కేంద్రం ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ చేపట్టనుందా..?
‘ఆపరేషన్ సిందూర్ 2.0’ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ జారీ చేసినట్లు ప్రచారంలో ఉన్న ఆ పత్రం పూర్తిగా నకిలీదేనని తేల్చిచెప్పింది. ఆ లేఖకు కేంద్ర రక్షణ శాఖతో గానీ, ప్రభుత్వంతో గానీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రకటన విడుదల చేసింది.…

