News

National

కేంద్రం ‘ఆపరేషన్‌ సిందూర్‌ 2.0’ చేపట్టనుందా..?

‘ఆపరేషన్‌ సిందూర్‌ 2.0’ పేరుతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ జారీ చేసినట్లు ప్రచారంలో ఉన్న ఆ పత్రం పూర్తిగా నకిలీదేనని తేల్చిచెప్పింది. ఆ లేఖకు కేంద్ర రక్షణ శాఖతో గానీ, ప్రభుత్వంతో గానీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.   పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఈ మేరకు సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ప్రకటన విడుదల చేసింది.…

National

దేశవ్యాప్తంగా ‘ఎల్ నినో’ ముప్పు.. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో వర్షాభావం..

రైతులకు, వ్యవసాయ రంగానికి ఆందోళన కలిగించే ఒక కీలక అప్‌డేట్ వాతావరణ శాఖ నుండి వచ్చింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో దేశంలోని దాదాపు 12 రాష్ట్రాలపై ‘ఎల్ నినో’ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. ఖరీఫ్ 2026 సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.   ఎల్ నినో…

AP

పవన్ కల్యాణ్ గారు.. సీబీఐ విచారణకు ఆదేశించండి: అంబటి రాంబాబు..

23 ఏళ్ల యువకుడు గాదె సాయికృష్ణను లాకప్‌ డెత్ చేశారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. “సాయికృష్ణను పోలీసులు హత్య చేసి శవాన్ని మాయం చేశారు. దేశంలో ఇంత ఘోరమైన లాకప్ డెత్ ఎక్కడా జరగలేదు” అని ఆరోపించారు. “సాయికృష్ణ మేనమామ నవరంగ్ నా దగ్గరకు వచ్చి జనసేన కార్యకర్తనని చెప్పారు. సాయికృష్ణ తల్లి వేదన ఎవరినైనా కలచివేస్తుంది. పార్టీలకు అతీతంగా ఈ అంశంపై ఉద్యమం చేయాలి” అని పిలుపునిచ్చారు. ఈ అంశంపై…

National

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి..!

యువతలో ఆన్‌లైన్‌లో సంచలనంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి జరిగింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సోమవారం ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఒక్కసారిగా చెంపపై కొట్టడంతో దీప్కే ఆత్మరక్షణ కోసం ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది.   నీట్ పేపర్ లీక్, దేశంలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై సీజేపీ…

AP

టెక్నాలజీ, ఎయిర్ కనెక్టివిటీ.. సింగపూర్ పర్యటనలో చంద్రబాబు కీలక భేటీలు..

సింగపూర్ లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, సోమవారం అక్కడ కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో భేటీ అనంతరం ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్-సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతంపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా ఏపీలోని విమానాశ్రయాల నుంచి సింగపూర్‌కు, అలాగే ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులు, ఎయిర్ కనెక్టివిటీని…

AP

రాయలసీమ రైతు అద్భుతం..! అనంతపురం గడ్డపై ఎర్రెర్రని ఆపిల్ సాగు..!

సాధారణంగా కాశ్మీర్, సిమ్లా వంటి చల్లటి ప్రాంతాల్లో పండే యాపిల్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోనూ పండుతున్నాయి. మండుటెండలకు, కరవుకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఓ రైతు అద్భుతం సృష్టించారు. గారలదిన్నె మండలం, కొత్తంక గ్రామానికి చెందిన రైతు ఎన్.వి. రమణారెడ్డి తన పొలంలో ఎర్రటి, రసవంతమైన యాపిల్స్ పండించి అందరినీ ఆశ్చర్యపరిచారు.   ఇజ్రాయెల్‌కు చెందిన ప్రత్యేకమైన, వేడిని తట్టుకునే ‘KLD’ రకం యాపిల్స్‌ను ఆయన సాగు చేశారు. 2024లో తనకున్న 2.5 ఎకరాల పొలంలో…

TELANGANA

71 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా ‘పెద్దన్న’ను ఒప్పించలేకపోయారు: రేవంత్ పై కేటీఆర్ ఫైర్..

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు సాధించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని ఆయన సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సీఎం నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.   యూపీ, అహ్మదాబాద్, విశాఖపట్నం వంటి నగరాలకు కేంద్రం మెట్రో ప్రాజెక్టులు మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు ఎందుకు తేలేకపోయారో రేవంత్…

TELANGANA

తెలంగాణకు అలర్ట్… జూన్ 19 నుంచి భారీ వర్షాలు..

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలతో పాటు జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. జూన్ 19 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇవి వారం రోజుల పాటు కొనసాగవచ్చన్న వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస…

TELANGANA

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..! ఇకపై స్కూల్స్ లో బ్రేక్ ఫాస్ట్, మిడ్డే మీల్స్ స్కీమ్ ..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేయనుంది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. పేద విద్యార్థులు ఆకలితో అలమటించకుండా నిరంతరాయంగా పౌష్టికాహారాన్ని అందించేందుకు విద్యాశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది.   పథకం ముఖ్య ఉద్దేశ్యం.. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల నుంచి పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు వచ్చే విద్యార్థులు మధ్యాహ్నం భోజనం…

TELANGANA

ఇందిరాపార్క్ వద్ద ‘కాక్రోచ్’ల ధర్నా..! విద్యార్థులు, యువత రాక, పేపర్ లీకేజీలపై ఆగ్రహం..

దేశంలో ఎడ్యుకేషన్ విభాగం ప్రధానంగా దృష్టి సారించింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తోంది. మెట్రోపాలిటన్ సిటీలతోపాలు టైర్ -2 నగరాల్లో ఆందోళలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం శాంతియుత నిరసనలు చేపట్టింది.   హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన   హైదరాబాద్‌లో ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రారంభమైంది. ఇంటర్, నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి…