కాళేశ్వరం విచారణ.. మాజీ సీఎం కేసీఆర్ హాజరు తేదీ మార్పు..!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరింత సమయం కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కమిషన్, విచారణకు హాజరయ్యే తేదీని మార్పు చేసింది. వాస్తవానికి జూన్ 5న కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉండగా, ఇప్పుడు జూన్ 11న హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, నాణ్యత…