్ సర్కిల్లో మానవహారం ప్రజా న్యూస్ కదిరి

AP

కదిరిలో ఘనంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి: ‘సమర్పణ దివస్’ నిర్వహించిన బీజేపీ శ్రేణులు

  పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా కదిరిలో బిజెపి ఆధ్వర్యంలో సమర్పణ దివస్… భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షలు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ జిఎం శేఖర్ స్వామి గారి ఆదేశాల మేరకు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు బిజెపి కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి బంగ్లా లో ఘనంగా నివాళులు అర్పించి సమర్పణ దివస్ కార్యక్రమం…

CINEMA

దృశ్యం 3: రంగంలోకి ప్రకాశ్ రాజ్ – అక్షయ్ ఖన్నా స్థానంలో జైదీప్ అహ్లావత్!

అజయ్ దేవగణ్, అభిషేక్ పాఠక్ కాంబినేషన్‌లో వస్తున్న ‘దృశ్యం 3’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్టులో చేరడం ఆసక్తికరంగా మారింది. గతంలో ‘సింగం’ చిత్రంలో అజయ్ దేవగణ్, ప్రకాశ్ రాజ్ మధ్య జరిగిన పోరాటం ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. మళ్ళీ చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ప్రకాశ్ రాజ్ తన పాత్ర గురించి స్పందిస్తూ.. ఇది ఒక ‘సెన్సేషనల్…