AP

AP

అమరావతికి రూ. 47,000 కోట్లు అవసరం: సీఎం చంద్ర‌బాబు..

రాజధాని అమరావతికి ఇంకా రూ. 47వేల కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డించారు. రాజ‌ధానిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ. 77,249 కోట్లు అవసరం కాగా… వరల్డ్ బ్యాంక్, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఫండింగ్ రూ. 31,000 కోట్లు సమకూరాయ‌ని తెలిపారు. ఇంకా కావాల్సిన నిధులు రూ.47,000 కోట్లు అని వివ‌రించారు.ఆంధ్రప్రదేశ్ అవసరాలు ఇవే..1. పోలవరం-బనకచర్ల అనుసంధానం2. తాగునీటి ప్రాజెక్టులు3. ఐదు పర్యాటక హబ్‌లు(అమరావతి, విశాఖపట్నం, అరకు,…

AP

జగన్ కు టీడీపీ సవాల్… గోశాలలో కలుద్దామన్న భూమన..

తిరుమలలోని ఎస్వీ గోశాల అంశం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. గోశాలలో వందకు పైగా ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ రంగు పులుముకున్నాయి. భూమన వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న భూమనపై కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, తాజాగా భూమనపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

AP

ఏపీ లిక్కర్ స్కాం… చిత్రపురి కాలనీలోని మేఘనా రెడ్డి నివాసంలో సోదాలు..

హైదరాబాద్‌లో ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారుల సోదాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు… హైదరాబాద్‌లోని మద్యం వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ రోజు రాయదుర్గం పరిధిలోని చిత్రపురి కాలనీలో ఉన్న మేఘనా రెడ్డి నివాసంలో మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించారు. ఆమె బ్యాంకు ఖాతా నుంచి కొంత డబ్బును ఉపసంహరించుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో…

AP

పవన్ ‘కన్వర్టెడ్ సనాతని’.. పేర్ని నాని సంచలన వాఖ్యలు..!

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌ ఒక ‘కన్వర్టెడ్ సనాతని’ అని ఆయన అభివర్ణించారు. ఎన్నికలకు ముందు తన వైఖరికి, ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రదర్శిస్తున్న వైఖరికి మధ్య స్పష్టమైన తేడా ఉందని పేర్ని నాని ఆరోపించారు.   పేర్ని నాని మాట్లాడుతూ, “ఎన్నికల ముందు వరకు తనకు అన్ని మతాలు, కులాలు…

AP

జైలులో గోరంట్లకు రాజభోగాలు..!

నిత్యం వార్తల్లో ఉండాలనుకునే వారిలో మాజీ పోలీసు అధికారి, వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకరు. ఆయన అధికారి ఉన్నప్పుడు ఎలాగ ఉండేవారో తెలీదు. ఎంపీగా ఉన్నప్పుడు మాత్రం ఆయన లీలలు అన్నీ ఇన్నీకావు. పదవి లేకపోయినా ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు. చేబ్రోలు కిరణ్‌పై దాడి కేసులో అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన ఉంటున్నారు. అక్కడ కూడా అధికారులకు చుక్కలు చూపిస్తున్నారని తెలుస్తోంది.   వైసీపీలో ఫైర్ బ్రాండ్‌ అవతారమెత్తారు…

AP

నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం..! రాజధాని అమరావతిలో అదనపు భూసేకరణపై చర్చ..!

నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. దీనికి- ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహించనున్నారు. సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. రాజధాని అమరావతిలో అదనపు భూసేకరణ సహా పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నట్లు సమాచారం.   త్వరలో అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉన్నందున.. వీటికి సంబంధించిన అంశాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నాయి. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదిస్తుందని తెలుస్తోంది. గతంలో సీఆర్డీఏ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై…

AP

365 రోజుల్లో వందపడకల ఆసుపత్రి..! మంత్రి నారా లోకేష్ ప్రకటన..!

మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలపడమే తన ధ్యేయమని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, రెండో కేబినెట్ సమావేశంలోనే మంగళగిరికి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి, శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రానున్న 365 రోజుల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.   ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి నియోజకవర్గం…

AP

రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు..!

రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, పదవులపై ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను మాత్రం కచ్చితంగా ప్రజల ముందు ఉంచుతానని ఆయన పేర్కొన్నారు.   కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం ఠాణేలంక…

AP

నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం..!

ఏపీలో ఇప్పటికే పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు వైసీపీ చేజారాయి. తాజాగా ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది.   నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉండగా… వీరిలో 27 మంది వైసీపీ, ఒక టీడీపీ కౌన్సిలర్ ఉండేవారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్లలో 14 మంది జనసేనలో చేరారు. దీంతో నిడదవోలు మున్సిపాలిటీ జనసేన వశమయింది. నిడదవోలు మున్సిపాలిటీ కూడా చేజారి పోవడంతో వైసీపీ…

AP

33 మందితో వైసీపీ రాజకీయ సలహా కమిటీ..! సజ్జలకు కీలక బాధ్యతలు..

వైసీపీ అధినేత జగన్ ఇవాళ తమ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ప్రకటించారు. ఈ పీఏసీలో 33 మంది సభ్యులు ఉన్నారు. ఎంపీలు అవినాశ్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు రోజా, విడదల రజని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేశ్, నారాయణస్వామి, అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ముద్రగడ పద్మనాభం, సాకే శైలజానాథ్, నందిగం సురేశ్ తదితరులకు ఈ…