AP

AP

షర్మిల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన జగన్..! ఏమన్నారంటే..?

తెలంగాణలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజకీయ వేడిని రాజేస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవమేనని, ఆ సమాచారాన్ని కేసీఆర్, జగన్ పంచుకున్నారని షర్మిల ఆరోపించారు. తన ఫోన్‌తో పాటు, తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.   ఈ ఆరోపణలపై జగన్ తాడేపల్లిలో జరిగిన…

APTELANGANA

కేసీఆర్, జగన్ నా ఫోన్ ట్యాప్ చేయించారు… రేవంత్, చంద్రబాబు విచారణను వేగవంతం చేయాలి: షర్మిల..

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ లపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆమె మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ, “ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?” అంటూ వైఎస్ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర స్వరంతో…

AP

జగన్ పల్నాడు పర్యటనలో ఆంక్షలు ఉల్లంఘన .. ఎస్పీ కీలక వ్యాఖ్యలు..

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నిన్న పర్యటించిన విషయం విదితమే. జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను ప్రదర్శించాయి. పోలీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పర్యటన సాగింది.   జగన్ జిల్లా పర్యటనపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పల్నాడు పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇవ్వగా,…

AP

ఏపీలో ప్లాస్టిక్ నిర్మూలనకు పటిష్ట చర్యలు..!

రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నగరాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు గట్టి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచుల వినియోగాన్ని విరివిగా ప్రోత్సహించాలని సూచించారు.   మంగళవారం…

AP

లిక్కర్ స్కామ్‌లో మరో ట్విస్ట్..! చెవిరెడ్డి అరెస్టు, ఇంకా ఎంత మంది ఉన్నారో..?

ఏపీ లిక్కర్ కేసులో ఏం జరుగుతోంది? ఇప్పటివరకు అధికారులపై దృష్టి పెట్టిన సిట్.. ఇప్పుడు నేతలపై గురిపెట్టారా? ఈ క్రమంలో చెవిరెడ్డిని అరెస్టు చేశారా? రేపో మాపో వైసీపీ కీలక నేతలు అరెస్టు కానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   ఏపీ లిక్కర్ కేసు కేవలం అధికారుల మాత్రమే నడిపించారని నిన్నటివరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కీలక నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్టు కావడంతో ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. అసలు లిక్కర్‌ కేసుకు ఈయనకున్న…

AP

నేడు పల్నాడుకి జగన్..!

వైసీపీ వేసే అడుగులు.. చేసిన పనులు కూటమి జాగ్రత్తగా గమనిస్తోందా? ఈ మధ్యకాలంలో జగన్ టూర్ల వెనుక అసలు కారణమేంటి? ఏపీలో శాంతి భద్రతలు లేవని క్రియేట్ చేసే పనిలోపడ్డారా? అందుకోసమే పోలీసులు ఆంక్షలు పెట్టారా? అయినా పార్టీ నేత చనిపోయిన ఏడాది తర్వాత ఓదార్పు దేనికి? ఇవే ప్రశ్నలు వైసీపీ కార్యకర్తలను సైతం వెంటాడుతున్నాయి.   కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను నెగిటివ్‌గా మార్చి తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం జగన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ…

AP

అగ్రీగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ .. బాధితుల సొమ్ము చెల్లించేందుకు చర్యలు..!

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త అందింది. అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీలకు చెందిన రూ.1000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ అప్లికేషన్‌కు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టు తాజాగా ఆమోదం తెలిపింది. గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది అగ్రిగోల్డ్ యాజమాన్యం మూలంగా మోసపోయినట్లు ఈడీ గుర్తించింది. బాధితులను ఆదుకునేందుకు ఈడీ కీలక ముందడుగు వేసింది.   తాజాగా అగ్రిగోల్డ్…

AP

ఈ నెల 23 నుంచి ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్ర: సీఎం చంద్రబాబు..

కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో ఇంటింటికీ విజయయాత్ర నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ యాత్ర ద్వారా… ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో…

AP

మానసికంగా చచ్చిపోయాను: పేర్ని నేని కంటతడి..

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కృష్ణా జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వైసీపీ కేడర్‌పై దాడులు చేయించారని ఆరోపించారు.   కూటమి…

AP

అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్..

రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో, అసభ్యకర వ్యాఖ్యల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కృష్ణంరాజును భీమిలి గోస్తనీనది సమీపంలో సెల్‌ టవర్‌ లోకేషన్‌ ఆధారంగా తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను విచారణ నిమిత్తం మంగళగిరికి తరలిస్తున్నట్లు సమాచారం.   వైసీపీ అనుబంధ సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు…