AP

AP

పులగంపల్లి బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు – సిమెంట్ లారీ ఢీ, 10 మందికి గాయాలు

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి సమీపంలో బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కదిరి నుంచి హిందూపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బెంగళూరు నుంచి పులివెందుల దిశగా వెళ్తున్న సిమెంట్ లారీని ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు స్పందించి 108 అత్యవసర వాహనం ద్వారా క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ బస్సు…

AP

ఉత్సాహంగా సాగిన కదిరి మండల అండర్-12 క్రికెట్ ఎంపికలు…

కదిరి మండల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు under 12 క్రీడాకారుల సెలెక్షన్స్ జరిగాయి. ఈ సెలెక్షన్స్ లో under 12 విభాగం లో 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బౌలింగ్, బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ నైపుణ్యలను పరీక్షించారు. ఈ ఎంపికకు సీనియర్ క్రీడాకారుడు సంపంగి అనిల్ కుమార్ సెలెక్టర్ గా వ్యవహరించారు. ఈ క్రీడాకారులకు మ్యాచ్ లు నిర్వహించి తుది జట్టును అనంతపురం లో జరుగు పోటీలకు పంపుతారు. ఈ సందర్బంగా సెలెక్టర్ అనిల్…

AP

కదిరిలో ఘనంగా టిడిపి పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కదిరిలో ఘనంగా టిడిపి పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్ భారతదేశ రాజకీయాలలో ఒక సంచలంగా మొదలైనటువంటి ప్రస్థానం ఎవరిదైనా ఉందంటే ఆల్ టైం రికార్డ్ ఎన్టీఆర్ దే పార్టీ స్థాపించిన 90 రోజుల్లో అధికారంలోకి రావడం చారిత్రాత్మకం పటేల్, పట్వారి వ్యవస్థలకు…

AP

కాకినాడలో రూ.18 వేల కోట్ల భారీ ప్రాజెక్టు: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్!

రాష్ట్ర భవిష్యత్తుకు ‘గేమ్ ఛేంజర్’: సుమారు రూ.18,000 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా పరిశ్రమగా రూపొందుతోందని, పర్యావరణహిత ఇంధన ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు తొలి దశ ఉత్పత్తి 2027 జూన్ నాటికి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. సహజ వనరుల వినియోగం – ఎగుమతుల…

AP

టీటీడీ కీలక నిర్ణయం: కళ్యాణ మండపాలపై భక్తుల అభిప్రాయ సేకరణకు హెల్ప్ లైన్!

ప్రత్యేక హెల్ప్ లైన్ మరియు సమీక్ష: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కళ్యాణ మండపాల మెరుగుదలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భక్తులు మరియు ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలను స్వీకరించడానికి ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలలో ప్రస్తుతమున్న పరిస్థితులు, అవసరమైన మార్పులపై భక్తులు ఈ హెల్ప్ లైన్ ద్వారా తమ సూచనలను పంచుకోవచ్చు. క్షేత్రస్థాయిలో శ్రీవారి…

AP

శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పార్వేట ఉత్సవం: కుమ్మరవాండ్లపల్లిలో కొండలరాయుడికి ప్రత్యేక పూజలు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలసిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పార్వేట ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా స్వామివారు ‘కొండలరాయుడి’ రూపంలో కదిరికొండ నుంచి ఊరేగింపుగా కుమ్మరవాండ్లపల్లికి తరలివచ్చారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గ్రామ పొలిమేరల్లో స్వామివారికి మంగళవాయిద్యాలు, భజనల మధ్య గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. కుమ్మరవాండ్లపల్లికి చేరుకున్న కొండలరాయుడిని స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మరియు…

AP

కదిరిలో రూ. 32 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

సత్య సాయి జిల్లా కదిరి కదిరిలో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. 75 మంది లబ్ధిదారులకు, 32 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్ 18 నెలల కాలంలో 350 మంది లబ్ధిదారులకు మూడు కోట్ల రూపాయలు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసాం కూత వేటు దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కదిరి నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు…

AP

శబరిమలలో కనులపండువగా మకరజ్యోతి దర్శనం: పులకించిన లక్షలాది మంది భక్తులు!

కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో మకర సంక్రాంతి వేళ అత్యంత పవిత్రమైన మకరజ్యోతి దర్శనం భక్తులకు లభించింది. బుధవారం సాయంత్రం 6:30 గంటల నుండి 6:45 గంటల మధ్య పొన్నాంబలమేడు కొండపై దివ్యజ్యోతి మూడుసార్లు ప్రకాశించింది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. “స్వామియే శరణం అయ్యప్ప” అంటూ భక్తులు చేసిన శరణుఘోషతో శబరిగిరులు మారుమోగిపోయాయి. మకరజ్యోతి దర్శనానికి ముందు పందళం రాజప్రసాదం నుండి తీసుకొచ్చిన పవిత్రమైన తిరువాభరణాలను (స్వామివారి ఆభరణాలు)…

AP

విశాఖకు మరిన్ని వందే భారత్ రైళ్లు: కేంద్రానికి ఏపీ బీజేపీ ఎమ్మెల్యే లేఖ!

ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయం నగరం లోపలే ఉంది, అయితే ఇది జూన్ లేదా జూలై నెలల్లో భోగాపురానికి మారనుంది. భోగాపురం ఎయిర్‌పోర్టు నగరం నుండి సుమారు 45-50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా రైల్వే సేవలను బలోపేతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. విశాఖ నుంచి విజయవాడ, తిరుపతి, చెన్నై, హైదరాబాద్ మరియు బెంగళూరు వంటి నగరాలకు అదనపు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను కేటాయించాలని ఆయన తన లేఖలో విన్నవించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు…

AP

పవన్ కళ్యాణ్ వల్లే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాధాన్యం: అంబటి రాంబాబు

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి డప్పు చప్పుళ్ల మధ్య హుషారుగా స్టెప్పులేసి అందరినీ అలరించారు. ఇదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాలపై తన నిరసనను వ్యక్తం చేస్తూ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన జీవో (GO) ప్రతులను భోగి మంటల్లో వేశారు. వచ్చే ఎన్నికల్లో తాను గుంటూరు నుంచే పోటీ చేస్తానని ఈ వేడుకల వేదికగా ఆయన స్పష్టం చేశారు. తనకు…