కదిరి లక్ష్మీనరసింహస్వామి కొండపై చిరుత సంచారం: భక్తుల్లో నెలకొన్న భయాందోళనలు
శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కదిరి లక్ష్మీనరసింహస్వామి కొండపై చిరుతపులి సంచరిస్తుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా కొండ పరిసర ప్రాంతాల్లో చిరుత అడుగుజాడలు కనిపిస్తుండటంతో, అటు భక్తులు ఇటు స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కొండపైకి వెళ్లే దారిలో చిరుత సంచారాన్ని గమనించిన కొందరు భక్తులు అధికారులకు సమాచారం అందించారు. చిరుత సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొండపైకి వెళ్లే…

