త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ..! రూ.10, రూ.20 నోట్ల ట్రయల్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
దేశంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రూ. 10, రూ. 20 విలువ కలిగిన ప్లాస్టిక్ పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ ప్రయోగాల్లో భాగంగా రూ. 10, రూ.…

